S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/19/2019 - 05:19

నిజామాబాద్, సెప్టెంబర్ 18: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ ప్రకాష్‌రెడి డ(57) సర్వీస్ రివాల్వర్‌తో కణతపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విధులకు హాజరైన సందర్భంగా పోలీస్ ఠాణాలోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. సంఘటన వివరాలిలా ఉన్నాయి.

09/18/2019 - 23:38

గుడివాడ, సెప్టెంబర్ 18: వరకట్నం కోసం భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసింది. సేకరించిన వివరాల ప్రకారం స్థానిక నాగవరప్పాడులో నివాసముంటున్న పెదపూడి శ్రీకాంత్(26) టైల్స్ మేస్ర్తీగా పనిచేస్తున్నాడు. 2013వ సంవత్సరంలో బేబీ అనూషను పెద్దలకు తెలియకుండా ఎత్తుకెళ్ళి వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడు.

09/18/2019 - 23:04

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల బేసి-సరి నెంబర్లు అమలుచేయాలన్న ఆప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌న నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్‌జీటీ) బుధవారం తోసిపుచ్చింది. నవంబర్ 4 నుంచి 15 వరకూ వాహనాలకు బేసి- సరి నెంబర్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

09/18/2019 - 23:01

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: వీవీఐపీ చాపర్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు గౌతం ఖైతాన్‌ను విచారించడానికి మార్గం సుగమమైంది. ఆయనను ఈ కేసులో విచారించకూడదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు వ్యతిరేకించింది.

09/18/2019 - 22:53

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం గత ఏడాది చేసిన విజ్ఞప్తిని ముగ్గురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించింది. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నపుడు అనుసరించాల్సిన విధివిధానాలను మార్చాల్సిన అవసరం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

09/18/2019 - 04:54

హైదరాబాద్, సెప్టెంబర్ 17: గురుకుల పాఠశాలల్లో పీఈటీ ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిలిపేయాలన్న హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ డాక్టర్ గంటా చక్రపాణి, కార్యదర్శి వాణీప్రసాద్‌లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

09/18/2019 - 04:18

కొత్తూరు, సెప్టెంబర్ 17: శ్రీకాకుళం జిల్లా కొత్తూరు తహశీల్దార్ కార్యాలయంపై అవినీతి నిరోధకశాఖ అధికారులు మంగళవారం మధ్యాహ్నం దాడులు నిర్వహించారు. కార్యాలయంలోని వీఆర్వో కె.మదన్‌మోహన్ సుందరరావుపది వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ వీవీఎస్‌ఎస్ రమణమూర్తి ఆధ్వర్యంలో రెండు వాహనాలతో అధికారులు వచ్చి రెవెన్యూ కార్యాలయంపై దాడి చేశారు.

09/18/2019 - 03:51

హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసును విశాఖపట్టణం సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. ఓఎంసీ అక్రమాల కేసులో గాలి జనార్ధనరెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, అలీఖాన్, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మీ, విశ్రాంత ఐఎఎస్ అధికారి బీ కృపానందం, గనుల శాఖ మాజీ అధికారి రాజగోపాల్‌పై సీబీఐ అభియోగపత్రాలను దాఖలు చేసింది.

09/18/2019 - 02:42

విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 17: ఏడో తరగతి చదువుతున్న 13ఏళ్ల బాలికను ఇంట్లో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడిన నిందితునిపై కొత్తపేట పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస గ్రామం నుండి వలస వచ్చిన ఓ కుటుంబం జక్కంపూడి కాలనీలో నివాసముంటోంది. వారికి 17ఏళ్ల బాలుడు, 13ఏళ్ల బాలిక ఉన్నారు. దంపతులిద్దరూ సోమవారం ఉదయం కృష్ణలంకలో పనిచేయడానికి బయటకు వెళ్లారు.

09/18/2019 - 02:42

గుడివాడ, సెప్టెంబర్ 17: గుడివాడ వాసవీచౌక్‌లోని శోభన హోటల్‌లో పురుగుమందు తాగి తల్లీ కొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సేకరించిన వివరాల ప్రకారం తెలంగాణా రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన జానకీదేవి(57), ఆమె కుమారుడు చైతన్య(31)లు హోటల్‌లో రూం నెంబరు 204లో ఈ నెల 9వ తేదీ నుండి ఉంటున్నారు. గతంలో పలుమార్లు వీరిద్దరూ వచ్చి ఇదే లాడ్జిలో బస చేసి వెళ్ళారు.

Pages