S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/10/2019 - 22:03

కాకినాడ రూరల్, మే 10: కన్నతండ్రే కామాంధుడై డీగ్రీ చదువుతున్న కన్న కూతురిపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన ఉదంతం తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. గత కొంతకాలంగా తన కోరిక తీర్చాలని రకరకాలుగా వేధిస్తున్న ఆ కామాంధుడు గురువారం రాత్రి భార్య బాత్‌రూంలో స్నానం చేస్తున్న సమయంలో ఇంట్లోనే కూతురిపై అత్యాచార యత్నం చేశాడు. బాధితురాలు వేసిన కేకలకు బాత్‌రూంలో ఉన్న తల్లి రావడంతో పరారయ్యాడు.

05/10/2019 - 02:02

పామర్రు, మే 9: పామర్రు మండలం నాగపట్నం వద్ద మూడు రోజులు కిందట అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జువ్వనపూడి ప్రశాంతి సంఘటనలో భర్త జువ్వనపూడి చంటిబాబు దోషిగా ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని పామర్రు సీఐ శివశంకర్ గురువారం స్థానిక స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు.

05/10/2019 - 01:45

హైదరాబాద్, మే 9: టీవీ 9 సీఈవో రవిప్రకాశ్‌పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిధుల మళ్ళింపు, ఫోర్జరీ ఆరోపణలపై కేసు నమోదు చేశామని సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపారు. ఈమేరకు గురువారం సీసీఎస్ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. టీవీ 9 యాజమాన్యం మధ్య నడుస్తున్న వివాదమే కేసు నమోదుకు కారణమని తెలిసింది.

05/10/2019 - 01:18

రాజేంద్రనగర్, మే 9: లిఫ్ట్ ఎక్కబోయి కాలు జారి కింద పడి మహిళ మృతిచెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా నగర శివారులోని హైదర్‌గూడలో గల కేకే ఫంక్షన్‌హాల్‌ను కుమ్మరి కృష్ణ నిర్వహిస్తున్నాడు. ఫంక్షన్‌హాల్‌లో బుధవారం రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు కమలమ్మ(55) అనే మహిళ హాజరైంది.

05/10/2019 - 01:17

ఉప్పల్, మే 9: దొంగలు మళ్లీ విజృంభించారు. తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, కొంత నగదును ఎత్తుకెళ్లిన సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బోడుప్పల్ సరస్వతినగర్‌లోని పీవీఆర్ రెసిడెన్సీలో నివసిస్తున్న గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో గోవాలో ఉంటున్న బంధువుల ఇంటికి వారం రోజుల క్రితం వెళ్లారు.

05/10/2019 - 01:17

ఖైరతాబాద్, మే 9: మానసిక ఆవేదనకు గురైన యువతి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రియా శర్మ (23) గత కొంత కాలం నగరానికి వచ్చింది. అమీర్‌పేటలోని అనుపమ హాస్టల్‌లో నివాసం ఉంటూ సోమాజిగూడలోని ఓ ప్రైవేట్ సంస్థలో విధులు నిర్వహిస్తుంది.

05/10/2019 - 00:56

హైదరాబాద్, మే 9: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన భూపతిరెడ్డి, యాదవరెడ్డిలపై అనర్హత వేటుతో ఏర్పడిన ఎమ్మెల్సీ స్థానాలకు ఏర్పడిన ఖాళీల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇవ్వొద్దని రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎమ్మెల్సీల సభ్యత్వం రద్దుకు సంబంధించిన రికార్డులను తమకు సమర్పించాలని శాసనమండలిని హైకోర్టు ఆదేశించింది.

05/10/2019 - 02:26

విశాఖపట్నం(క్రైం): ఎంతో కాలంగా విశాఖలో జరుగుతున్న కిడ్నీ రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. కిడ్నీ దాతకు రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి కేవలం రూ. ఐదు లక్షలు చెల్లించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు కిడ్నీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు.

05/10/2019 - 02:25

గార, మే 9: శ్రీకాకుళం జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. గార మండలం అంపోలు పంచాయతీ పరిధి చల్లవానిపేట సమీపంలోని సీఎస్పీ రహదారిపై గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు జిల్లా కేంద్రంలోని రిమ్స్, రాగోలు జెమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

05/10/2019 - 00:36

న్యూఢిల్లీ: కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల జరిగిన పర్యావరణ నష్టానికి రూ.100 కోట్లు డిపాజిట్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఏపీకి ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే మంజూరు చేసింది. ఆదేశాల అమలును మూడు నెలలపాటు నిలుపుదల చేసింది. ఎన్జీటీ తీర్పును ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది.

Pages