-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
విజయవాడ (క్రైం), ఆగస్టు 24: కార్లు, మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడిన అంతరాష్ట్ర ముఠాకు చెందిన ఐదుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13కేసుల్లో సుమారు రూ.19.20లక్షల విలువ చేసే పది కార్లు, మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ విజయారావు తెలిపారు. తన ఛాంబర్లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
విజయవాడ పశ్చిమ, ఆగస్టు 24: నీటిపారుదల శాఖ అధికారులను మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న ఇనుప పడవ తొలగింపు చర్యలను దగ్గరగా చూద్దామని నది దిగువ భాగాన ఆఫ్రాన్ వద్ద నీటిలో దిగిన గుర్తు తెలియని వృద్ధుడు నీటి ఒరవడికి కొట్టుకుపోయాడు. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనలో ఆ వ్యక్తిని కాపాడ్డానికి నాటు పడవల వారు ఎన్డీఆర్ఎఫ్ దళం సిబ్బంది ఒరవడి వెంట పరుగులు తీసినా ఫలితం లేకుండా పోయింది.
ఖైరతాబాద్, ఆగస్టు 24: పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రి ప్రధాన గేట్ వద్ద చోటు చేసుకున్న స్నాచింగ్ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. శనివారం పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను ఏసీపీ తిరుపతన్న, సీఐ కరుణాకర్ రెడ్డి, డీఐ నాగయ్య వెల్లడించారు.
భద్రాచలం టౌన్ : చత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కంచుకోట లాంటి అబూజ్మాడ్ దండకారణ్యంలో భద్రతా బలగాలతో శనివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. నారాయణపూర్ జిల్లాలో దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.
అరకులోయ: విశాఖ ఏజెన్సీలో ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులోయ పట్టణ సమీపంలో గిరిజన వివాహిత యువతి శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యింది. గుర్తుతెలియని దుండగులు ఈ యువతిని హత్య చేసేముందు వివస్తన్రు చేసి అత్యాచారానికి పాల్పడినట్టుగా అనుమానాలు వ్యక్తవౌతున్నాయి. విశాఖ గిరిజన ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నర్సింహులపేట: ఒకే కుటుంబంలో ముగ్గురిని పాము కాటేయగా భర్త మృతిచెందగా భార్య, కుమారుడు చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ శివారు ఎర్రచక్రు తండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.
ఖైరతాబాద్, ఆగస్టు 23: నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగిని పరామర్శించేందుకు వచ్చిన ఓ వ్యక్తిని పోలీస్ అని బెదిరించి చైన్ స్నాచింగ్కు పాల్పడ్డ సంఘటన పంజాగుట్టు పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్లో నివాసం ఉండే రవిచంద్ర సింగ్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
న్యూఢిల్లీ, ఆగస్టు 23: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు తాత్కాలిక రక్షణ కల్పిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో సీబీఐ, ఈడీ కేసులను ఆగస్టు 26న విచారించడానికి అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 23: భక్తుడు లేదా దేవుడిని కొలిచే సంస్థ చేసే వాదన ఎప్పుడు కూడా దైవానికి వ్యతిరేకంగా ఉండకూడదని సుప్రీంకోర్టు శుక్రవారం ‘నిర్మోహి అఖారా’కు తెలిపింది. ‘రామ్ లల్లా’ వేసిన వ్యాజ్యాన్ని తిరస్కరించాలని, అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని తనకు అప్పగించాలని, ఎందుకంటే దేవుడి ఏకైక ఆరాధ సంస్థను తానేనని నిర్మోహి అఖారా వాదించిన తరువాత సుప్రీంకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది.
హైదరాబాద్, ఆగస్టు 23: అగ్రిగోల్డ్ కేసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసును ఏపీకి బదిలీ చేయాలన్న పిటిషన్ను సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు విచారణకు చేపట్టే అవకాశం ఉందని తెలిసింది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు నాంపల్లి సీబీఐ కోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.