S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

,
05/08/2019 - 04:08

సంగారెడ్డి టౌన్, మే 7: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని మాతా శిశు కేంద్ర నుంచి 8 రోజుల ఆడ శిశువు అపహరణకు గురైన సంఘన మంగళవారం చోటుచేసుకుంది. తల్లి ఒడిలో ఉండాల్సిన పసికందును గుర్తు తెలియని మహిళా ఎత్తుకెళ్లడం జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. ఆసుపత్రి లోపల, బయట సీసీ కెమెరాలు, 24గంటల పాటు సెక్యూరిటీ ఉన్నప్పటికీ శిశువు మాయమవడం ఆందోళనకు గురి చేస్తోంది.

05/08/2019 - 04:04

బాలాపూర్, మే 7: బాలాపూర్ మండలం మల్లపూర్ గ్రామంలో బాలుడు లోకేష్ తాడు ఆట ఆడుతూ.. అదే తాడు మెడకు చుట్టుకొని మృతి చెందిన సంఘటన మంగళవారం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం తల్లి దండ్రులు లేని లోకేష్ తన బాబాయి ప్రభాకర్ వద్ద ఉంటూ. స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుకుంటున్నాడు.

05/08/2019 - 04:00

నల్లగొండ లీగల్, మే 7: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపురం గ్రామంలో ముగ్గురు బాలికల హత్య కేసులో నిందితుడైన సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా కోర్టు మంగళవారం అనుమతి జారీ చేసింది. బాలికల వరుస హత్యల కేసుల విచారణ, ఆధారాల సేకరణతో పాటు నిందితుడు ఇంకా ఏమైనా నేరాలు చేశాడా, ఇతర మిస్సింగ్ కేసుల్లో ఇతడి ప్రమేయం ఏమైనా ఉందా?

05/08/2019 - 02:13

రైల్వేకోడూరు, మే 7: కడప జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆటోను లారీ ఢీకొనడంతో ఆటోడ్రైవర్ మణికంఠ(27), వెంకటరత్నం(28) అక్కడికక్కడే మృతి చెందారు. చల్లా విజయకుమారి, కిషోర్(6), ప్రత్యూష(8)కు గాయాలయ్యాయి.

05/08/2019 - 02:11

హైదరాబాద్ / రాజేంద్రనగర్, మే 7: ఇంట్లో ఉన్న అత్తాకోడళ్లను అతి కిరాతకంగా హతమార్చిన సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జంట హత్యలతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను బీరువాను పగులగొట్టి కొల్లగొట్టారు. విషయం తెలుసుకున్న మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రంగంలోకి దిగి జంట హత్యలకు పాల్పడ్డ వారి వేటలో పడ్డారు.

05/08/2019 - 02:10

కడప, మే 7: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపధ్యంలో కడప కమర్షియల్ టాక్స్ డిప్యుటీ కమిషనర్ లూర్దయ్య నాయుడు ఇంట్లో ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. అదే సమయంలో విజయవాడ, కర్నూలు, బెంగళూరు, హైదరాబాద్‌లో ఉన్న లూర్దయ్యనాయుడు ఇళ్లలో సైతం సోదాలు నిర్వహించారు. లూర్దయ్య నాయుడు కడప నగరంలోని బాలాజీనగర్ కీర్తి ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌నెం.104లో ఉంటున్నారు.

05/08/2019 - 02:00

మచిలీపట్నం, మే 7: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఘరానా మోసం వెలుగు చూసింది. పెట్టిన పెట్టుబడికి ఐదు రెట్లు ఇస్తామని ఆశ చూపి రూ.75 లక్షలు కాజేసిన ఘరానా మోసగాళ్లపై బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బైపాస్ రోడ్డు పంబలగూడెంకు చెందిన మీర్ నజీర్ అలీ, ఇంగ్లీష్‌పాలెంకు చెందిన సయ్యద్ మొహమ్మద్ పాషి, మొహ్మద్ మొబీన్ నిరుద్యోగులు.

05/08/2019 - 01:48

కీసర, మే 7: ట్రాక్టర్ బోల్తాకొట్టిన సంఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన భోగారం గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శోభన్‌బాబు కథనం ప్రకారం బీహార్ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ (32) డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాల్లో సెంట్రింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం కీసరకు వచ్చి తిరిగి భోగారం గ్రామం వెళ్లేందుకు నీళ్ల ట్యాంకర్ ట్రాక్టర్ ఎక్కాడు.

05/08/2019 - 01:48

షాద్‌నగర్ రూరల్, మే 7: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలువురి రాజకీయ నేతలను తహశీల్దార్ ముందు పోలీసులు బైండోవర్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు మామిడిపల్లి వెంకట్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈద్గామపల్లి ఆశన్నగౌడ్, యాదయ్యను బైండోవర్ చేశారు.

05/08/2019 - 01:41

ఉప్పల్, మే 7: బహిరంగ సభలు.. సమావేశాలు.. జాతరలకు వెళతారు.. అందరిలో కలిసిపోయి అనుమానం రాకుండా కలిసి మెలిసి తిరుగుతారు.. అంతలోనే జేబు దొంగలుగా మారిపోయి దోచుకుంటూ తప్పించుకు తిరుగుతున్న ఆరుగురు సభ్యులతో కూడిన జేబుదొంగల ముఠాలో ఐదుగురిని రాచకొండ సీసీఎస్ మల్కాజిగిరి టీం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

Pages