S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/12/2019 - 04:36

ధవళేశ్వరం, మే 11: ఎంతో భవిష్యత్ కలిగిన ఆ యువ జంటకు ఏ కష్టమొచ్చిందో ఏమో అర్ధాంతరంగా పురుగులమందు తాగి, తనువు చాలించారు. పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల భవిష్యత్తుపై భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెప్పుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరంలో శనివారం ఈ విషాద ఘటన వెలుగుచూసింది.

05/12/2019 - 02:45

పిఠాపురం, మే 11: ప్రేమ పేరుతో వలపన్నాడు.. రెండేళ్లుగా వ్యవహారం సాగించాడు... పెళ్లి చేసుకుంటానంటూ ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. ఆ పరిచయంతో యువతికి వరుసకు చెల్లి అయ్యే బాలికపైనా కనే్నశాడు. ఆ బాలికనూ శారీరకంగా అనుభవించాడు. విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు నిలదీస్తే స్నేహితులతో కలిసి వారిపై దాడిచేశాడు.

05/12/2019 - 02:30

మునగాల, మే 11: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెంద గా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యా య. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ సమీపంలో 65వ నెంబ ర్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

05/12/2019 - 02:03

విజయవాడ (క్రైం), మే 11: సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంట్లో చోరీ ఉదంతంపై ఎట్టకేలకు పోలీసు కమిషనరేట్ స్పష్టత ఇచ్చింది. సదరు అధికారి ఇంట్లో పని చేస్తున్న వ్యక్తి చేతివాటం చూపి భారీ మొత్తంలో నగదు, నగలు మూటకట్టుకుని రాష్ట్రాలు దాటి వెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో తడబడిన పోలీసులు అసలు చోరీ జరగలేదని, జరిగి చాలా కాలమైందని, అసలు తమకు ఫిర్యాదే అందలేదని చెపుతూ వచ్చారు.

05/12/2019 - 02:02

విజయవాడ (క్రైం), మే 11: అనధికారికంగా భారీస్థాయిలో వెండి రవాణా చేస్తూ అక్రమ వ్యాపారం సాగిస్తున్న తమిళనాడుకు చెందిన ముఠా గుట్టు రట్టయింది. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు వారి నుంచి సుమారు రూ. 52.44 లక్షల విలువైన 138 కేజీల వెండి, రూ. 3.65లక్షలు నగదు, మూడు సెల్‌ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు.

05/12/2019 - 02:02

మైలవరం, మే 11: కూలీలతో వెళుతున్న ఒక ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ తిరగబడి ఒక వ్యక్తి మృతి చెందగా తొమ్మిది మంది కూలీలు గాయపడిన వైనమిది. పోలీసుల కధనం ప్రకారం రెడ్డిగూడెం మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్ 15 మంది కూలీలను తీసుకుని మైలవరం మండలం వెల్వడం సమీపంలోని ఇటుకల రవాణాకు శనివారం ఉదయం బయలుదేరింది.

05/12/2019 - 01:54

రాజేంద్రనగర్, మే 11: ప్రేమ విఫలమవడంతో అధిక మొత్తంలో మత్తు పదార్థాలు సేవించి యువకుడు మృతి చెందిన సంఘటన పహాడీషరీఫ్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లి గ్రామానికి చెందిన శివకుమార్ జీవనం సాగిస్తున్నాడు.

05/12/2019 - 01:53

కొత్తూరు రూరల్, మే 11: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. శనివారం మధ్యాహ్నం నందిగామ మండల పరిధిలోని చంద్రాయన్‌గూడ పాత జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి లారీ ఢీకొనడంతో అదే గ్రామానికి చెందిన శ్రీపాల్‌రెడ్డి (30) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు నందిగామ పోలీసులు తెలిపారు.

05/12/2019 - 01:53

శేరిలింగంపల్లి, మే 11: మతిస్థిమితం లేని ఓ వృద్ధురాలు తప్పిపోయిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... న్యూ హఫీజ్‌పేటలోని మార్తాండనగర్‌లో నివసిస్తున్న బాను బీ (70) మానసికస్థితి సరిగా లేదు. ఎవరికీ చెప్పకుండా ఇంటిలో నుండి బయటకు వెళ్లిన వృద్ధురాలు తిరిగి ఇంటికి రాలేదు.

05/11/2019 - 22:31

కడప: కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి జరిగింది. రైలు ఎర్రకుంట్ల నుంచి తిరుపతి వెళుతుండగా ప్రయాణీకురాలిని బెదిరించి బ్యాగులో నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు, ఒక మొబైల్ ఫోన్‌ను ఎత్తుకువెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఒక అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.

Pages