-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
విజయవాడ (కార్పొరేషన్), మే 13: నిషేధిత ప్లాస్టిక్ ఉత్తత్తుల నియంత్రణే లక్ష్యంగా నగరపాలక సంస్థ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో సుమారు 4వేల 955కీజీల ప్లాస్టిక్ మెటీరియల్ను సీజ్ చేసి రూ.6లక్షల 78వేల 100ల జరిమానా వసూలు చేశారు.
పెనమలూరు, మే 13: సులువుగా డబ్బు సంపాదించాలనే పేరాశతో క్రికెట్ బెట్టింగ్ కట్టి కొందరు డబ్బును, జీవితాన్ని, తమతో పాటు కుటుబాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారని పెనమలూరు సీఐ వాసా పెద్దిరాజు అన్నారు. పోరంకి సాయి నగర్లోని విఘ్నేశ్వరా రెసిడెన్సీలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని సెంట్రల్ జోన్ ఏసీపీ అంకినీడు ప్రసాద్ అధ్వర్యంలో పెద్దిరాజు సిబ్బందితో వెళ్లి సోమవారం అరెస్ట్ చేశారు.
కంగ్టీ, మే 12: ప్రేమించుకున్న అబ్బాయి, అమ్మాయి పెళ్లిచేసుకోవడానికి పెద్దలు నిరాకరించడంతో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. తొలుత ప్రేమికురాలికి ఇతర సంబంధం ఖరారు చేయడంతో మనస్థాపానికి గురైన యువకుడు చేనులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది తెలిసిన అరగంటకే ప్రేమికురాలు ఇంటి దగ్గరే కిరోసిన్ ఒంటిమీద పోసుకుని నిప్పుంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.
కొత్తవలస, మే 12: విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో తుమ్మికాపల్లి వద్ద విశాఖ-అరకు రోడ్డులో ఆదివారం ఉదయం కారు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విపోలీసులు అందించిన వివరాల ప్రకారం.. అరకు నుంచి వస్తున్న కారు కొత్తవలస నుంచి వెళుతున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాద స్థలంలోనే వినయ్కుమార్(20) అనే బిటెక్ విద్యార్థి మృతి చెందాడు.
విశాఖపట్నం, మే 12: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలానికి చెందిన ప్రేమికులు సత్యనారాయణ, రౌత కమల ఆదివారం ఉదయం కైలాసగిరి కొండపై పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా, కమల అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించారు. కమలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
జి.కొండూరు, మై 12: ఆగి ఉన్న లారీని, కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జి.కొండూరులో కొత్త బైపాస్ రోడ్డులో విజయవాడ - చత్తీస్ఘడ్ జాతీయ రహదారిపై ఆత్కూరు క్రాస్ రోడ్డు వద్ద శనివారం అర్థరాత్రి 12.30 గంటల సమయంలో కారు వేగంగా వచ్చి లారీని బలంగా ఢీకొట్టింది.
ఉప్పల్, మే 12: ఇంట్లో ఒంటరిగా ఉన్న 11 ఏళ్ల బాలికపై పక్కంటిలో నివసిస్తున్న యువకుడు అత్యాచారం చేసిన సంఘటన పీర్జాదిగూడలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పీర్జాదిగూడ చెన్నారెడ్డి తోటలో నివసిస్తున్న ఓ మహిళ జీహెచ్ఎంసీ పరిధిలో స్వీపర్గా పని చేస్తుంది.
ఉప్పల్, మే 12: ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా టిక్కెట్లు దొరకక బ్లాక్లో కొనుగోలు చేయడానికి ఎగబడ్డారు. హైదరాబాద్లో ఉండి స్వయంగా స్టేడియంలోకి వెళ్లి మ్యాచ్ను చూద్దామనుకున్న ప్రజలకు ఆన్లైన్లో టిక్కెట్లు దొరకక బయట బ్లాకులో అధిక ధరలకు తీసుకోవడానికి సిద్ధపడ్డారు.
జీడిమెట్ల, మే 12: రెండు ఏటీఎం సెంటర్లలో దుండగులు చోరీకి యత్నించిన సంఘటన దుందిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సూరారం కాలనీ బస్టాప్ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్లలో దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎం మిషన్ను పగులగొట్టి తెరుచుకోకపోవడంతో దుండగులు వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు దుండగులు ఉన్నట్లు తెలుస్తోంది.
పెనుమంట్ర, మే 10: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో శుక్రవారం అర్థరాత్రి పుట్టిన రోజు వేడుకల్లో యువతులతో నిర్వహిస్తున్న అశ్లీల నృత్యాలపై పోలీసులు దాడిచేశారు. కర్రి చైతన్యరెడ్డి అనే వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకుని మార్టేరులోని ఒక కళ్యాణమండపంలో పార్టీ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన సంగీత విభావరితో పాటు విశాఖకు చెందిన నలుగురు యువతులను తీసుకువచ్చారు.