S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/11/2019 - 00:49

హైదరాబాద్, మే 10: నాసిరకం విత్తనాలు అమ్ముతున్న ముఠా సభ్యుల్లో ఇద్దరిని హైదరాబాద్ పోలీసు అరెస్టు చేశారు. ఇద్దరి నుంచి రూ.32.52 లక్షల నాసిరకం విత్తనాలు కలిగిన 50 బస్తాలను సీజ్ చేశారు. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ నుంచి సికింద్రాబాద్‌కు అక్రమంగా రైళ్లో నాసిరకం విత్తనాలను తీసుకువచ్చి రైతులను మోసం చేసి విక్రయిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

05/11/2019 - 00:47

తల్లకొండపల్లి, మే 10: మండలంలోని పడమటి తండా గ్రామ పంచాయితీలో శుక్రవారం మధ్యాహ్నం కాట్రోవత్ లలిత(18) అనే విద్యార్థిని వడదెబ్బకు గురై మృతిచెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. లలిత ఇంటి వద్ద కౌంపౌండ్ వాల్ నిర్మిస్తుండగా గురువారం వడదెబ్బకు గురైందని, రాత్రి అస్వస్థకు గురి కావడంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందిందని కుటుంబీకులు పేర్కొన్నారు.

05/11/2019 - 00:31

నిజాంసాగర్, మే 10: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మల్లూర్ గ్రామ శివారులోని అటవీ శాఖవారి కందకంలో పడి ఎలుబంటి పడి మృతి చెందినట్లు పిట్లం ఎఫ్‌ఆర్‌ఓ సంజయ్‌గౌడ్ తెలిపారు. ఎలుగుబంటి మృతి చెందిందని గ్రామస్థులు అటవీశాఖ వారికి సమాచారం అందించారు. ఈమేరకు శుక్రవారం బాన్స్‌వాడ అటవీ డివిజనల్ అధికారి సాగర్, పిట్లం ఎఫ్‌ఆర్‌ఓ సంజయ్‌గౌడ్‌లు సంఘటనా స్థలానికి వెళ్లి ఎలుగుబంటిని పరిశీలించారు.

05/11/2019 - 00:30

రాజాపేట, మే 10: ఓటు వేసేందుకు వెళ్తుండగా వడదెబ్బ తగలడంతో ఒక వృద్ధుడు మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల పరిధిలోని రఘునాథపురం గ్రామంలో ఓటు వేసేందుకు భీమండి నుండి వచ్చిన కుసుమ ఆంజనేయులు(70) పోలింగ్ స్టేషన్‌కు వెళ్తూ క్యూలో నిలబడి లైన్ భారీగా ఉండటంతో వడదెబ్బతో కుప్పకూలి మృతి చెందాడు.

05/11/2019 - 00:29

పటన్‌చెరు, మే 10: పాదచారులపైకి కంటెనైర్ దూసుకొచ్చిన సంఘటనలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం సంగారెడ్డి జిల్ల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వారితో పాటు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న మరో నలుగురికి గాయపడ్డారు.

05/10/2019 - 23:22

హైదరాబాద్, మే 10: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎన్నారై చిగురిపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు పీడీ యాక్ట్ కేసుల నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారి శ్రీనివాసరావు తెలపారు. 2018 డిసెంబర్ 30న జయరాం హత్యకు గురైయ్యారు.

05/10/2019 - 22:43

న్యూఢిల్లీ, మే 10: అయోధ్యలో వివాదాస్పద స్థలం సామరస్యంగా పరిష్కరించేందుకు వీలుగా మధ్యవర్తిత్వ కమిటీకి దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగస్టు 15వరకు గడువు ఇచ్చింది. అతి సున్నితమైన, వివాదాస్పదమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదాన్ని సామరస్యపూర్వకంగా ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకుగాను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్.ఎం.ఐ. ఖలీఫుల్లా నాయకత్వంలోని మధ్యవర్తిత్వ కమిటీకి వెసులుబాటు కల్పించింది.

05/10/2019 - 22:37

న్యూఢిల్లీ, మే 10: దేశ సర్వోన్నత న్యాయస్థానం అనని వ్యాఖ్యలను అన్నట్టు ఆపాదించి క్రిమినల్ కేసు ఎదుర్కొన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ బేషరతు క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో తనపై నమోదైన కోర్టు ధిక్కార కేసును మూసివేయాలని కోరారు.

05/10/2019 - 22:24

న్యూఢిల్లీ, మే 10: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై వచ్చిన రివ్యూ పిటిషన్లను దేశ సర్వోన్నత న్యాయస్థానం రిజర్వులో ఉంచింది. కేంద్ర ప్రభుత్వం తరఫున, పిటిషనర్ల తరఫున శుక్రవారం సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టులో తమ తమ వాదనలను వినిపించారు.

05/10/2019 - 22:08

విశాఖపట్నం, మే 10: నేర పరిశోధక విభాగం(సీఐడీ)లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ ఆర్పీ ఠాకూర్ తెలిపారు. విశాఖ ఆరిలోవ పైనాపిల్ కాలనీలో నేర పరిశోధక విభాగం(సీఐడీ) ప్రాంతీయ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించారు.

Pages