S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/18/2019 - 02:30

ఖైరతాబాద్, సెప్టెంబర్ 17: నాంపల్లి ప్రధాన రహదారిపై మంగళవారం ఓ ఆటో బోల్తా కొట్టింది. స్కూల్ పిల్లలతో వెళుతున్న ఆటో అదుపు తప్పి పడిపోవడంతో అందులో ఉన్న నలుగురు చిన్నారులు స్వల్ప గాయాలతో బయటపడగా, ఇద్దరు పిల్లకు గాయాలయ్యాయి.

09/17/2019 - 23:00

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: కర్నాటక అనర్హత ఎమ్మెల్యే కేసు విచారిస్తున్న సుప్రీం ధర్మాసనం నుంచి న్యాయమూర్తి ఎంఎం శంతన్‌గౌడ్ మంగళవారం వైదొలిగారు. అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమారు 17 మంది శాసన సభ్యులపై అనర్హత వేటు వేశారు. దీంతో వారందరూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించాల్సి ఉంది. ముగ్గురు న్యాయమూర్తుల్లో శాంతన్‌గౌడ్ ఒకరు.

09/17/2019 - 04:34

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై జోక్యం చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలవరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని.. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరుతూ జనసేన నేత పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ ప్రాజెక్టు కావడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్టు పేర్కొన్నారు.

09/17/2019 - 04:33

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: జమ్మూ-కాశ్మీర్‌కు వెళ్ళేందుకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్‌ను సుప్రీం కోర్టు సోమవారం అనుమతించింది. అయితే అక్కడ ఎలాంటి రాజకీయ ర్యాలీలు నిర్వహించకూడదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. శ్రీనగర్, జమ్మూ, బారాముల్లా, అనంతనాగ్‌లకు వెళ్ళి అక్కడి ప్రజలను కలుసుకునేందుకు ఆజాద్‌కు అనుమతించింది.

09/17/2019 - 04:07

మాచారెడ్డి, సెప్టెంబర్ 16: విద్యుత్ షాక్ ముగ్గురు రైతులను పొట్టన బెట్టుకుంది. బోరు బావి నుంచి కాలిపోయన సబ్‌మెర్సిబుల్ మోటార్ పంపుసెట్టు బయటకు తీస్తుండగా పైన ఉన్న 11 కేవీఏ విద్యుత్ లైన్‌కు పైపు తగిలి ముగ్గురు రైతుల అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం వెల్పుగొండ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది.

09/17/2019 - 03:16

కైకలూరు, సెప్టెంబర్ 16: కైకలూరు మండలం పల్లెవాడ సమీపంలో సోమవారం ఉదయం ఓ పెను ప్రమాదం తప్పింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనటంతో బస్సులో ఉన్న సుమారు 38 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవటంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. గాయపడ్డ క్షతగాత్రులను హుటాహుటిన కైకలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

09/17/2019 - 03:14

హనుమాన్ జంక్షన్, సెప్టెంబర్ 16: హనుమాన్ జంక్షన్ సమీపంలోని నూజివీడు రైల్వే స్టేషన్ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఏడుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

09/17/2019 - 02:57

కంకిపాడు,సెప్టెంబర్ 16: పునాదిపాడులోని నారాయణ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రగాయాల పాలైన సంఘటన కంకిపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

09/17/2019 - 01:15

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఎర్రమంజిల్ భవనాలను కూల్చి అక్కడ అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలని రాష్ట్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని హైకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం నాడు 111 పేజీల తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కేసుకు సంబంధించి దాఖలైన ప్రజావ్యాజ్య పిటిషన్లలో అంశాలను లోతుగా చర్చించింది.

09/16/2019 - 23:35

శ్రీనగర్, సెప్టెంబర్ 16: కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికైన సీనియర్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లాను అత్యంత కఠినమైన ప్రజా భద్రతా చట్టం కింద సోమవారంనాడు అరెస్టు చేశారు. ఆయన ఉన్న ఇంటినే జైలుగా ప్రకటించారు. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కేంద్రం రద్దు చేసినప్పటినుంచి ఫరూక్ అబ్దుల్లా గృహ నిర్బంధంలోనే ఉన్నారు.

Pages