తెలంగాణ

కాంగ్రెస్‌కు మరో షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రి సమక్షంలో
కారెక్కిన జడ్పీటిసిలు
నల్లగొండ, డిసెంబర్ 19: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. శనివారం జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్‌లీడర్ గుండాల జడ్పీటిసి మందడి రామకృష్ణారెడ్డి, పోచంపల్లి జడ్పీటిసి మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, తిప్పర్తి జడ్పీటిసి తండు సైదులుగౌడ్, వేములపల్లి జడ్పీటిసి ఇరగదిండ్ల పద్మగోవింద్, మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిలర్లు సుశీలజోజి, దుర్గ సత్యం, పత్తిపాటి నవాబులు టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారి పార్టీ మార్పు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ప్రతికూలంగా మారగా టిఆర్‌ఎస్ అభ్యర్ధి తేరా చిన్నపరెడ్డికి లాభాదాయకమైంది. జిల్లా పరిషత్ సమావేశాల్లో కాంగ్రెస్ నుండి కీలకంగా వ్యవహరిస్తున్న రామకృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సైదులుగౌడ్‌లు టిఆర్‌ఎస్‌లో చేరడంతో జిల్లా పరిషత్‌లో ప్రతిపక్ష కాంగ్రెస్ మరింత బలహీనపడినట్లయింది. జిల్లా పరిషత్ సమావేశం నిమిత్తం నల్లగొండకు వచ్చిన కాంగ్రెస్ జడ్పీటీసిలు మందడి, మాడ్గుల, తండులతో మంత్రి జగదీష్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్‌లు రోజంతా మంతనాలు సాగించారు. పిదప సాయంత్రం టిఆర్‌ఎస్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ జడ్పీటీసిలు, కౌన్సిలర్లు టిఆర్‌ఎస్‌లో చేరడం జరిగింది. సీఎం కెసిఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా వారు ప్రకటించారు.