-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఓటు నోటు కేసులో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి మంగళవారం మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీఫెన్సన్కు రూ. 50 లక్షలు ఇవ్వచూపిన కేసులో రేవంత్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. రేవంత్ను దాదాపుఆరు గంటలకు పైగా ఈడీ అధికారులు విచారించారు.
టంగుటూరు: ప్రకాశం జిల్లా టంగుటూరుకు ఉత్తరం వైపున గల టోల్ ప్లాజా వద్ద మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుండి చెన్నైకు వెళుతున్న ఏపీ 37 బిడబ్ల్యు 4532 నెంబరు గల స్విఫ్ట్ కారులో నగదు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందటంతో స్థానిక ఎస్ఐ హజరత్తయ్య అప్రమత్తమై కారును టోల్ప్లాజా వద్ద తనిఖీ చేశారు. కారు ఢిక్కీలో సీక్రెట్ లాకర్లో కోటి రూపాయల నగదు కనుగొన్నారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 19: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో దర్యాప్తును జూబ్లీహిల్స్ పోలీసులు వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించి వాస్తవాలు రాబట్టేందుకు సీన్ మొత్తాన్ని పునఃపరిశీలన చేయాలన్న ఉద్దేశంతో ప్రధాన నిందితుడు రాకేష్రెడ్డిని కృష్ణాజిల్లా నందిగామకు తీసుకెళ్లి విచారణ చేపట్టారు. విచారణలో రాకేష్రెడ్డి పొంతనలేని సమాధాలు చెబుతుండడం పోలీసుల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
కంకిపాడు, ఫిబ్రవరి 19: భర్త కిరాతకంగా దాడి చేసి గాయపరచటంతో గృహిణి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన మండంలోని కోలవెన్ను గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కోలవెన్ను గ్రామానికి చెందిన సూరబత్తుల శ్రీలక్ష్మిపై భర్త వెంకటరమణ సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆపస్మారక స్థితిలో పడి ఉన్న శ్రీలక్ష్మిని వదిలేసి ఇంటి నుంచి పారిపోయాడు.
పెడన, ఫిబ్రవరి 19: నవమాసాలు మోసి కన్న ఆ తల్లే తన బిడ్డలను పొట్టన పెట్టుకుందన్న వదంతులు మంగళవారం పెడనలో విస్తారంగా వ్యాపించాయి. 45 రోజుల క్రితం భర్తను కోల్పోయిన ఆ మహిళే తన ఇద్దరు చిన్నారులను రెండు రోజుల వ్యవధిలో మట్టుపెట్టిందన్న ప్రచారం పట్టణ వాసులను కలవరపాటుకు గురి చేసింది. వివరాల్లోకి వెళితే స్థానిక బస్టాండ్ సమీపంలో సోమ, మంగళ వారాల్లో ఇద్దరు బాలికలు మృతి చెందారు.
ఉప్పల్, ఫిబ్రవరి 19: తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యతో గొడవ పడిన భర్త బైక్లో నుంచి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కాచవానిసింగారం ముత్వెల్లిగూడలో నివసిస్తున్న పసుపుల సత్యం (34) కూలి పని చేస్తున్నాడు.
హైదరాబాద్ / ఖైరతాబాద్, ఫిబ్రవరి 19: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
హైదరాబాద్, ఫిబ్రవరి 19: వేగం థ్రిల్.. బట్ కిల్.. ఆత్యంత వేగం ప్రమాదకరం అంటూ ఎన్ని ప్రకటనలు చేసిన ఫలితం దక్కకుండా పోతుంది. నగరంలో చట్టవ్యతిరేకమైనా బైక్ రెసింగ్కు బ్రెక్ వెయాల్సిన పోలీసుల నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలు బలిగొంది. సరదా ప్రాణం తీసింది. బైక్ రెస్లో ఇద్దరు మృతి చెందిన సంఘటన మంగళవారంనాడు రాంగోపాల్పేట్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బాలానగర్, ఫిబ్రవరి 19: గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ జీవన్ కిరణ్ వివరాలను వెల్లడించారు. .... ఫతేనగర్ పార్దివాడకు చెందిన తరుణ్ (19) బాబుల్సింగ్ (32) ఒక జట్టుగా ఏర్పడి ఫోన్లో ఆర్డర్ తీసుకుని గంజాయి సరఫరా చేస్తున్నారు.
రావికమతం, ఫిబ్రవరి 19: కారులో అక్రమంగా తరలిస్తున్న మూడు లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకుని డ్రైవర్పై కేసు నమోదు చేసామని కొత్తకోట ఎస్సై శేఖరం తెలిపారు. మండలంలో దిబ్బపాలెం రోడ్డులో మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో కారులో 102 కిలోల గంజాయిని కనుగొన్నామన్నారు. ఈమేరకు గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకుని దీనిని తరలిస్తున్న డ్రైవర్ రోలుగుంట మండలం రత్నంపేటకు చెందిన బి.