S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

01/21/2019 - 01:32

గంపలగూడెం, జనవరి 20: గంపలగూడెంకు చెందిన ఏసుబాబు (33) ఏటిలో చేపలు వేటాడడానికి ఆదివారం వెళ్లి ప్రమాదవశాత్తు ఏటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. చేపలకు విద్యుత్ షాక్ ఇవ్వడం ద్వారా అవి చనిపోతే వాటిని పట్టుకుని కొంతమంది ఇటీవల అమ్మకం మొదలు పెట్టారు.

01/21/2019 - 01:20

షాద్‌నగర్ టౌన్, జనవరి 20: ఈత కోసం వెళ్లి సంపులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం బూర్గుల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం బూర్గుల గ్రామానికి చెందిన తండ్రి రంగయ్య, తల్లి సత్యమ్మల కుమారుడు పవన్‌కుమార్(17)తో పాటు మరో ఇద్దరు యువకులు గ్రామంలో ఈత కోసం సంపు వద్దకు వెళ్లారు.

01/21/2019 - 01:19

జీడిమెట్ల, జనవరి 20: డీసీఎం వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కొత్తగూడెంకు చెందిన పీ.బాల్‌రాజ్(20) దూలపల్లిలోని సీఎంఆర్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు. గండిమైసమ్మ నుంచి కొంపల్లి వైపు బాల్‌రాజ్ వెళ్తుండగా కొంపల్లి, శ్రీనివాస్ నగర్ కాలనీ సమీపంలో డీసీఎం వ్యాన్ దూసుకువచ్చి ఢీకొట్టింది.

01/20/2019 - 05:17

పిఠాపురం, జనవరి 19: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం కందరాడ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు దేవిపట్నం మండలం మడిపల్లి గ్రామం వద్ద శనివారం గోదావరిలో మునిగి గల్లంతయ్యారు.

01/20/2019 - 05:11

పెద్దదోర్నాల, జనవరి 19: ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో శనివారం 92 బస్తాల కల్తీ పొటాషియం బస్తాలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇటీవలకాలంలో త్రిపురాంతకంలో 350 బస్తాల కల్తీ పొటాషియంను విజిలెన్స్ అధికారులు పట్టుకోగా వారంరోజుల వ్యవధిలోనే పెద్దదోర్నాలలో మరో 92 బస్తాల కల్తీ పొటాషియం పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది.

01/20/2019 - 04:54

విజయవాడ (క్రైం), జనవరి 19:ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యయత్నం కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తును వ్యతిరేకిస్తూ దాఖలైన హౌస్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్ధ (ఎన్‌ఐఏ) చేపట్టిన విషయం తెలిసిందే.

01/20/2019 - 04:54

విజయవాడ (క్రైం), జనవరి 19: బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.

01/20/2019 - 05:02

ముమ్మిడివరం, జనవరి 19: విశాఖ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత జగన్ మోహనరెడ్డిపై కోడి కత్తి దాడికి సంబంధించి ఎన్‌ఐఏ అధికారుల బృందం శనివారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో దర్యాప్తు నిర్వహించింది.

01/20/2019 - 02:15

గచ్చిబౌలి, జనవరి 19: నెట్ బ్యాంక్ లావాదేవీలు చేస్తున్నారా.. శనివారం సాయంత్రం ఫోన్ సిమ్ బ్లాక్ అయిందా.. సోమవారం ఉదయం ముందస్తుగా బ్యాంక్‌కు సంబంధించిన లావాదేవీలను నిలిపి వేయమని సంబంధిత బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వండి.. లేకపోతే క్షణాల్లో ఖాతాలో ఉన్న డబ్బు అన్‌లైన్‌లో బదిలీ అయిపోతుంది.

01/20/2019 - 02:06

ఏ కొండూరు, జనవరి 19: రోడ్డు ప్రమాదంలో శనివారం ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందిన సంఘటన ఇది. సేకరించిన వివరాల ప్రకారం ఇబ్రహీంపట్నం - జగదల్‌పూర్ జాతీయరహదారిపై మండలంలోని రామచంద్రాపురం విజయగార్డెన్ సమీపంలో తిరువూరు వైపు నుండి విజయవాడ వైపునకు వేగంగా వెళుతున్న కారు టైరు పంక్చరయంది.

Pages