S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

08/13/2019 - 04:19

పామర్రు, ఆగస్టు 12: పంట రుణాన్ని బ్యాంక్‌కు చెల్లించలేని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పామర్రు మండలం పెదమద్దాలి గ్రామానికి చెందిన యార్లగడ్డ నాగేశ్వరరావు అనే రైతు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి, మంత్రి కొడాలి నాని, వైకాపా నేత పాలడుగు రాంప్రసాద్‌ల పేర్లు ఓ కాగితంపై రాసి సోమవారం పురుగుమందు తాగి మృతి చెందాడు.

08/13/2019 - 04:08

విజయవాడ (క్రైం), అగస్టు 12: సంచలనం రేపిన వివాహిత మణిక్రాంతి తల కోసం తీవ్ర గాలింపు కొనసాగుతోంది. ఇదే సమయంలో హత్యకు వినియోగించిన ఆయుధం కేసు దర్యాప్తులో కీలకం కావడంతో కత్తి కోసం కూడా పోలీసులు వెతుకులాట చేపట్టారు. నిందితులకు న్యాయస్థానంలో కఠిన శిక్ష పడుతుందని పోలీసులు చెపుతున్నా తల లేకపోవడంతో దర్యాప్తుకు సంబంధించి న్యాయనిపుణుల సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

08/13/2019 - 03:48

జీడిమెట్ల, ఆగస్టు 12: మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ గోదావరి జిల్లా, ఏలేశ్వరంకు చెందిన రాయుడు నాగేశ్వర రావు (48) కుత్బుల్లాపూర్ పరిధిలోని సూరారం కాలనీ, మైత్రినగర్‌లో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసైన నాగేశ్వరరావు మూడు నెలల క్రితం కుటుంబ సభ్యులతో గొడవ పడి బయటికి వచ్చాడు.

08/13/2019 - 01:04

హైదరాబాద్/శామీర్‌పేట : హైదరబాద్ శివారులోని శామీర్‌పేటలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లిదండ్రులు, కుమారుడు ఉన్నారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పరిధిలోని హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిపై ప్రమాదం జరిగింది.

08/13/2019 - 00:54

గుంటూరు, ఆగస్టు 12: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన విజయవాడ శివారు గోశాలలోని ఆవుల మృత్యువాత కేసును ఛేదించేందుకు రాష్ట్ర డీజీపీ గౌతమ్‌సవాంగ్ దృష్టి సారించారు. కొత్తూరు- తాడేపల్లిలోని గోశాలలో ఈ నెల 9న పెద్దసంఖ్యలో ఆవులు మృత్యువాత పడిన సంఘటనను డీజీపీ ఛాలెంజ్‌గా తీసుకున్నారు. ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) డీజీపీ నియమించారు.

08/12/2019 - 23:38

హైదరాబాద్ / గచ్చిబౌలి, అగస్టు 12: గచ్చిబౌలిలో పల్సర్ బైక్ అదుపుతప్పడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మనువడు కోడూరి దృపద్ (22) మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దృపద్ గౌలిదొడ్డిలో స్నేహితుడు కృష్ణ చైతన్యను సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో వదిలి వస్తుండగా విప్రో సర్కిల్లో సమీపంలో ఘటన చోటు చేసుకుంది.

08/12/2019 - 23:04

హైదరాబాద్, ఆగస్టు 12: అనుమానం, కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన గొల్కొండ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ గొల్కొండలో సోమవారం ఉదయం జరిగిన ఈ దారుణ ఘటన గోల్కొండ పోలీస్టేషన్ పరిధిలోని మోతిమహల్‌లో కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం.. గోల్కొండ మోతీమహల్‌కు చెందిన బషీర్ అహ్మద్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

08/12/2019 - 22:07

న్యూఢిల్లీ, ఆగస్టు 12: కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న 370 అధికరణ రద్దు నేపథ్యంలో కాశ్మీర్‌లో అత్యంత తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించాలని, ప్రజలకు హక్కులను కాలరాశారంటూ దాఖలైన పటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు కీలక విచారణ జరపబోతోంది. కాంగ్రెస్ కార్యకర్త తెహసీన్ పూనావాలా ఈ పిటిషన్ దాఖలు చేశారు.

08/12/2019 - 00:22

వరంగల్, ఆగస్టు 11: కఠిన శిక్షలు కామాంధులను కట్టడి చేయలేకపోతున్నాయ్. ఉరిశిక్షలు కూడా వారి నుండి అమాయకున ఆడపిల్లలను రక్షించలేకపోతున్నాయి. మొన్ననే ఒక కామాంధుడికి ఉరిశిక్ష పడిందని ఊపిరి పీల్చుకునే లోగా వరంగల్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. హన్మకొండ సమ్మయ్య నగర్ కాలనీకి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఆదివారం అత్యాచారానికి గురైంది.

08/11/2019 - 23:08

రణస్థలం, ఆగస్టు 11: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని పైడిభీమవరం పారిశ్రామిక వాడలో ఉన్న అరబిందో రసాయన పరిశ్రమలో ఆదివారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

Pages