S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/28/2019 - 01:45

నేరేడ్‌మెట్, ఆగస్టు 27: చెడు వ్యసనాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలని దొంగతనాలకు పాల్పడుతు తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుండి 15 లక్షల రూపాయల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్న సంఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగింది. మంగళవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు.

08/28/2019 - 01:42

కేపీహెచ్‌బీకాలనీ, ఆగస్టు 27: కన్న కూతురిని ఓ తల్లి బస్సు కిందకు తోసేయడంతో డ్రైవర్ చాక చక్యంగా వ్యవహరించి చిన్నారిని కాపాడాడు. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో భాగ్యనగర్‌కాలనీలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఓ కసాయి తల్లి రెండేళ్ల చిన్నారిని బస్సు కిందకు తోసేయడంతో డ్రైవర్ అప్రమత్తతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది.

08/28/2019 - 01:00

ఖైరతాబాద్ : వీవీఐపీలు నివాసముండే బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. కోటి రూపాయల విలువ కలిగిన అభరణాలు అపహరణకు గురయనట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... కాంగ్రెస్ మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి బంధువు ఉత్తమ్‌రెడ్డి బంజారాహిల్స్‌లో రోడ్ నెంబర్2లో నివాసం ఉంటారు.

08/28/2019 - 05:15

గచ్చిబౌలి: మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. విహన్ డైరెక్ట సెల్లింగ్, గోల్డ్ క్విస్ట్, క్విస్ట్ నెట్ లాంటి కొత్త పేర్లతో వచ్చే మల్టీలెవెల్ మార్కెటింగ్ సంస్థలను నమ్మవద్దని సూచించారు. ‘క్యూనెట్’ నిర్వహకులే కొత్త పేర్లతో ప్రజలను మోసం చేయాడానికి ప్రయత్నిస్తున్నారని సీపీ వివరించారు.

08/27/2019 - 23:56

న్యూఢిల్లీ, ఆగస్టు 27: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పీ చిదంబరం ఈడీ అరెస్టు చేయకుండా సుప్రీం కోర్టు మరొక రోజు గడువు పొడిగించింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో చిదంబరం మనీలాండరింగ్ అభియోగం ఎదుర్కొంటున్నారు. చిదంబరం దాఖలు చేసిన రెండు పిటిషన్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం తన వాదనలు వినిపించింది.

08/28/2019 - 02:18

పెనుబల్లి: ప్రేయసిపై అనుమానం పెంచుకున్న ఒక యువకుడు ఉన్మాదంతో ఆమె ప్రాణాలు తీసిన దారుణం ఖమ్మం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుబల్లి మండల పరిధిలోని కుప్పెనకుంట్ల గ్రామానికి చెందిన కావటి తేజశ్రీ (20), సత్తుపల్లి పట్టణం ద్వారకానగర్‌కు చెందిన బుంగా నితిన్ మూడేళ్ల క్రితం కుప్పెనకుంట్ల ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమోలో చేరారు.

08/28/2019 - 02:37

షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్‌లో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రాష్ట్రంలోని షాజహాన్‌పూర్ జిల్లాలో 24వ జాతీయ రహదారిపై జమ్కా వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి ప్రధాన కారణం ట్రక్కు డైవర్ అతివేగమే కారణమని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

08/28/2019 - 05:14

కంచికచర్ల: కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు చెరువులో ఈతకు వెళ్ళి మంగళవారం మధ్యాహ్నాం ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన గాజలంక గణేష్ (10), శ్రీమంత్ (8), గౌతమ్( 6) ఈముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన పిల్లలు. వీరు ఆడుకునేందుకు చెరువు గట్టు వద్దకు వెళ్ళి చెరువులోకి ఈత కొట్టేందుకు దిగారు.

08/27/2019 - 23:21

చిత్తూరు, ఆగస్టు 27: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్‌రెడ్డిలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిని చిత్తూరు పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

08/27/2019 - 23:14

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఆగస్టు 27: స్థానిక బైపాస్ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ లైన్‌ల మార్పిడి పనులు చేస్తూ ఓ కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుదాఘాతానికి గురై మృతి మంగళవారం మృతి చెందాడు. కాకినాడకు చెందిన కాంట్రాక్ట్ వర్కర్ మోర్తా వెంకట రమణ (35) ఉదయం విద్యుత్ స్తంభం ఎక్కి లైన్‌లు మారుస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై విద్యుత్ స్తంభం పైనే ప్రాణాలు వదిలాడు.

Pages