-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
విజయవాడ పశ్చిమ, సెప్టెంబర్ 14: శనివారం జరిగిన లోక్ అదాలత్ కార్యక్రమంలో వందలాది మంది బాధితులకు న్యాయం జరిగింది. వారిలో సీనియర్ లాయర్, కాంగ్రెస్ నాయకుడు నరహరశెట్టి నరసింహరావు వాదించిన రోడ్డు ప్రమాద మృతుని కుటుంబానికి ఆర్థికపరమైన న్యాయం జరిగింది. ఇటీవల బెంజి సర్కిల్ సమీపంలోని ఫకీరుగూడెం స్కూృబిడ్జీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 22సంవత్సరాల సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందాడు.
హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ లీగల సర్వీసెస్ అథారిటీ పెండింగ్లో పేరుకుపోయిన కేసుల పరిష్కారంపై దృష్టి సారించింది. శనివారం నగరంలోని సికిందరాబాద్, ఎర్రమంజిల్, నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆవరణలో వేర్వేరుగా లోక్ అదాలత్లను నిర్వహించి, ఈ ఒక్కరోజే సుమారు 1438 కేసులను పరిష్కరించినట్లు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, చైర్మన్ ఎన్. తుకారాంజీ తెలిపారు.
కొడంగల్, సెప్టెంబర్ 14: సమస్యల పరిష్కారానికి నిర్వహించిన జాతీయ లోక్ ఆదాలత్లో 33 కేసులను పరిష్కారించారు. శనివారం స్థానిక జూనియర్ న్యాయస్థానంలో జాతీయ లోక్ ఆదాలత్ కార్యక్రమం నిర్వహించారు. న్యాయమూర్తి రామమోహన్రెడ్డి సమక్షంలో ఆరు పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న పలు సమస్యలను పరిష్కారించారు. లోక్ ఆదాలత్ను ప్రారంబిస్తు న్యాయమూర్తి మాట్లాడుతు రాజీ మార్గమే రాజా మార్గంగా లోక్ ఆదాలత్ పనిచేస్తుందన్నారు.
భద్రాచలం టౌన్: చత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో భద్రతా దళాల చేతుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం.. దంతెవాడ జిల్లాలోని కిరణ్డోల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న కుట్రీమ్ దండకారణ్యంలో డీఆర్జీ బలగాలు, కిరండోల్ పోలీసులు సంయుక్త కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
తిరుపతి: చిత్తూరు జిల్లా గంగవరం మండలం మామడుగు వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో కారు అదుపుతప్పి బోల్తాపడి దగ్ధం కావడంతో మంటల్లో ఐదుగురు అక్కడికక్కడే సజీవ దహనం కాగా ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. తన మామ అనారోగ్యంతో బెంగళూరులో ఆసుపత్రిలో ఉండగా పరామర్శించేందుకు భార్య, పిల్లలు, చెల్లెలు, చెల్లెలు కుమారుడు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 13: శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనం కొనసాగింది. ప్రతి ఒక్కరి కృషి ఫలితమే ఉత్సవ వేడుకలు విజయవంతంగా చిన్నపాటి ఘర్షణ కూడా లేకుండా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: దేశ వ్యాప్తంగా 25 హైకోర్టుల్లో 414 న్యాయమూర్తుల పదవులకు ఖాళీలు ఉన్నాయంటే నమ్మండి. ఇది ఎవరో చెప్పింది కాదు, స్వయాన కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వద్ద ఈ నెల ఒకటో తేదీ వరకు ఉన్న సమాచారం ప్రకారం తెలిసింది. 1,079 న్యాయమూర్తుల నియమాకాలకు మంజూరు అయ్యాయి. హైకోర్టు న్యాయమూర్తుల నియమాకాలకు సంబంధించిన జాబితాను సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యుల కొలిజియం ఇదివరకే సిఫార్సులు చేసింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: ఆక్వా చెరువులతో కడలి గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని సంబంధిత చెరువుల యజమానుల నుంచి వసూలు చేసి రైతులకు ఇవ్వాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది. రాజోలు మండలం కడలి గ్రామంలో పంట పొలాల మధ్య రొయ్యల చెరువులుగా మార్చుతున్నారని, దీని మూలంగా పంటనష్టం జరుగుతోందని కడలి రైతుల సంఘం నేతృత్వంలో ఎన్జీటీకి లేఖ రాశారు.
విజయవాడ, సెప్టెంబర్ 13: రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి మూడున్నర నెలలు దాటినా, అధికారుల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మూడు నగర పాలక సంస్థల కమిషనర్లు సహా 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న అజయ్ జైన్ను గృహ నిర్మాణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 13: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల తండ్రి, 1962 బ్యాచ్కు చెందిన విశ్రాంత సీనియర్ ఐఎఎస్ అధికారి బిఎన్ యుగంధర్ (82) శుక్రవారం నాడు హైదరాబాద్లో కన్నుమూశారు. కొద్ది రోజులుగా స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్న యుగంధర్ ఆస్పత్రిలోనే కన్నుమూశారు. నిజాయితీ పరుడిగా , పేదల పక్షపాతిగా, దేశంలో వికలాంగుల సంక్షేమానికి కృషి చేసిన అధికారిగా యుగంధర్ పేరుగడించారు.