-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
హైదరాబాద్, జనవరి 24: అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, దాసోజు శ్రవణ్ పిటిషన్లు దాఖలు చేశారు.
సదాశివపేట, జనవరి 24: వాహనాన్ని పార్కింగ్ చేసేందుకు వెనక్కు తీసుకుంటున్న క్రమంలో హైటెన్షన్ వైర్లను తాకడంతో విద్యుదాఘాతం సంభవించి కంటైనర్కు నిప్పంటుకోగా, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం అంకెనపల్లి గ్రామ శివారులోని ఎంఆర్ఎఫ్ వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.
ఆగిరిపల్లి, జనవరి 24: ప్రభుత్వ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజిల్లాలో మండల కేంద్రమైన ఆగిరిపల్లి గ్రామానికి చెందిన బాలిక (8) స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతోంది.
విజయవాడ (క్రైం), జనవరి 24: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోము హత్య కేసులో నిందితుడైన ధర్మయ్యను ఎన్ఐఏ అధికారులు గురువారం విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కొద్దినెలల క్రితం మావోయిస్టులు కాల్పులు జరిపి కిడారి, సివేరిలను హత్య చేసిన విషయం తెలిసిందే.
మందమర్రి, జనవరి 24: మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీ ఏరియాలోని గౌతమి నగర్లో గురువారం ఫారెస్ట్ అధికారులు ఐలవేని అంజయ్య అనే సింగరేణి కార్మికుని క్వార్టర్పై దాడి చేసి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాలోకి వెళ్తే సింగరేణిలో పని చేసి పదవీ విరమణ పోందిన ఐలవేని లింగయ్య అనే వ్యక్తి పదవీ విరమణ పోందిన అనంతరం చొప్పదండిలో నివాసం ఉంటున్నాడు.
విజయవాడ (క్రైం), జనవరి 24: రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 2017-18సంవత్సరానికి గాను కేంద్రం ఇచ్చిన 350 కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి తీసుకోవడంపై మాజీమంత్రి కొణతాల రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం గురువారం విచారించింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో కేంద్రం 2018 ఫిబ్రవరి 9వ తేదీన 350 కోట్లు వేసి మరలా 15న వెనక్కు తీసుకుంది.
న్యూఢిల్లీ, జనవరి 24: యోగాగురు రామ్దేవ్ బాబాను కించపరిచేలా ఉన్న అన్ని లింకులను తొలగించాలని ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. రామ్దేవ్కు సంబంధించిన వీడియోలను తీసేయడం లేదా బ్లాక్ చేయాలని యూ ట్యూబ్కూ కోర్టు స్పష్టం చేసింది. వీడియోలు అప్లోడ్ చేసిన ఖాతాదారు వివరాలు సీల్డ్ కవర్లో ఉంచి తమకు అందజేయాలని సామాజిక మాద్యమాలకు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది.
న్యూఢిల్లీ, జనవరి 24: భూపాలపల్లిలో జరుగుతున్న ‘ఓపెన్ కాస్ట్ మైనింగ్’ నిలిపివేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్పై విచారణ ఫిబ్రవరి 8కి వాయిదా పడింది. నివాస ప్రాంతాలకు సమీపంలో జరిగే పేలుళ్లువల్ల వచ్చే ప్రకంపనాలకు గృహాలు దెబ్బతింటున్నాయని, పిల్లలు, వృద్ధులు, మహిళలు భయాందోళనలకు గురవుతున్నారని రాజలింగమూర్తి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు.
న్యూఢిల్లీ, జనవరి 24: అసోంలో పౌరసత్వ నిర్ధారణకు ఉద్దేశించిన జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) తయారీని ఈ ఏడాది జూలై 31లోగా పూర్తి చేయాలని, దానిని పొడిగించరాదని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో త్వరలో సారస్వత ఎన్నికలు వస్తున్నాయని, అయితే దాని ప్రభావం ఎన్ఆర్సీ తయారీ ప్రక్రియపై ఉండరాదని, దీనిపై అధికార యంత్రాంగం సమావేశమై ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొంది.
న్యూఢిల్లీ: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావు నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారించే ధర్మాసనం నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీ తప్పుకున్నారు. దీంతో ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. సీబీఐ డైరెక్టర్ అలోక్వర్మను తొలగించిన ఉన్నత కమిటీలో జస్టిస్ సిక్రీ సభ్యుడుగా ఉన్నారు.