S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/25/2019 - 01:32

పాతబస్తీ, జనవరి 24: స్నేహితులు, బంధువుల వద్ద అప్పు చేసిన ఓ వ్యక్తి రూ.6 కోట్లు హాంఫట్ అని చేతులెత్తేయడంతో విషయం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరింది. పోలీసుల వివరాల ప్రకారం రామవరప్పాడుకు చెందిన సీహెచ్ శ్రీనివాసరావు అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అయితే వ్యాపార అవసరాల కోసం కాల్‌మనీ కోరల్లో చిక్కుకున్నాడు. వడ్డీలకు తెచ్చిన సొమ్మును వడ్డీలకే చెల్లించడంతో సుమారు రూ.

01/25/2019 - 00:58

న్యూఢిల్లీ, జనవరి 24: ఎస్సీ, ఎస్టీ సవరణ చట్టం అమలుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ చట్టం కింద నిందితుడికి ముందస్తు బెయిల్ ఇవ్వరు. జస్టిస్ ఏకే సిక్రీ, ఎ అబ్దుల్ నజీ ర్, ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. రివ్యూ పిటిషన్‌తో సహా ఈ పిటిషన్లను విచారించనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొం ది.

01/24/2019 - 22:29

రేణిగుంట, జనవరి 24: ప్రత్యేక హోదా సాధనకై రేణిగుంట రైల్వేస్టేషన్‌లో రైల్‌రోకో చేసిన వైకాపా నాయకులపై పెట్టిన కేసులను రైల్వే కోర్టు కొట్టివేసింది. గురువారం నెల్లూరు రైల్వేకోర్టులో 10 మంది వైకాపా నాయకులపై పెట్టిన కేసును న్యాయమూర్తి కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు.

01/24/2019 - 22:11

గరుగుబిల్లి, జనవరి 24: మండల పరిధిలోని చినగుడబ గ్రామానికి చెందిన ఎన్ కృష్ణమూర్తినాయుడు(38) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్‌ఐ వై సింహాచలం గురువారం తెలిపారు. ఈమేరకు గ్రామంలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే భార్యభర్తలిద్దరూ గతంలో తగదాలు పడటంతో ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుందన్నారు.

01/24/2019 - 22:11

గజపతినగరం, జనవరి 24: విద్యుత్ ట్రాన్స్‌పార్మర్ మీదకు లారీ దూసికెళ్లడంతో ట్రాన్స్‌పార్మర్ ఎగిరి తుప్పలలోకి పడగా విద్యుత్‌స్ధంభం విరిగిన సంఘటన గజపతినగరంలో చోటుచేసుకున్నది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

01/24/2019 - 04:42

హైదరాబాద్, జనవరి 23: మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం బట్టబయలైంది. గ్రీన్ గోల్డ్ బయోటెక్ సంస్థ పేరుతో చేస్తున్న మోసం ఆలస్యంగా వెలుగుచూసింది.

01/24/2019 - 04:27

నెల్లూరు, జనవరి 23: రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన నెల్లూరు జిల్లా తడ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న సుమారు 6.52 కోట్ల దేశీయ, విదేశీ కరెన్సీ ఉన్న నగదును తడ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ ఐశ్వర్య రస్తోగీ నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు..

01/24/2019 - 04:58

న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లలో పలు అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై ఎయిర్ ఇండియా మాజీ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ పై సీబీఐ బుధవారం కేసు నమోదు చేసింది. జాదవ్‌తో పాటు అప్పటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్పీ నక్వా, మాజీ అడిషనల్ జనరల్ మేనేజర్లు ఎ.కథ్‌పాలియా, అమితాబ్ సింగ్, రోహిత్ బాసిన్‌లపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి.

01/24/2019 - 04:01

పూణె, జనవరి 23: తల్లిపై కనే్నసిన ఓ దుర్మార్గుడు ఆమె లొంగకపోవడంతో ఏడేళ్ల కుమార్తెపై అత్యాచారం చేసిన హత్యచేశాడు. తరువాత రేపిస్టు చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. మహారాష్ట్రంలోని పూణె నగరంలోని మిలటరీ ఇంజనీరింగ్ కాలేజీ(సీఎంసీ) ప్రాంగణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. క్యాంప్‌లోని చెట్టుకు 24 ఏళ్ల యువకుడు ఉరేసుకుని చనిపోయి ఉండడాన్ని పోలీసులు కనుగొన్నారు.

01/24/2019 - 04:00

ముంబయి, జనవరి 23: మాలేగావ్ పేలుళ్లకేసులో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ కోర్టు సాక్షులు, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ప్రకటనల ఫోటో కాపీ ప్రతులను సెకండరీ ఈవిడెన్స్‌గా తీసుకోరాదని ముంబయి హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఏఎస్ ఓకా, ఎఎస్ గడ్కరీతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఫొటో కాపీలను ఎన్‌ఐఏ సమర్పించిందని కోర్టు పేర్కొంది.

Pages