S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/16/2019 - 22:17

ఎస్.కోట, ఆగస్టు 16: విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం సన్యాసిపాలెంలో శుక్రవారం సాయంత్రం పిడుగు పడి ఉప్పాడ అక్కమ్మ (65) అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతోపాటు అక్కడి పొలంలో పనిచేస్తున్న మరో ఏడుగురు మహిళలకు గాయాలయ్యాయి. దీంతో పక్కనే ఉన్న రైతులు వీరిని ధర్మవరం గ్రామానికి తీసుకువచ్చి ప్రథమ చికిత్సలు నిర్వహించి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.

08/16/2019 - 22:14

అనపర్తి, ఆగస్టు 16: కడుపునొప్పితో బాధపడుతున్న 60 ఏళ్ల వృద్ధురాలికి శస్తచ్రికిత్స చేసిన వైద్యులు ఆమె పిత్తాశయం నుండి ఏకంగా 400 చిన్నా,పెద్దా రాళ్లు తొలగించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గురువారం రాత్రి ఈ శస్తచ్రికిత్స నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కర్రి సునీల్ రెడ్డి, డాక్టర్ బాంధవి తెలిపిన వివరాలిలావున్నాయి.

08/16/2019 - 01:55

హయత్‌నగర్, ఆగస్టు 15: ఆటో ఢీకొని బాలిక మృతిచెందిన సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిదిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా దామచర్ల గ్రామానికి చెందిన గుంటి భాస్కర్ రెండవ కుమార్తె గుంటి దీక్ష(11నెలలు) మూడు రోజులుగా దీక్ష అనారోగ్యంతో బాధపడుతుండగా స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స అందించినా నయం కాలేదు.

08/16/2019 - 01:55

కొత్తూరు, ఆగస్టు 15: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. బుధవారం సాయంత్రం శంషాబాద్ మండలం రాళ్లగూడ గ్రామానికి చెందిన బండ నరసింహా ద్విచక్ర వాహనంపై షాద్‌నగర్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా, మేకగూడ చౌరస్తాలో అదుపుతప్పి కిందపడిపోయాడు. తలకు, శరీరానికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

08/16/2019 - 01:54

ఘట్‌కేసర్, ఆగస్టు 15: ఇంటి ఎదుట ఆడుకుంటున్న బాలుడిని ట్రాలీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి యంనంపేట్‌లో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..

08/16/2019 - 01:52

మెహిదీపట్నం, ఆగస్టు 15: స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు కలిసి ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా దూసుకవచ్చిన బొలోరో వాహనం ఢీకొనడంతో ఓ విద్యార్థి అక్కడికక్కేడే మృతిచెందింది. లంగర్‌హౌస్ ఎస్‌ఐ ఖలీలోద్దీన్ కథనం ప్రకారం.. గోల్కొండ రేతిగల్లికి చెందిన మహ్మాద్ ఖాదీర్ ట్రాఫిక్ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు.

08/15/2019 - 23:17

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలపైన పిటిషన్లపై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. న్యాయవాది ఎంఎల్ శర్మ, కాశ్మీర్ టైమ్స్ సంపాదకురాలు అనూరాధ భాసిన్, నేషనల్ కాన్ఫరెన్స్ వేరువేరుగా వేసిన పిటిషన్లను ఒకే దగ్గరకు చేర్చి, విచారణను కొనసాగిస్తుంది.

08/15/2019 - 06:46

హైదరాబాద్, ఆగస్టు 14: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై బుధవారం నాడూ హైకోర్టులో విచారణ కొనసాగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ కొనసాగించింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను సైతం సరిచేయడం జరిగిందని ప్రభుత్వం తన వాదనలు వినిపించింది.

08/15/2019 - 06:45

నేరేడ్‌మెట్, ఆగస్టు 14: సార్.. మీ.. డబ్బులు కింద పడ్డాయి చూసుకోండి.. మీ చొక్కాపై ఇంక్ పడింది.. బైక్ టైరులో గాలి లేదంటూ దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర రాంజీ దొంగల ముఠా సభ్యులను అరెస్టుచేసి వారివద్ద నుండి నగదు, గంజాయిని ఎల్‌బీనగర్, వనస్థలిపురం ఎస్‌వోటి, సీసీఎస్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

08/15/2019 - 06:10

న్యూఢిల్లీ, ఆగస్టు 14: తన దేశానికి తిరిగి పంపించేయాల్సిందిగా కోరుతున్న పాకిస్తాన్ వాసి అభ్యర్థనపై మీరేమంటారు? అని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై వచ్చే నెల 23వ తేదీలోగా కోర్టుకు తెలియజేయాల్సిందిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విభూ బఖ్రు బుధవారం కేంద్రానికి, ఢిల్లీ రాష్ట్ర (ఆప్) ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు.

Pages