S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/25/2019 - 05:10

నిజామాబాద్, జూలై 24: ఆడుకునేందుకు కారులోకి వెళ్లిన ఇద్దరు చిన్నారులు, డోర్ లాక్ కావడంతో అందులోనే చిక్కుబడిపోయి ఊపిరాడక మృతి చెందారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండాపోయిన బాలురు బుధవారం తెల్లవారుజామున కారు వెనుక సీట్లలో విగతజీవులుగా కనిపించారు. ఈ విషాద సంఘటన నిజామాబాద్ నగరంలోని మాలపల్లి ముజాహిద్‌నగర్‌లో చోటుచేసుకుంది.

07/25/2019 - 04:32

పరిగి, జూలై 24: అనంతపురం జిల్లా పరిగిలో బుధవారం ఆర్టీసీ బస్సు కిందపడి తల్లీకొడుకు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. పరిగి మండలం విట్టాపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు తన భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు నవతేజ్‌తో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో దాన్ని తప్పించబోయి అదుపుతప్పి కిందపడ్డాడు.

07/25/2019 - 04:16

హైదరాబాద్, జూలై 24: బిగ్‌బాస్ కార్యక్రమంపై ఫిర్యాదుల నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని స్టార్‌మా కార్యాలయ అడ్మిన్ హెడ్ శ్రీ్ధర్‌కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బిగ్‌బాస్ ఇన్‌చార్జి శ్యాంతో పాటు రవికాంత్, రఘు, శశికాంత్‌లపై ఈనెల 13న బంజారాహిల్స్ పోలీసులకు పాత్రికేయురాలు శే్వతారెడ్డి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ ఒప్పంద వ్యవహారంతో పాటు కాస్టింగ్ కౌచ్‌పై ఆరోపణలు చేశారు.

07/25/2019 - 01:49

గన్నవరం, జూలై 24: ఉంగుటూరు - ఆత్కూరు జాతీయ రహదారిపై స్వచ్చ్భరత్ ట్రస్టు సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు మోటారు సైకిల్‌ను ఢీకొన్న సంఘటనలో మోటారు సైకిల్‌పై ఉన్న ఇద్దరు మృతి చెందారు. ఆత్కూరు పోలీసుల కధనం ప్రకారం పొట్టిపాడుకు చెందిన మిర్యాల వీరాస్వామి (48), కారుకొండ సురేష్ (32) మోటారు సైకిల్‌పై వస్తుండగా పొట్టిపాడు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది.

07/25/2019 - 01:34

గచ్చిబౌలి, జూలై 24: సిగరేట్ లైటర్‌ని తుపాకీగా చూపించి 3.6 కోట్ల రూపాయలను దోచుకెళ్లారు. యజమాని లావాదేవీలు చూసిన కారు డ్రైవరే ముఠాను ఏర్పాటు చేసి దోపిడీకి పథకం వేశాడు. మొదటి ప్రయత్నంలో విజయం సాధించడంతో రెండోసారి దోపిడీకి పథకం వేసిన నిందితులను జహీరాబాద్‌లో కాపుకాసి సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 3.6 కోట్ల రూపాయల విలువ చేసే నగదు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసున్నారు.

07/25/2019 - 00:54

హైదరాబాద్, జూలై 24: సకల సదుపాయాలతో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనాన్ని కాదని, కొత్తగా అసెంబ్లీ భవనం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం ఎర్రమంజిల్ భవనం కూల్చివేతకు హెచ్‌ఎండీఏ నుండి అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించింది.

07/25/2019 - 04:40

మండపేట : తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో నాలుగేళ్ల బాలుడు జషిత్ కిడ్నాప్ ఉదంతం రాష్టవ్య్రాప్త సంచలనం సృష్టిస్తోంది. సోమవారం రాత్రి నానమ్మతో కలిసి ఇంట్లోకి వెళుతున్న బాలుడిని బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా ఎత్తుకెళ్లిపోయారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగినా ఫలితం లేకపోయింది.

,
07/25/2019 - 05:06

మిర్యాలగూడ టౌన్/మల్యాల : వివిధ కారణాలతో రెండు జిల్లాల్లో ఐదుగురు మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందులతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం సంతోష్‌నగర్‌లో ఇద్దరు, జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ (కొత్తపల్లె) గ్రామంలో ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మిర్యాలగూడ సంతోష్‌నగర్‌కు పారేపల్లి లోకేష్ రైస్‌మిల్లులో చిన్నపాటి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

07/24/2019 - 23:45

న్యూఢిల్లీ, జూలై 24: ఇసుక అక్రమ తవ్వకాలు, లీజు ఒప్పందాల ఉల్లంఘనలపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌కు సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్రం సహా ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎస్ బాబ్డే విచారణకు స్వీకరించింది.

07/24/2019 - 23:44

న్యూఢిల్లీ, జూలై 24: కర్నాటక రాజకీయాల్లో మూడు వారాల పాటు సాగిన సంక్షోభానికి తెరపడిన నేపథ్యంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు తమ పిటిషన్ ఉపసంహరించుకొంటున్నామని సుప్రీంకోర్టుకు తెలియజేశారు. కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని ఉటంకిస్తూ అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్‌కుమార్ తక్షణమే బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంకర్, హెచ్ నగేష్‌లు సుప్రీంను ఆశ్రయించారు.

Pages