S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/06/2019 - 22:02

న్యూఢిల్లీ, మే 6: ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల నియామవళి (ఎంసీసీ)ని ఉల్లంఘించలేదంటూ ప్రధాన ఎన్నికల కమిషన్ (సిఇసీ) క్లీన్ చిట్ ఇచ్చినట్లయితే, ఆ రికార్డులను తమ ముందు ఉంచాలని సుప్రీం కోర్టు పిటీషనర్‌ను ఆదేశించింది.

05/06/2019 - 04:39

సోమందేపల్లి, మే 5 : అనంతపురం జిల్లాలో ఆదివారం ఓ కారు ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి అతి వేగంగా ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సోమందేపల్లి ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. కర్నాటకలోని మైసూరుకు చెందిన ఐదుగురు పశువుల వ్యాపారులు కారులో అనంతపురం నగరంలో జరిగే పశువుల సంతకు వచ్చారు. ఇక్కడ పని ముగించుకుని తిరిగి స్వస్థలం బయల్దేరారు.

05/06/2019 - 04:10

డిండి, మే 5: నల్లగొండ జిల్లా డిండి మండలం చెర్కుపల్లి గ్రామంలో ఆదివారం వ్యవసాయ బావివద్ద ముకురాల రాములమ్మ(50) దారుణ హత్యకు గురైంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు రాములమ్మ భర్త నిరంజన్‌గౌడ్ తమ్ముని కొడుకు శేఖర్ కత్తితో రాములమ్మ తలపై, మెడపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుపడిన నిరంజన్‌గౌడ్ చేతికి తీవ్ర గాయమవ్వడంతో దేవరకొండ ఆసుపత్రికి తరలించారు.

05/06/2019 - 04:19

పటాన్‌చెరు, మే 5: గంజాయి రవాణాకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సంగారెడ్డి జిల్లా కేంద్రం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, పటాన్‌చెరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా జరిపిన తనిఖీలతో అక్రమ మత్తు మందు రవాణాకు అడ్డుకట్ట పడింది. మండల పరిధి ముత్తంగి గ్రామ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డుపై నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో విస్మయానికి గురి చేసే విషయాలు వెలుగు చూపాయి.

05/06/2019 - 02:01

పెనమలూరు, మే 5: ఆ జంట ప్రేమ వివాహంతో ఒక్కటయింది. 6నెలలు క లసి కాపురం చేసింది. ఇంతలోనే తన ను వరకట్నం కోసం వేధిస్తున్నాడని భర్తపై బాధిత భార్య పెనమలూరు పో లీసులకు ఫిర్యాదు చేసింది.

05/06/2019 - 02:00

గుడివాడ, మే 5: గుడివాడ వాంబే కాలనీలో వ్యక్తిపై హత్యాయత్నం కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి కత్తితో దాడి చేయడం, బైక్‌ను దగ్ధం చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామానికి చెందిన మురళీకృష్ణ శ్యామలను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు.

05/06/2019 - 01:59

గన్నవరం, మే 5: స్థానిక కోనాయ్ చెరువులో ప్రధామవశాత్తూ జారి పడి ఇరువురు విద్యార్ధులు దుర్మరణం పొందిన దుర్గటన ఆదివారం చోటు చేసుకుంది. గన్నవరం సిఐ రవికుమార్ కధనం ప్రకారం నెల్లూరు జిల్లా సింగరాయకొండకు చెందిన షేక్ మస్తాన్ భాష (19), నెల్లూరు జిల్లా కావలికి చెందిన షేక్ కరీం భాష (20)లు వేసవి శెలవుల్లో ఉండేందుకు గన్నవరం కు చెందిన బాబాయ్ మస్తాన్ వలీ ఇంటికి వచ్చారు.

05/06/2019 - 01:28

న్యూఢిల్లీ, మే 5: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరుపుతున్న కోర్టు అంతర్గత కమిటీకి నేతృత్వం వహిస్తున్న న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్‌డేను న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్ నారిమన్, డీవై చంద్రచూడ్‌లు కలిసినట్టు ఒక పత్రికలో వచ్చిన వార్తాకథనాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదివారం తోసిపుచ్చింది.

05/06/2019 - 01:24

శ్రీనగర్, మే 5: పుల్వామా జిల్లాకు చెందిన ఓ మిలిటెంట్ ఆదివారం ఆయుధాలతో సహా పోలీసులకు లొంగిపోయాడు. జైషే మహమ్మద్ మిలిటెంట్ సంస్థకు చెందిన ఈ ఉగ్రవాది పేరును వెల్లడించడానికి పోలీసులు అంగీకరించలేదు. ‘ఓ ఉగ్రవాది ఆయుధాలతో సహా లొంగిపోయాడని, జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వచ్చాడ’ని పోలీసులు వెల్లడించారు.

05/05/2019 - 04:33

ఉప్పల్, మే 4: తలనొప్పి వస్తుందని వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రభుత్వ వైద్యుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ సర్కిల్‌లోని చిల్కానగర్ డివిజన్‌లోని కమ్యూనిటీ హాల్‌లో బస్తీ దవాఖానాఉంది.

Pages