S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/19/2019 - 22:50

శ్రవస్తి, ఆగస్టు 19: త్రిపుల్ తలాక్‌ను తిరస్కరించిందని ఓ వివాహిత మహిళపై ఆమె భార్య, మామ కిరోసిన్ పోసి నిప్పంటించిన వైనం భారత్-నేపాల్ సరిహద్దులోని గాద్రా గ్రామంలో చోటు చేసుకొంది. అయితే, వరకట్న వేధింపులతోనే మహిళను దారుణంగా కొట్టి.. కిరోసిన్ పోసి హతమార్చారని పోలీసులు కేసు నమోదు చేశారు. భిన్న వాదనలు వినిపిస్తున్న ఈ కేసుకు సంబంధించి ఎస్పీ అశిష్ శ్రీవాత్సవ కథనం మేరకు..

08/19/2019 - 06:12

ప్రత్తిపాడు, ఆగస్టు 18: తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు కథనం ప్రకారం..

08/19/2019 - 05:55

ఖమ్మం, ఆగస్టు 18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి భర్త అనిల్ కుమార్‌పై ఖమ్మం రెండో అదనపు జడ్జి ఎం జయమ్మ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. 2009 మార్చి 28న ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఒక పార్టీకి ఓటేయాలని కరపత్రాలు పంచారంటూ ఆయనతో పాటు మరో ముగ్గురిపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ కేసులో మొదటి నిందితునిగా ఉన్న అనిల్ కుమార్ కోర్టుకు హాజరుకావడం లేదు.

08/19/2019 - 05:17

పెనుగంచిప్రోలు, ఆగస్టు 18: శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి వచ్చిన బాలుడు మునే్నటిలో దిగి స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామానికి చెందిన మాణిక్యాల విజయ్ (14) తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ఆదివారం ఉదయం పెనుగంచిప్రోలు గ్రామానికి వచ్చారు.

08/19/2019 - 05:09

ఖైరతాబాద్, ఆగస్టు 18: ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై ఓ కూలి హత్యకు గురైన సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా లింగాల మండలం భూక్యా తాండాకు చెందిన బంగారి (56) నగరానికి వలస వచ్చి స్థిరపడ్డాడు. ఖైరతాబాద్‌లోని మహాభారత్ నగర్‌లో భార్య శాంతి, ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటూ అడ్డా కూలిగా జీవనం సాగిస్తున్నాడు. భార్యతో శనివారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది.

08/19/2019 - 05:08

రాజేంద్రనగర్, ఆగస్టు 18: బ్రేక్ ఫెయిల్ అయి ఓ టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ ఇళ్లలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన రాజేంద్రనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రోడ్డుపై టిప్పర్‌ను పార్కు చేసి టిప్పర్ డ్రైవర్ టీ తాగడానికి వెళ్లాడు. ఉన్నట్టుండి హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కన ఉన్న ఇళ్లల్లోకి టిప్పర్ దూసుకెళ్లింది.

08/19/2019 - 05:04

కీసర, ఆగస్టు 18: ద్విచక్ర వాహనం అదుపుతప్పిన సంఘటనలో యువకుడు మృతి చెందిన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కీసర మండలం, భోగారం గ్రామానికి చెందిన చుంచు పర్వతాలు, హేమలతల కుమారుడు చుంచు రాహుల్ (21) ఆదివారం ఉదయం కుషాయిగూడ నుంచి కీసర వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు.

08/19/2019 - 05:00

బాలాపూర్, ఆగస్టు 18: జిల్లెలగూడ వెంకటేశ్వర నగర్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ గాంధీనారాయణ, సీఐ ఎన్.యాదయ్య కథనం ప్రకారం పాత బస్తీకి చెందిన మురళి లలిత దంపతులు తమ కుటుంబంతో కలిసి గత రెండు సంవత్సరాలుగా జిల్లెలగూడ వెంకటేశ్వర నగర్‌లో నివాసం ఉంటున్నారు. మురళి, లలిత కుమారుడు సందీప్ (30) మెడికల్ రిపజేంట్యీవ్‌గా పని చేస్తున్నాడు.

08/19/2019 - 05:00

వికారాబాద్, ఆగస్టు 18: కోటపల్లి ఎంపీపీ నల్లొల్ల శ్రీనివాస్‌రెడ్డిపై బీర్ బాటిళ్లతో దాడి చేసిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..కోటపల్లి ఎంపీపీ నలొల్ల శ్రీనివాస్‌రెడ్డి స్వగ్రామమైన రాంపూర్ గ్రామానికి చెందిన చేకూరి శ్రీనివాస్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, జగన్‌రెడ్డిలతో కలిసి శనివారం రాత్రి కోటపల్లి పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న ఓ ఫర్టిలైజర్ దుకాణంలో కూచొని మద్యం తాగారు.

08/19/2019 - 00:10

బళ్లారి : కర్నాటకలోని జిల్లా కేంద్రమైన కొప్పళలో ఓ ప్రైవేట్ భవన సముదాయంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌లో ఆదివారం విద్యుత్ షాక్‌కు గురై ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకం ఎగురవేసేందుకు హాస్టల్ భవనం పైభాగంలో డబ్బాలో ఇసుక పోసి ఇనుప స్తంభం ఏర్పాటు చేశారు.

Pages