S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/24/2019 - 03:46

విజయవాడ (క్రైం), జనవరి 23: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ) కోర్టులో ప్రిలిమనరీ ఛార్జిషీటు దాఖలు చేసింది. అయితే దాడికి సంబంధించి విచారణ మాత్రం కొనసాగిస్తామని కోర్టుకు ఎన్‌ఐఏ తెలియచేసింది. ఇదిలావుండగా మరోవైపు..

01/24/2019 - 03:17

రాజమహేంద్రవరం, జనవరి 23: ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్సులో మాయం అయిన సీఎస్ 137 రేడియో ధార్మిక మూలకం కంటైనర్ కేసును రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్‌పేయి ఆధ్వర్యంలో నియమించిన ప్రత్యేక పోలీసు బృందం ఛేదించింది. గత వారం రోజులుగా తీవ్ర కలకలానికి గురి చేసిన రాజమహేంద్రవరం ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్సులో కనిపించకుండా పోయిన రేడియో ధార్మిక మూలకం కలిగిన కంటైనర్ ఎట్టకేలకు దొరికింది.

01/24/2019 - 03:15

సామర్లకోట, జనవరి 23: ప్రముఖ సినీనటి భానుప్రియ ఇంట్లో తమ కుమార్తెను నిర్బంధంలో ఉంచారని, పనికోసమని వెళ్ళిన తమ కుమార్తెను భానుప్రియ సోదరుడు లైంగిక వేదింపులకు గురిచేస్తున్నాడని, తమతో పంపించమని అడిగేందుకు వెళ్లిన తమపై దౌర్జన్యం చేశారంటూ తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రవాడ గ్రామానికి చెందిన పెనుపాకల ప్రభావతి, తండ్రి రాజు బుధవారం సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

01/24/2019 - 01:03

ముసునూరు, జనవరి 23: వయోభారం ఒకవైపు... అనారోగ్యం మరోవైపు బాధిస్తుంటే జీవితంపై విరక్తి చెందిన వృద్ధ దంపతులు పురుగుల మందు సేవించి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడిన వైనం ముసునూరు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వలసపల్లి గ్రామానికి చెందిన సత్యవోలు నాగభూషణం (90), మంగమ్మ (85) గ్రామంలో జీవనం సాగిస్తున్నారు.

01/24/2019 - 00:48

ఘట్‌కేసర్, జనవరి 23: మధ్యాహ్నం రెక్కీ నిర్వహించి రాత్రి పూట మేకలను దొంగిలిస్తున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 21న పోలీసుస్టేషన్ పరిధి జోడిమెట్ల సమీపంలో 12 మేకలను దొంగిలించినట్లు వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఘట్‌కేసర్ క్రైం టీం పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు.

01/24/2019 - 00:22

న్యూఢిల్లీ, జనవరి 23: అగ్ర వర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈబీసీ) విద్య,ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్ట సవరణ చేయడాన్ని సవాల్ చేస్తూ బీసీ సమైక్య జాతీయ అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేంద్రం ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం లేకుండా అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తే రాజ్యాంగ స్పూర్తి దెబ్బతింటుందని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

01/23/2019 - 22:26

డీ.హీరేహాల్, జనవరి 23 : మండల కేంద్రంలోని రాజుకాలనీ వద్ద బుధవారం ట్రాక్టర్‌పై నుంచి జారిపడి తిప్పేస్వామి నాయక్ (11) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు హెచ్‌ఎస్ తండాకు చెందిన తిప్పేస్వామినాయక్ మండల కేంద్రంలోని సాయి వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు.

01/23/2019 - 22:25

కళ్యాణదుర్గం, జనవరి 23 : పట్టణంలోని ఐదుకల్లు రోడ్డులో ఉన్న ఇందిరమ్మ కాలనీకి చెందిన రాముడు కుమార్తె శిరీష్ (3) బుధవారం రాత్రి ఇంటి వద్ద నీటి తొట్టెలో పడి మరణించింది. ప్రైవేటు బస్సు క్లీనర్‌గా పని చేస్తున్న రాముడు ఇందిరమ్మ కాలనీలో కొత్తగా ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇందులో భాగంగా ఇంటి ముందు ఏర్పాటు చేసిన నీటి సంపులో ఆడుకుంటూ వెళ్లిన శిరీష్ జారీ పడి పోయింది.

01/23/2019 - 04:15

వెల్దుర్తి, జనవరి 22: వెల్దుర్తి మండలంలోని మాసాయిపేట జాతీయరహదారి పక్కన గల కెనరా బ్యాంక్ దొపిడీకి యత్నించిన దుండగులు పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసు వ్యాన్ సైరన్‌ను విన్న దుండగులు పారిపోయిన సంఘటన మంగళవారం అర్థరాత్రి 2గంటల సమయంలో చోటుచేసుకుంది. వివరాలు చేగుంట ఎస్‌ఐ సత్యనారాయణ కథనం ప్రకారం ఈవిదంగా ఉన్నాయి.

01/23/2019 - 03:52

హైదరాబాద్, జనవరి 22: అధునిక సాంకేతిక యుగంలోను మూడాచారాలు కొనసాగుతున్నాయి. క్షుద్ర పూజల్లో భాగంగా ఇద్దరు గుర్తు తెలియని మహిళలను మూసీ నదిలో అత్తపూర్ వద్ద బలి ఇచ్చిన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నగరంలో కలకలం సృష్టించిన ఈ సంఘటన నగరంలోని లాంగర్‌హౌజ్ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Pages