రాష్ట్రీయం

‘కాల్‌మనీ’పై దర్యాప్తు జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైకాపా నేతల డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 12: విజయవాడలో పేద, మధ్యతరగతి ప్రజలను వడ్డీకి సొమ్ములు ఇచ్చి పీడిస్తున్న కాలమనీ రాకెట్‌పై దర్యాప్తు జరిపించి, దీని వెనక ఉన్న వారు ఎంత పెద్ద వారైన కేసులు నమోదు చేసి శిక్షించాలని వైకాపా డిమాండ్ చేసింది. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పిఏసి సభ్యులు సామినేని ఉదయభాను, ఎమ్మెల్యే విశే్వశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఈ రాకెట్ వెనక అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో ఉండి పరిపాలన చేస్తున్నా, కంటి ఎదుట కాల్ మనీ రాకెట్ దారుణాలకు పాల్పడుతున్నా, వౌనంగా చూస్తూ ఉండటం దారుణమన్నారు. విజయవాడ క్రైమ్ క్యాపిటల్‌గా మారిందన్నారు. అమాయకులైన మహిళలను, యువకులను కాల్ మనీ గ్యాంగ్ వేధింపులకు గురి చేస్తోందని, దిగ్భ్రాంతికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. మహిళలను వ్యభిచారకూపంలోకి లాగుతూ వేధించడాన్ని క్షమించరాదన్నారు. ఈ ఉదంతంపై ఉన్నత స్ధాయి కమిటీ వేసి దర్యాప్తు జరిపించాలన్నారు. పార్టీ క్యాడర్ అరాచకాల పట్ల చూసీ చూడనట్లు వ్యవహరించాలని ముఖ్యమంత్రి గతంలోనే పోలీసులకు సంకేతాలు ఇవ్వడం వల్ల ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయన్నారు.