-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
విశాఖపట్నం(క్రైం) : ముగ్గురు మావోయిస్టులు శనివారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విశాఖ రేంజ్ డీఐజీ ఎల్కేవీ రంగారావు, ఎస్పీ అట్టాడ బాబూజీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో వారిని హాజరు పరిచి, ఇందుకు సంబంధించిన వివరాలను డీఐజీ రంగారావు తెలియజేశారు.
పెనమలూరు : కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డగా, మరో వ్యక్తి చిక్సిత పొందుతూ మరణించిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోనేరుపాడు గ్రామానికి చెందిన భట్టిప్రోలు లీలాకృష్ణ(24), సాయి గంగూరు దగ్గర ఉన్న రిలయన్స్ గోడౌన్లో పనిచూసుకుని విజయవాడకు బైక్ మీద తిరుగుముఖం పట్టారు.
గుడివాడ, ఆగస్టు 17: స్థానిక ధనియాలపేటకు చెందిన దులా భార్గవ్ (24) దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతుడు భార్గవ్ 2018 ఏప్రిల్లో బేతవోలు శ్మశానవాటికలో హత్యకు గురైన ఇలపర్తి నాగచౌదరి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సేకరించిన వివరాల ప్రకారం భార్గవ్ శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటికి సమీపంలో మద్యం తాగుతూ కూర్చున్నాడు.
హైదరాబాద్, ఆగస్టు 17: ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్ గ్యాంగ్ను నగర పోలీసులు అరెస్టు చేశారు. బషీర్బాగ్లోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ముఠాకు సంబంధించిన వివరాలను కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. తార్నాకలో నివాసం ఉండే సతీష్ ఇంట్లో గత నెల 26న జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
కీసర, ఆగస్టు 17: ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని అహ్మద్గూడ వీకర్ సెక్షన్ కాలనీలో నివాసముంటున్న కొర్వి ప్రేమాకర్ (27) సమీపాన గల అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వృత్తిరీత్యా సెంట్రింగ్ పని చేస్తూ జీవించేవాడని తెలిపారు.
షాద్నగర్, ఆగస్టు 17: శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని దుండగులు తవ్వకాలు చేపట్టారు. శనివారం కేశంపేట మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్న పూరాతన దేవాలయం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు దేవాలయంలోకి చొరబడి తవ్వకాలు చేపట్టినట్లు గ్రామస్థులు వివరించారు.
గచ్చిబౌలి, ఆగస్టు 17: సైబరాబాద్ కమిషనరేట్కు కూతవేటు దూరంలో భారీ చోరీ జరిగింది. పోలీసులు నాలుగు లక్షల విలువ చేసే ఆభరణాలు పోయాయంటుంటే బాధితులు 60 తులాల బంగారం, ఐ ఫోన్ పోయినట్లు చెప్పడంపై అనుమానం వ్యక్తమవుతోంది. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని టెలికం నగర్లో ఈ భారీ చోరీ జరిగింది. 60 తులాల బంగారం, ఐ ఫోన్ పోయిందంటూంటే పోలీసులు మాత్రం 4లక్షల విలువ చేసే బంగారం పోయిందని చెప్తున్నారు.
ముంబయి, ఆగస్టు 16: ప్రముఖ సంగీత దర్శకుడు, స్వరకర్త ఖయ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆరోగ్యం క్షీణించడంతో అతడిని ఇక్కడి సుజయ్ హాస్పిటల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్పించారు. ‘కభీయే కభీయే’, ‘ఉమ్రావో జాన్’ వంటి చిత్రాల సంగీత స్వరకర్తగా ఎందరి ప్రశంసలనో అందుకున్న ఖయ్యం ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమి అవార్డుతో పాటు పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం రాష్టప్రతి కోవింద్ ఏయిమ్స్కు చేరుకుని ఐసీయులో చికిత్స పొందుతున్న జైట్లీని చూశారు. అనంతరం జైట్లీ ఆరోగ్యం గురించి ఆసుపత్రి డాక్టర్లు రాష్టప్రతికి వివరించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 16: క్రీస్తు పూర్వం రెండో శతాబ్దానికి ముందే అయోధ్యలోని ప్రస్తుత వివాదాస్పద స్థలంలో అత్యంత విస్తృత స్థాయిలో రామాలయం ఉందని రాంలల్లా విరాజ్మాన్ అనే హిందూ సంస్థ న్యాయవాది సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. అయోధ్యపై రోజువారీ విచారణలో భాగంగా శుక్రవారం కేసు విచారణ జరిగింది.