జాతీయ వార్తలు
వైభవంగా మైసూర్ యువరాజు వివాహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 27 June 2016
మైసూర్: మైసూర్ యువరాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్కు రాజస్థాన్లోని దుంగర్పూర్ రాజ కుటుంబానికి చెందిన త్రిషికా కుమారి సింగ్తో సోమవారం ఉదయం వివాహం జరిగింది. ప్యాలెస్ కల్యాణ మంటపంలో ఉదయం 9.05 నుంచి 9.30 గంటల మధ్య కర్కాటక లగ్నం, సావిత్రి ముహూర్తంలో యదువీర్, త్రిశికా కుమారి సింగ్ల వివాహం జరిగింది. జూన్ 28న ప్యాలెస్లోని దర్బార్ హాలులో వివాహానికి హాజరైన అతిథులకు పెద్ద ఎత్తున రిసెప్షన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 29న సామాన్య ప్రజలకు రిసెప్షన్తో పాటు, జూలై 2న బెంగళూరులోని ప్యాలెస్లో అతిథులకు మరో విందు ఇవ్వనున్నారు.