S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/18/2020 - 21:50

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో విచారణ మరోమారు వాయి దా పడింది. ఈ కేసుపై మంగళవారం నాడు విచారణ చేపట్టిన ఏసీబీ స్పెషల్ కోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలు లో ఉన్నందున ఆయన కోర్టుకు హాజరుకాలేకపోయారని న్యాయవాదులు పేర్కొన్నా రు.

03/17/2020 - 05:45

గన్నవరం, మార్చి 16: గన్నవరం- ఆగిరిపల్లి రహదారిలో గన్నవరం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో ఆగిఉన్న లారీని ఢీకొట్టి యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గన్నవరం నుండి బీబీగూడెం బైక్‌పై వెళుతున్న జార్ఘంట్‌కు చెందిన నోయేల్ రుజ్వర్ (22) ఆగిఉన్న లారీని ఢీకొనడంతో ఈప్రమాదం సంభవించింది. మృతుడు సెంట్రింగ్ పని నిమిత్తం బీబీగూడెం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

03/17/2020 - 05:42

తిరువూరు, మార్చి16: తిరువూరు పట్టణ శివారు తెలంగాణా సరిహద్దు రాజుపేట చెక్‌పోస్టువద్ద భారీ నగదును తిరువూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఎన్నికల విధులలో భాగంగా అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఒక కారులో తరలిస్తున్న ఎటువంటి రశీదులు లేని 35,57,700 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

03/17/2020 - 02:31

బాలాపూర్, మార్చి 16: ఉల్లాసంగా సైకిల్ తొక్కుతున్న ఆ బాలుడికి ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబలించిన సంఘటన సోమవారం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. స్యూరపేటకు చెందిన నాగేష్ మంగమ్మ, గత ఏడాది క్రితం బతుకుదేరువు కోసం నగరానికి వచ్చి మీర్‌పేట్ నగర పాలక సంస్థ జిల్లెలగూడ దాసరి నారాయణరావు కాలనీలో నివాసం ఉంటూ.. మార్బుల్స్ పనులు చేస్తు జీవనం సాగిస్తున్నారు.

03/17/2020 - 01:52

న్యూఢిల్లీ, మార్చి 16: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మెజారిటీ నిరూపించేందుకు పనె్నండు గంటలలోగా శాసనసభలో బలపరీక్ష నిర్వహింపజేయాలంటూ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

03/17/2020 - 01:29

కొల్చారం, మార్చి 16: మెదక్ జిల్లా కొల్చారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీ ఏడుపాయల దుర్గ్భావాని ఆలయం వద్ద ఓ విందుకు హాజరయ్యేందుకు వస్తున్న డీసీఎంను ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ సంఘటన కొల్చారం మండలం చిన్నఘణపురం సబ్‌స్టేషన్ సంగాయిపేట గ్రామల మధ్య సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..

03/17/2020 - 01:18

న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు న్యాయ వ్యవస్థతో చెలగాటం ఆడుతూ మరణ శిక్షను వాయిదా వేయించుకుంటున్న ‘నిర్భయ’ దోషు లు మరో ఎత్తు వేశారు. తమకు ఉరి పడే తేదీ సమీపిస్తుండడంతో ఈ సారి ఏకంగా అంతర్జాతీయ న్యాయ స్థానా నే్న ఆశ్రయించారు. నలుగురు దోషుల్లో ముగ్గురు తమ ఉరి శిక్షను నిలిపి వేయాలని కోరుతూ

03/17/2020 - 00:55

న్యూఢిల్లీ: రాష్ట్ర ఎన్నికల సంఘం కరోనా వైరస్ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సోమవారం సుప్రీం కోర్టులో న్యాయమూర్తి లలిత్ ధర్మాసనం ముందు స్థానిక సంస్థల ఎన్నికలను వా యిదా వేయడాన్ని ప్రస్తావించారు.

03/16/2020 - 05:03

జోధ్‌పూర్: రాజస్థాన్‌లో శనివారం ఉదయం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో కొత్తగా పెళ్లయిన దంపతులు సహా 11మంది మృతి చెందారు. జోధ్‌పూర్ జిల్లాలోని షేగఢ్ సబ్ డివిజన్ పరిధిలో గల సోయిన్‌తర గ్రామానికి సమీపంలో ఎదురుగా వస్తున్న ఒక ట్రక్కును ఒక కారు ఢీకొనడంతో ఆ కారులో ప్రయాణిస్తున్న 11 మంది మృతి చెందారు. కారులో విక్రం, సీత అనే నవ దంపతులతో కలిసి ప్రయాణిస్తూ మృతి చెందిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.

03/16/2020 - 04:47

జి.కొండూరు, మార్చి 15: రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. మండల పరిధిలోని కుంటముక్కల క్రాస్‌రోడ్డు వద్ద ఆదివారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెడ్డిగూడెం మండల పరిధిలోని బూరుగగూడెం గ్రామానికి చెందిన దాసరి రాధాకృష్ణ, దాసరి అరుణ దంపతులు ఉద్యోగ రిత్యా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో నివాసం ఉంటున్నారు.

Pages