S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/27/2019 - 00:25

పెద్దపల్లి రూరల్, జూలై 26: చిన్న నీటి పారుదల శాఖలో పెద్దపల్లి సబ్ డివిజన్ డీఈఈగా పని చేస్తున్న రవికాంత్ శుక్రవారం ఏసీబీ వలకు చిక్కారు. మండలంలోని పెద్దకల్వల గ్రామ సమీపంలో గల ఎస్సారెస్పీ క్యాంపులో గల చిన్ననీటి పారుదల శాఖ డీఈఈ కార్యాలయంలో ఓదెల మండలంలో నీటి పారుదల శాఖకు సంబంధించిన పనులు చేసిన ఓ కాంట్రాక్టర్ నుంచి 80 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

07/27/2019 - 00:12

న్యూఢిల్లీ, జూలై 26: మరణ శిక్ష విధించే విషయంలో 90 శాతం రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాజ్యసభ సమావేశంలో మరణ శిక్షల అంశంపై ప్రైవేటు మెంబర్ బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిస్తూ ఈ అంశం కేంద్రం పరిశీలనలో కూడా ఉందన్నారు.

07/26/2019 - 23:17

న్యూఢిల్లీ, జూలై 26: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల భర్తీపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. గడువులోగా నివేదిక సమర్పించకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు ధర్మాసనం ఎదుట హాజరుకావాల్సి వస్తుందని కోర్టు తీవ్రంగా హెచ్చరించింది.

07/26/2019 - 22:44

విజయవాడ (క్రైం), జూలై 26: రియాలిటీ టీవీ షో బిగ్‌బాస్-3 ప్రసారం నిలిపివేయాలని ఏపీ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ పిల్‌ను దాఖలు చేశారు.

07/26/2019 - 22:37

సికిందరాబాద్, జూలై 26: గాంధీ ఆసుపత్రిలో టిక్‌టాక్‌కు పాల్పడిన ఇద్దరు జూనియర్ డాక్టర్లపై సస్పెన్షన్ వేటు పడింది. సామాజిక మాధ్యమాల్లో భావ ప్రకటన స్వేచ్ఛకు అధికారం ఉన్నప్పటికీ కొంతమంది విచ్చలవిడి కారణంగా అవి దుష్పరిణామాలు కలిగిస్తున్నాయనడానికి ఇదో నిదర్శనం. ఇలాంటి అంశాల పట్ల ఇటీవల నిబంధనలను విధించినప్పటికీ, విద్యావంతులైన యువతీయువకులే ఉల్లంఘనకు పాల్పడడం శోచనీయం.

07/26/2019 - 22:12

వడమాలపేట, జూలై 26: జీవితంపై విరక్తితో తమిళనాడుకు చెందిన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా నగరి కీళపట్టు కుశస్థలీనది వంతెన కింద చోటు చేసుకుంది. ఎస్ ఐ శివశంకర్ కథనం మేరకు తమిళనాడు తిరుత్తణి సమీపం లక్ష్మాపురం గ్రామానికి చెందిన దంపతులు ఇ. ఏలుమలై(79), సులోచన (56) చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు బాబు, గోపీ, ఒక కుమార్తె సరళ ఉన్నారు.

07/26/2019 - 22:11

జి.మాడుగుల, జూలై 26: తేనెటీగలు దాడి చేసిన ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే అత్యవసర సమయంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల వైద్య సహాయం అందకే తమ చిన్నారి మృతి చెందిందని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. తేనెటీగల దాడికి గురై చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన రెండు గంటల తర్వాత వైద్య సేవలు అందించడం, వైద్యం ఆలస్యం కావడం వల్లనే తన కూతురు మృతి చెందిందని మృతురాలి తండ్రి సుబ్బారావు విలపిస్తున్నారు.

07/26/2019 - 21:57

న్యూఢిల్లీ, జూలై 26: దేశంలో మూకదాడులు, సామూహిక హింస నిరోధానికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలు అమలు జరగడం లేదని వచ్చిన ఆరోపణలపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం దానిపై దాఖలైన పిటిషన్‌ను విచారించింది. యాంటీ-కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ అనే సంస్థ పిటిషన్ దాఖలు చేసింది.

07/26/2019 - 04:35

హైదరాబాద్, జూలై 25: అధిక వడ్డీల ఆశ చూపి ఘరానా మోసానికి పాల్పడిన ఘటన పాతబస్తీ డబీర్‌పుర పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలకునే వారిని లక్ష్యంగా నిందితులు మోసాలకు పాల్పడ్డారు. డబీర్‌పురకు చెందిన దంపతులు బుశ్రా, సిరాజ్ ఉర్ రెహామాన్ యూఐఆర్‌సీ పేరిట సొసైటీ స్థాపించారు. సొసైటీలో దాచిన డబ్బులకు రెట్టింపు డబ్బులు ఇస్తామని అమాయక ప్రజలను మోసం చేశారు.

07/26/2019 - 03:42

ఉప్పల్, జూలై 25: ఇంక్రిమెంట్ కోసం తనకు అనుకూలంగా పై అధికారులకు నివేదిక ఇవ్వలేదని ఆగ్రహంతో ఆ సెక్షన్ ఇంచార్జిపై జూనియర్ అసిస్టెంట్ కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన గురువారం ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్ నాగోల్ రోడ్డులోని సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫ్రింగర్ ఫ్రింట్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ (సీడీఎఫ్‌డీ)లో ఈ వెంకటేశ్వర రావు అకౌంట్ సెక్షన్ ఇంచార్జిగా పని చేస్తున్నారు.

Pages