S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/09/2019 - 01:38

బాలాపూర్, మే 8: చెత్తకుప్పలో దొరికన దరఖాస్తులు.. తిరస్కరణకు గురైనవని సరూర్‌నగర్ తహశీల్దార్ ఎన్.శ్రీనివాస్ రెడ్డి బుధవారం పేర్కొన్నారు. ఉన్నత విద్య, చదువులు, ఉద్యోగాల కోసం చేసుకునే కుల, నివాస, పుట్టిన ధ్రువీకరణ సర్ట్ఫికెట్ల కోసం మీ-సేవలో చేసుకున్న దరఖాస్తులు సరూర్‌నగర్ తహశీల్దార్ మండల కార్యాలయం ఆవరణలోని చెత్తకుప్పలో పడి ఉన్నాయని ఆరోపిస్తున్న ఓ మహిళ ఆరోపణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

05/09/2019 - 01:38

నేరేడ్‌మెట్, మే 8: నిషేధిత క్లోరల్ హైడ్రేట్‌ను గుట్టు చప్పుడు కాకుండా నిజామాబాద్ నుంచి నగరానికి సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

05/09/2019 - 00:59

హైదరాబాద్, మే 8: ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనం కొనసాగుతోందని, ఇంకా పూర్తి కాలేదని, వివరాలు అందించేందుకు మరో వారం రోజులు గడువు ఇవ్వాలని బోర్డు అధికారులు బుధవారం నాడు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. బోర్డు కౌన్సిల్ డీఎల్ పాండు ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ బెంచ్ ముందు తమ వాదనలు వినిపించారు.

05/09/2019 - 00:27

న్యూఢిల్లీ, మే 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తూ ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల విషయంలో సుప్రీం కోర్టుకు బేషరతు క్షమాపణలు చెప్పారు. బుధవారం ఈ మేరకు సుప్రీం కోర్టులో రాహుల్ అఫిడవిట్ దాఖలు చేశారు. ‘చౌకీదార్ చోర్ హై’ వ్యాఖ్యలను రాహుల్ సుప్రీం కోర్టుకు ఆపాదించటం తెలిసిందే.

05/08/2019 - 22:48

అమరచింత, మే 8: ఒక సెల్‌ఫోన్ ముగ్గురి ప్రాణాలను బలితీసు కుంది. టచ్ సెల్‌ఫోన్ కోసం ముగ్గురు అన్నాచెల్లెళ్ల మధ్య జరిగిన గొడవలో క్షణికావేశంలో ఇద్దరు అన్నలు, ఒక చెల్లెలు ఒకరి తర్వాత ఒకరు ఊరి చివరలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని నందిమాల్ల ఎక్స్ రోడ్డు గ్రామంలో చోటు చేసుకుంది.

05/08/2019 - 22:45

బాలానగర్, మే 8: భార్య, కొడుకులు కలిసి ఒక వ్యక్తిని దారుణంగా హత్యచేసిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. బాలానగర్ మండల కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున కొండంపల్లి రాజ్‌కుమార్‌రెడ్డి (45) అనే వ్యక్తిని ఆయన కుమారులు సంజయ్‌కుమార్‌రెడ్డి, సాయికుమార్‌రెడ్డి, భార్య అనిత ముగ్గురూ కలిసి దారుణంగా హత్య చేశారు. ఎస్సై కృష్ణ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

05/08/2019 - 22:29

గోరంట్ల, మే 8: ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాదాలు, పెళ్లిళ్లు చేయకుండా తండ్రి తాస్సారం చేయడంతో మనస్తాపానికి గురైన చేనేత కుటుంబంలోని నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు సోదరులు మృతి చెందగా, అక్క, ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. అనంతపురం జిల్లా గోరంట్లలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

05/08/2019 - 22:25

తిరుపతి, మే 8: తిరుమలలోని శ్రీవారి లడ్డూ కౌంటర్ల వద్ద అధిక ధరలకు లడ్డూలను విక్రయిస్తూ భక్తులను మోసం చేస్తున్న ఐదుగురిని బుధవారం టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. గత కొద్దిరోజులుగా తిరుమలలోని శ్రీవారి లడ్డూ కౌంటర్ల వద్ద అధిక ధరలకు లడ్డూలు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.

05/08/2019 - 04:40

నెల్లూరు రూరల్, మే 7: గిరిజనుడైన ఏకుల శ్రీనివాసులకు బ్రెయిన్‌డెడ్ అని ప్రకటించి అతని అవయవాలు బలవంతంగా దానం చేయించిన సంఘటనలో నెల్లూరు పట్టణంలోని సింహపురి వైద్యశాలపై నమోదైన కేసు మరో మలుపు తిరిగింది. ఈ ఘటనలో సింహపురి హాస్పటల్ యాజమాన్యంపై అట్రాసిటీ కేసును రూరల్ పోలీసులు నమోదు చేశారు. ఇప్పటికే ఓ కేసు యాజమాన్యంపై నమోదై ఉంది. గిరిజన సంఘాల ఆందోళనతో అట్రసిటీ కేసును నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

05/08/2019 - 04:39

పామూరు, మే 7: జల్సాలకు అలవాటుపడి విలాసవంతమైన జీవితం గడిపేందుకు అమాయకులను టార్గెట్‌గా చేసుకుని తక్కువ రేటుకు బంగారాన్ని విక్రయిస్తామని నమ్మబలుకుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద గల రూ.3లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ప్రకాశం జిల్లా కందుకూరు డిఎస్పీ కె శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం పామూరు పోలీస్‌స్టేషన్‌లో ఆవరణలో జరిగిన విలేఖరుల సమావేశంలో నిందితులతో పాటుగా నగదును ఉంచారు.

Pages