-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ములుగుటౌన్, జనవరి 16: జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండం పాలంపేటలో ప్రేమ కోసం బోడ సింధూజ (18) అనే అమ్మాయి, పరువు కోసం అదే గ్రామానికి చెందిన అబ్బాయి తండ్రి రాజు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. పండుగ పూట ఈ సంఘటన చోటుచేసుకోవడంతో పాలంపేట గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి.
ముంబయి, జనవరి 16: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ముగ్గురు విద్యార్థుల కేసు దర్యాప్తుకు సంబంధించిన సమగ్ర వివరాలను తమకు సమర్పించాలని బొంబాయి హైకోర్టు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
గుడివాడ, జనవరి 16: గుడివాడ పట్టణంలోని బైపాస్ రోడ్డులో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ బరిలో బుధవారం మధ్యాహ్నం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గుడ్మెన్పేట నుండి వచ్చిన ఒక వర్గం ఇష్టానుసారంగా మరో వర్గంపై దాడి చేయడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
న్యూఢిల్లీ: కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. వీరికి ఈ మేరకు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్రం ప్రకటించింది. ఐదుగురు సభ్యులున్న కొలీజియం ఈ నెల 11వ తేదీన సమావేశమై పై నియామకాలను ఖరారు చేసింది.
పాల్వంచ రూరల్, జనవరి 16: ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో జీవితం మీద విరక్తి చెందిన ఓ వ్యక్తి మండల పరిధిలోని తోగ్గూడెం క్వారీలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఆ గ్రామంలో విషాదం నింపింది.
పెనుకొండ, జనవరి 16 : మండల పరిధిలోని మరవపల్లిలో చెరువులో మట్టి తోడుతుండగా పెళ్లలు విరిగిపడి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్రెడ్డి(35), వెంకటేశులు (30) మృతి చెందారు. రోజూ మాదిరిగానే బుధవారం ఇద్దరూ కలిసి మట్టి తోడుతుండగా అకస్మాత్తుగా మట్టిపెళ్లలు విరిగి పడ్డాయి. దీంతో ఇద్దరూ ఊపిరి ఆడక మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకుంది.
లేపాక్షి, జనవరి 16 : మండల పరిధిలోని మామిడిమాకులపల్లి సమీపంలో హంద్రీనీవా కాలువలో ఓ పసికందు శవం లభ్యమైంది. మంగళవారం మామిడిమాకులపల్లికి చెందిన కొందరు హంద్రీనీవా కాలువ గట్టుపై వెళ్తుండగా పసికందు శవం నీటిలో కనిపించింది. విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పనికందు శవాన్ని వెలికితీశారు. శవంపై కడుపు కుడి వైపు గాయాలకు గురైనట్లు గుర్తించారు.
కోటవురట్ల, జనవరి 16: మండలంలో కె.వెంకటాపురం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. ఈసంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై మధుసూధనరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో రాజుపేటకు చెందిన యువకుడు మళ్ళ సోమేశ్వరరావు స్వగ్రామం నుంచి బైక్పై కె.
జలుమూరు, జనవరి 16: మండలం తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యిక్తి మృతదేహం లభ్యమయింది. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు తెలుసుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇక్కడ దృశ్యాన్ని చూసి ఆచూకి తెలియలేదని పోలీసులు తెలుపుతున్నారు. మృతుడు నల్లజీన్ఫ్యాంట్, బ్లూకలర్ టీషర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఎచ్చెర్ల, జనవరి 16: మండలంలోని ఎస్ ఎంపురం గ్రామానికి చెందిన పడ్డ దీప (28) అనే వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకొంది. దీప స్వగ్రామం శ్రీకాకుళం రూరల్ మండలం బైరిసింగుపురం కాగా 2010లో ఎస్ ఎంపురం గ్రామానికి చెందిన పడ్డ గోవింద్తో వివాహం జరిగింది. గోవింద్ కళాసీగా జీవనం సాగిస్తున్నాడు.