S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/26/2018 - 00:27

బళ్ళారి, డిసెంబర్ 25: కర్నాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో మంగళవారం చిరుతపులి బాలికను నోట కరుచుకుని పరుగులు తీసింది. గమనించిన జనం వెంబడించడంతో వదిలేసింది. అప్పటికీ తీవ్రంగా గాయపడిన బాలికను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బళ్ళారి జిల్లా కంప్లి తాలూకా దేవాలాపురం గ్రామంలోకి మంగళవారం చొరబడిన చిరుతపులి ఒంటరిగా ఉన్న జయసుధ (13)పై దాడి చేసి నోట కరుచుకుని పరుగు తీసింది.

12/26/2018 - 00:20

యడ్లపాడు, డిసెంబర్ 25: గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. చిలకలూరిపేట మండలం యడవల్లి నుండి గుంటూరులోని గోరంట్లకు వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దీంతో కారులో ఉన్న గర్భిణి వేజర్ల జయశ్రీ (19), ఆమె తల్లి అనసూయ (40) ప్రమాద స్థలంలోనే మరణించారు.

12/26/2018 - 00:35

హైదరాబాద్, డిసెంబర్ 25: మావోయిస్టుల అర్బన్ నెట్‌వర్క్‌పై పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టుల అరెస్టుల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టు కేంద్ర నాయకత్వంతో ప్రత్యక్షంగా సంబంధాలను కొనసాగిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు అర్బన్ నెట్‌వర్క్ నడుపుతున్నట్టు ఏపీ పోలీసులు గుర్తించారు.

12/25/2018 - 22:56

యర్రగొండపాలెం, డిసెంబర్ 25: మండలంలోని పందివానిపల్లి గ్రామానికి చెందిన గోపు వెంకటరెడ్డి (31) అప్పుల బాధ , అనారోగ్యంతో స్వగృహాంలో చీరకొంగుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల మేరకు గత ఆదివారం గోపు వెంకటరెడ్డి భార్యను పుల్లలచెరువు మండలం సికొత్తపల్లి గ్రామానికి వలస పనులకు పంపించి తిరిగి ఇంటికి వచ్చిన వెంకటరెడ్డి తన స్వగృహాంలో చీరకొంగుతో ఉరి వేసుకొని మరణించాడు.

12/25/2018 - 22:52

యర్రగొండపాలెం, డిసెంబర్ 25: పట్టణంలోని స్థానిక వాచస్పతి స్కూల్ పక్కన నివాసం ఉంటున్న వ్యక్తి అనారోగ్య కారణంగా ఇంటిలోని వేపచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈసంఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. వివరాల మేరకు బేల్దారిగా జీవనం కొనసాగిస్తున్న పట్టణానికి చెందిన నక్కా రవి గత సంవత్సరం కిందట పక్షవాతం వచ్చి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇతనికి నలుగురు కుమారులు, ఒక భార్య ఉన్నారు.

12/25/2018 - 22:20

చెన్నూరు,డిసెంబర్ 25: మండలంలోని దుగ్గనపల్లి వ్యవసాయ పొలాల్లో పలుకుబడి ఉన్న రాజకీయ వ్యక్తి స్థలంలో కోడిపందేలు ఆడుతున్న విషయాన్ని తెలుసుకుని కడప,చెన్నూరు పోలీసులు మఫ్టీలో మూకుమ్మడిగా దాడిచేసి లక్షరూపాయలు నగదు, 20కోడికత్తులు, 10కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని 25మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈసంఘటన సోమవారం సాయంత్రం 6గంటలకు జరిగింది.

12/25/2018 - 03:51

హైదరాబాద్, డిసెంబర్ 24: దొంగ బాబా ఆటను రాచకొండ పోలీసులు కట్టించారు. అథ్యాత్మిక ముసుగులో ప్రజలను మోసం చేస్తున్న గిరీష్ సింగ్ దొంగ బాబాను అరెస్టు చేసినట్లు రాచకొండ జాయింట్ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు సోమవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. బాబాగా అవతారం ఎత్తి భక్తుల అథ్యాత్మిక కార్యక్రమాల కోసం విరాళాలు సేకరించినట్లు ఆయన తెలిపారు.

12/25/2018 - 03:30

పలాస, వజ్రపుకొత్తూరు, మందస, డిసెంబర్ 24: ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో శ్రీకాకుళం ఆర్టీసీ డిపో డి ఈఈ బమ్మిడి రవికుమార్ ఇంటిపై ఎసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. దాడుల నేపథ్యంలో రవికుమార్ బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

12/25/2018 - 02:40

హైదరాబాద్, డిసెంబర్ 24: పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తనను వేధిస్తున్నారని సినీ నటి అపూర్వ సైబర్ క్రైం స్టేషన్ (సీసీఎస్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే చింతమనేని మంచి వ్యక్తి అని, అయితే అనుచరులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

12/25/2018 - 02:13

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తలపెట్టిన రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌పై బీజేపీ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టాలన్న బీజేపీ తరఫు లాయర్ విజ్ఞప్తిని సుప్రీం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను సుప్రీం సాధారణ కేసుగానే పరిగణించిందని లాయర్ల అసోసియేషన్ వెల్లడించింది.

Pages