-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: జమ్మూ జైలులో శిక్షను అనుభవిస్తున్న పాకిస్తాన్కు చెందిన ఏడుగురు ఉగ్రవాదులను తక్షణం ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించాలని జమ్మూ- కాశ్మీర్ ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: మనీ లాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎఐసీసీ అధ్యక్షుడురాహుల్ గాంధీ బావ రాబర్డ్ వాద్రా శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. దేశవిదేశాల్లో అక్రమంగా ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన కేసులో రాబర్డ్ వాద్రాపై ఆరోపణలున్న విషయం విదితమే. ఈడీ ఆఫీసుకు వాద్రా హాజరు కావడం ఇది ఐదోసారి. సెంట్రల్ ఢిల్లీలోనీ ఈడీ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు వాద్రా వచ్చారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: జైపూర్ సెంట్రల్ జైలులో జీవిత శిక్షను అనుభవిస్తున్న పాకిస్తానీ ఖైదీ హత్య పట్ల జాతీయ మానవహక్లు సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనను ఎన్హెచ్ఆర్సీ తీవ్రంగా ఖండించింది. ఈ విషయమై వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్ ప్రభుత్వాన్ని, జైళ్లశాఖకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ భారతీయుడా, విదేశీయుడా అనే అంశం చర్చ కాదన్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కేసులో తాను ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలయిన రివ్యూ పిటిషన్లను విచారిస్తానని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. భారత్, ఫ్రాన్స్ మధ్య 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు జరిగిన ఒప్పందాన్ని సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్లను కొట్టివేస్తూ అత్యున్నత న్యాయస్థానం నిరుడు డిసెంబర్ 14న తీర్పు ఇచ్చింది. రూ.
లక్నో, ఫిబ్రవరి 21: కాన్పూర్లో భివానీ కాళింది ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో సంభవించిన పేలుళ్లకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫరూఖాబాద్ స్టేషన్ ప్రభుత్వ రైల్వే పోలీసులు(జీఆర్పీ) గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. కాన్పూర్-్భవానీ ఎక్స్ప్రెస్ జనరల్ కంపార్ట్మెంట్లోని వాష్రూమ్ వద్ద పేలుళ్ల సంభవించాయి.
గోదావరిఖని, ఫిబ్రవరి 21: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టిపిసిలో ప్రియురాలిపై ప్రియుడు దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. ప్రియుడు తన ప్రియురాలిని రెస్టారెంట్కని పిలిచి కత్తితో దాడి చేసిన ఘటన రామగుండంలో సంచలనమైంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 21: మహారాష్ట్ర పూణె పోలీసులు విరసం నేత వరవరరావుపై చార్జిషీట్ దాఖలు చేశారు. బీమా కోరేగావ్ కేసులో అర్బన్ నక్సల్స్పై 1,837 పేజీలతో కూడిన చార్జిషీట్ను దాఖలు చేశారు. బీమా కోరేగావ్ అల్లర్ల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే అభియోగాలపై వరవరరావుసహా పలువురు హక్కుల కార్యకర్తలను గత ఏడాది పూణె పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
జమ్ము, ఫిబ్రవరి 21: జమ్ములో కాశ్మీరీ ముస్లిం ప్రయాణికుల్లోని కొంతమంది జాతి వ్యతిరేక నినాదాలు ఇచ్చిన ఘటనపై జమ్మూకాశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు జాతి వ్యతిరేక నినాదాలు ఇచ్చినట్టు దగ్గరలోని షాపుల్లో గల సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ ముగ్గురి చిత్రాలను విడుదల చేశారు.
విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 21: వైద్య ఆరోగ్య శాఖలో భారీ అవినీతి చోటు చేసుకుందంటూ గతంలో హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం వాదనలు జరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరికరాల నిర్వహణలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిల్పై హైకోర్టు ఆదేశాలతో ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ చేపట్టిన దర్యాప్తుకు సంబంధించి ఏసీబీ హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది.
నూజివీడు, ఫిబ్రవరి 21:నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థి గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థి నూజివీడు ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా దుర్గి మండలం తేరాల గ్రామానికి చెందిన తుపాకుల యువరాజ్ నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.