-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
నిజామాబాద్, జూలై 21: అభంశుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి తెగబడ్డాడు. విషయం తెలుసుకున్న పలువురు గ్రామ పెద్దలు చిన్నారి కుటుంబీకులకు, నిందితుడికి మధ్య రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆదివారం ఈ దురాగతం వెలుగుచూసింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కామాంధుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. సంఘటన వివరాలిలా ఉన్నాయి.
కూచిపూడి, జూలై 21: చెరకు సాగులో సంభవించిన నష్టం కారణంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొవ్వ మండలం పెడసనగల్లులో చోటు చేసుకుంది. కూచిపూడి ఎస్ఐ ప్రతాప్రెడ్డి ఆదివారం అందించిన వివరాల ప్రకారం పెడసనగల్లుకు చెందిన కొనకళ్ల విజయ కుమార్ (52) గత ఏడాది పెనమకూరులో ఐదున్నర ఎకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని చెరకు సాగు చేశాడు.
ఉప్పల్, జూలై 21: ఇతరుల ప్లాటును కబ్జా చేసి తప్పించుకు తిరుగుతున్న ఓ వ్యక్తిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మరో నలుగురి కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు.
నాంపల్లి, జూలై 20: నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో శనివారం రాత్రి షేక్ సద్దాం(27) దారుణ హత్యకు గురయ్యాడు. అతని మిత్రులిద్దరూ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సద్దాంను తల నరికి హత్య చేశారు. మొండెం నుంచి తలను వేరు చేసి నేరుగా తలతో పోలీస్ స్టేషన్కు వెళ్లి నిందితులు లొంగిపోయారు.
హైదరాబాద్, జూలై 20: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త తెలప్రోలు రాంప్రసాద్ హత్యకేసులో చంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్న కోగంటి సత్యం, మరో ఏడుగుర్ని పంజాగుట్ట పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని నిందితులను మూడు రోజుల పాటు విచారించనున్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు అధికారులు దృష్టిసారించారు.
హైదరాబాద్, జూలై 20: నిబంధనలు ఉల్లంఘించి నారాయణ, శ్రీచైతన్య సంస్థలు విద్యాసంస్థలను నిర్వహిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకునే ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త డీ రాజేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కారంచేడు, జూలై 20: ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఓ మహిళపై గుర్తుతెలియని ముగ్గురు దుండగలు శనివారం అత్యాచారం చేశారు. అత్యాచారానికి గురైన మహిళకు మూడేళ్ల క్రితం చెరుకుపల్లి గ్రామానికి చెందిన ఒకరితో వివాహం జరిగింది. అనంతరం ఏడాదిన్నర క్రితం వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఈక్రమంలో అత్యాచారానికి గురైన మహిళకు వేరొకరితో గత నాలుగు నెలలుగా పరిచయం ఏర్పడింది.
కొత్తూరు రూరల్, జూలై 20: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కొత్తూరు ఐఓసీ పెట్రోల్ బంక్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ కృష్ణ కథనం ప్రకారం మండల పరిధిలోని పెంజర్ల గ్రామానికి చెందిన మహమూద్ (38) అనే వ్యక్తి ఐఓసీ పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం రాత్రి నిలిపి ఉండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు.
కేశంపేట, జూలై 20: ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడు మృతి చెందిన సంఘటన కేశంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కేశంపేట మండలం ఎఖ్లాస్ఖాన్పేట గ్రామానికి చెందిన మాదపురం మల్లేష్ (28) సుందరాపురం గ్రామ సమీపంలోని సీడ్స్ పరిశ్రమలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు.
జీడిమెట్ల, జూలై 20: విద్యుత్ షాక్ తగిలి టైల్స్ కార్మికుడు మృతి చెందిన సంఘటన పేట్బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. జీడిమెట్ల గ్రామంలో నివాసముండే మేడి నర్సింహులు (19) టైల్స్ పని చేస్తుంటాడు. కొంపల్లి జయభేరి పార్కు కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో నర్సింహులు టైల్స్ పని చేస్తున్నాడు. ప్రమాదవశాత్తు నీటిలో విద్యుత్ తీగలు పడి షాక్ తగిలింది.