-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
కొత్తూరు రూరల్, జూలై 28: విద్యుత్ షాక్కు గురై ఒక మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడినట్లు కొత్తూరు ఎస్ఐ కృష్ణ తెలిపారు. ఆదివారం ఉదయం మండల కేంద్రంలోని భవనం ఫస్ట్ప్లోర్లో మురుగునీరు నిలిచిపోవడంతో ఇనుప కడ్డీతో మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు సమీపంలో ఉన్న విద్యుత్ తీగలకు తగడంతో జయమ్మ (56) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా కోడలు శైలజ (30) తీవ్రంగా గాయపడినట్లు ఎస్ఐ తెలిపారు.
హైదరాబాద్, జూలై 28: అంబర్పేట్ పోలీస్టేషన్ పరిధిలో జరిగిన చైన్స్నాచింగ్ కేసును పోలీసులు 24 గంటలో ఛేదించారు. అంబర్పేట్ డీడీ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్.. విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అంబర్పేట్ డీడీ కాలనీ సాయి బాబా ఆలయం దగ్గర ఓ మహిళ మెడలోంచి గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 27 రాత్రి 9.40 గంటల ప్రాంతంలో బంగారు గొలుసును దొంగలించారు.
మద్దిపాడు, జూలై 28: తిరుమల వెళ్లి దైవదర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై నలుగురు దుర్మరణం పాలైన సంఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లాపల్లి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. కారు డ్రైవర్ అతి వేగంగా నడుపుతూ ముందు వెళుతున్న పాల ట్యాంకర్ను వెనుక వైపు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
శ్రీనగర్, జూలై 27: పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్ టాప్ కమాండర్ ఉగ్రవాది మున్నా లాహోరిని భారత సైనికులు మట్టుబెట్టారు. మున్నాతో పాటు తుర్కవాంగోమ్ షోపియాన్కు చెందిన మీర్ జీనత్-ఉల్-ఇస్లాం ఉగ్రవాది హిజ్బుల్ ముజాహిదీన్ను కూడా శనివారం జమ్మూ-కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హతమార్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
శంషాబాద్, జులై 27: కెన్యా నుంచి ఢిల్లీకి చికిత్స కోసం వస్తున్న ఓ మహిళ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రాణాలు కొల్పోయింది. శంషాబాద్ ఆర్జీఐఏ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్కు చెందిన రూపాల్ బిందేష్ అమె భర్త కెన్యాలో స్థిరపడ్డారు.
రాజేంద్రనగర్, జూలై 27: అనుమానాస్పద స్థితిలో చెరువులో పడి ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ సర్కిల్ శాస్ర్తీపురంకు చెందిన యూసుఫ్ కుమారుడు తౌఫిక్(9), నజీరుద్ధీన్ కుమారుడు రోషుద్ధీన్(13) ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండే స్నేహితులు. కాగా ఈ నెల 25వ తేదీన ఈ ఇద్దరు బాలురు ఆడుకుంటూ వెళ్లిపోయారు.
హైదరాబాద్, జూలై 27: సినీనటుడు శివాజీని దుబాయ్ ఎయిర్ పోర్టు అధికారులు శనివారం అరెస్టు చేశారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లడానికి ప్రయత్నించిన శివాజీని ఎయిర్పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నటుడు శివాజీ టీవీ9 షేర్ల వాటాల కొనుగోలులో నకిలీ పత్రాలు సృష్టించారని టీవీ9 కొత్త యాజమాన్యం అలంద మీడియా శివాజీపై సైబరాబాద్ కమిషనరేట్లో ఫిర్యాదు చేసింది.
న్యూఢిల్లీ: వివాదాస్పద మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కీలకవ్యక్తిగా భావిస్తున్న హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త సానా సతీష్ బాబును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ బాబు కోసం సీబీఐ గత ఏడాదికాలంగా ఎదురుచూస్తోంది.
న్యూఢిల్లీ, జూలై 27: అగస్టావెస్ట్లాండ్ వీవీఐపీ హెలీకాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ మేనల్లుడు రతుల్ పూరికి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఈనెల 29 వరకూ ఆయనను అరెస్టు చేయకుండా న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలు ఇచ్చింది. వీవీఐపీ హెలీకాప్టర్ల కుంభకోణం కేసులో పూరిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
కేపీహెచ్బీకాలనీ, : కూకట్పల్లి వివేకానందనగర్లోని కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత గొట్టిముల పద్మారావు ఇంట్లో దొంగలు చొరబడి లాకర్లు పగలుగొట్టి సుమారు రూ.3కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లారు. సంఘటన కూకట్పల్లిలో కలకలం సృష్టించింది. పోలీసుల కథదం ప్రకారం వివేకానందనగర్లో కాంగ్రెస్ నేత గొట్టిముక్కల పద్మారావు దంపతులు నివాసం ఉంటున్నారు. గురువారం సంగారెడ్డిలోని ఓ కార్యక్రమానికి వెళ్లారు.