-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హయత్నగర్, మే 7 : హైదరాబాద్లోని వనస్థలిపురం పనామా కూడ లి వద్ద మంగళవారం ఉదయం ఏటీఎం వద్ద భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు సెక్యూరిటీ కార్డు దృష్టి మళ్లించి రూ.58.97లక్షలు ఎత్తుకెళ్లారు. ఏటీయంలో నగదు జమచేసే సెక్యూరిటీ గార్డ్ కళ్లుకప్పి వనస్థలిపురంలో భారీ నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు.
న్యూఢిల్లీ, మే 7: యాభై శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితర 21 ప్రతిపక్ష పార్టీల నాయకులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ధర్మాసనం మంగళవారం ప్రతిపక్షాల రివ్యూ పిటిషన్ను తోసిపుచ్చింది.
కొత్తపేట, మే 7: తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట విద్యుత్ సబ్ స్టేషన్లో సబ్ ఇంజినీర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఒక రైతు పొలంలో విద్యుత్ మోటారు కనెక్షన్ ఇచ్చేందుకు 15వేల రూపాయలు లంచం రైతు నుంచి తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి కొత్తపేట విద్యుత్ సబ్ స్టేషన్లో సబ్ ఇంజినీర్గా పనిచేస్తున్న కె శివచంద్రశంకర్ను మంగళవారం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
న్యూఢిల్లీ, మే 6: లైంగిక వేధింపుల ఆరోపణల్లో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్కి క్లీన్ చిట్ లభించింది. ఆయనపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలు నిరాధారమని, వాటిలో ఎలాంటీ పస లేదని త్రిసభ్య ఇన్హౌస్ దర్యాప్తు ప్యానెల్ తన నివేదికలో స్పష్టం చేసింది. మొత్తం 14 రోజుల్లో ఈ కమిటీ తన విచారణను పూర్తి చేసింది.
చిత్తూరు, మే 6 : చిత్తూరు నగరంలోని లక్ష్మీనగర్కాలనీలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఇంట్లోని లాకర్ తాళాలు పగులకొట్టి అందులోని రూ 19.20 లక్షల విలువజేసే 80 సవర్ల (640గ్రాములు) బంగారు ఆభరణాలతో పాటు, రూ 1.50 లక్షల నగదును దొంగలు దోచుకెళ్లారు.
ఉప్పల్, మే 6: నగర శివారులో దొంగలు మళ్లీ విజృంభించారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డ దొంగలు ఇంట్లో దాచిన రూ.4.70 లక్షల నగదుతో పాటు రెండు తులాల బంగారం, పది తులాల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బోడుప్పల్ భవానీనగర్లో నివసిస్తున్న రాజు కుటుంబ సమేతంగా జగద్గిరిగుట్టలోని బందువుల ఫంక్షన్కు ఆదివారం రాత్రి వెళ్లారు.
తాండూరు, మే 6: గత నెల 30న పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తన మెడలోని బంగారు నాను గుర్తు తెలియని దొంగలు తస్కరించారని ఒక మహిళ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా హైదరాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటున్న మహిళ అమృతమ్మ సోమవారం తాండూరు పోలీస్స్టేషన్కు వచ్చి తన మెడలోని బంగారు నాను ఇంట్లోనే ఉందని తాను ఆ రోజు మరచిపోయి బంగారు నాను దొంతనం అయినట్లు ఫిర్యాదు చేశానని పోలీసులకు తెలిపింది.
దిల్సుఖ్నగర్, మే 6: బాలికను కిడ్నాప్ చేసి వివాహం చేసుకున్న వ్యక్తి, అందుకు సహకరించిన మరో ఇద్దరిపై కేసు నమోదు చేసిన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం జడ్చర్ల మండలం గొల్లపల్లి ప్రాంతానికి చెందిన ఎడ్ల శ్రీకాంత్(25) వృత్తిరీత్యా అరబిందో ల్యాబ్లో ల్యాబ్ టెక్నిషియన్గా విధులు నిర్వహిస్తున్నాడు.
జీడిమెట్ల, మే 6: ఒకప్పుడు ఎంతో మందికి ప్రాణదానం చేసిన వాహనాలు...ఆపదలో ఉండి 108కు ఫోన్ చేస్తే కూయ్యి కూయ్యి అంటూ గల్లీలోకి వచ్చి రోగులకు ప్రథమ చికిత్స అందించి నగరంలోని ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడిన ఆ అంబులెన్స్లు నేడు నిరుపయోగంగా పడి ఉన్నాయి. కాలం చెల్లిన 108 అంబులెన్స్లు సుమారు 60 వరకూ నిరుపయోగంగా పడి ఉన్నాయి.
న్యూఢిల్లీ, మే 6: రాఫెల్ యుద్ధ విమానాల కేసుతోపాటు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆపాదించిన ‘చౌకీదార్ చోర్ హై’ వ్యాఖ్యలపై ఈనెల 10న విచారణ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. రాఫెల్ కుంభకోణంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అనని వ్యాఖ్యలను రాహుల్ గాంధీ చేయడంతో దీనిని సుప్రీం తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే.