-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
రాజేంద్రనగర్, ఆగస్టు 20: ఆటో వెనుకనుంచి ఢీకొని మూడు సంవత్సరాల చిన్నారి మృతిచెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కాటేదాన్ ప్రాంతానికి చెందిన వీరన్న లారీ డ్రైవర్. ఇతనికి భార్య, మూడేళ్ల కూతురు రాణి ఉన్నారు. మంగళవారం కాటేదాన్లోని బట్టలషాపుకు వెళ్లారు. షాపింగ్ ముగించుకొని బయటకు వచ్చిన సమయంలో ఆటోను రోడ్డుపై ఆపి డ్రైవర్ టీ తాగడానికి వెళ్లాడు.
ఉప్పల్, ఆగస్టు 20: కాచవానిసింగారంలోని మహేశ్వరినగర్లో మేడిపల్లి పోలీసులు మంగళవారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోకి ప్రవేశించిన పోలీసులు ఎవరిని బయటకు వెళ్ల్లనీయకుండా ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటారు. ఏమి చేస్తారు. పూర్తి వివరాలను సేకరించారు.
తాండూరు, ఆగస్టు 20: లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖ అధికారులకు ఆర్డబ్ల్యూఎస్ డీఈ చిక్కారు. వర్క్ ఇన్స్పెక్టర్ను కూడా ఏసీబీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బషీరాబాద్ మండలంలో మిషన్ భగీరథ పైప్లైన్ పనులను కాంట్రాక్టర్ గురువయ్య పూర్తిచేశాడు. బిల్లుల కోసం ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీనివాస్, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్ను పలుసార్లు కలిశాడు.
హైదరాబాద్ : అశ్లీల చిత్రాలు, సాహిత్యాన్ని అందించే వెబ్సైట్లను ఎందుకు కట్టడి చేయడం లేదని హైకోర్టు మంగళవారం నాడు గూగుల్ సెర్చి ఇంజన్ను ప్రశ్నించింది. పోర్న్వెబ్సైట్లకు సంబంధించి పూర్తి వివరాలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. పోర్న్ వెబ్సైట్లపై తగిన చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు విచారణ చేపట్టింది. అశ్లీల వెబ్సైట్ల బరితెగింపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్ : కోర్టు ధిక్కారణ కింద ఇద్దరు రెవిన్యూ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, కొండపాక తహసీల్దార్ ప్రభుకు హైకోర్టు రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఇద్దరూ చెరో రెండు వేల రూపాయిలు చొప్పున జరిమానా కూడా చెల్లించాలని పేర్కొంది.
గచ్చిబౌలి, ఆగస్టు 20: గొలుసు కట్టు వ్యాపారం పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ ఎండీని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ పెట్టుబడితో కోట్లు సంపాదించ వచ్చని విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేస్తున్న ఈబిజ్ ఎండీ పవన్ మల్హన్ను ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణం కేసులో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. దీంతో దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీలకు అయనను అరెస్టు చేయడానికి మార్గం సుగమమయింది.
విజయవాడ : పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం రద్దుపై నవయుగ సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు మంగళవారం ముగిశాయి. అర్ధంతంరంగా తమ ఒప్పందాన్ని రద్దు చేసి, రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్కు వెళ్లడంపై నవయుగ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది.
రాజనందగావ్, ఆగస్టు 20: చత్తీస్గఢ్లోని రాజనందగావ్ జిల్లాలో ఊపీరి ఆడక 10 ఆవులు మృతి చెందాయి. యజమాని అనాలోచిత చర్య వల్లే అవి మృత్యువాత పడ్డాయి. భారీ వర్షాలు కురుస్తున్నందున రాజనందగావ్ జిల్లాలోని బార్బస్పూర్ గ్రామంలో రైతు తన 10 అవులను లోపలి గదిలో బంధించి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే వాటికి గాలి, వెలుతురు అందక మృత్యువాతపడ్డాయి.
ముంబయి : ఓ హత్య కేసులో గ్యాంగ్స్టర్ చోటా రాజన్కు, మరో ఐదుగురికీ ముంబయి కోర్టు ఎనిమిదేళ్ళు కఠిన కారాగార శిక్ష విధించింది. ఇంకా నిందితులందరికీ రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించింది. 2012 సంవత్సరం అక్టోబర్లో ఓ హటల్కు చెందిన బీఆర్ శెట్టి అంధేరిలోని తన స్నేహితున్ని కలిసేందుకు వెళుతుండగా మార్గ మధ్యంలో చోటా రాజన్, ఆయన అనుచరులు దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత రాజన్ ఇండోనేషియాకు పారిపోయాడు.