-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ప్రజల కంప్యూటర్లు, మానిటర్లు, సమాచార వ్యవస్థపై నిఘా పెడుతూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. పది జాతీయ దర్యాప్తు సంస్థలకు కేంద్ర నిఘా బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసింది. కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 20న ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ న్యాయవాది మమోహర్ లాల్ శర్మ సోమవారం సుప్రీం కోర్టులు ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: బాబరీ మసీదు- రామజన్మభూమి స్థల వివాదానికి సంబంధించి దాఖలైన పిటిషన్లను జనవరి 4న సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ ఆంశం ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తి ఎస్కె కౌల్ బెంచి ముందు ఉంది. 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన మొత్తం 14 పిటిషన్ల విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
హైదరాబాద్, డిసెంబర్ 24: మావోయస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న హైదరాబాద్కు చెందిన నక్కా వెంకట్రావును జార్ఖండ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మావోల నెట్వర్క్ను మరింత పటిష్టం చేయడంలో కీలకంగా ఉన్న నక్కా వెంకట్రావు ఎన్జీఆర్ఐలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మూడేళ్ళుగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉప్పల్, డిసెంబర్ 24: ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై కత్తిపోట్లకు దారితీసిన సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్ ఆటో యూనియన్కు సంబంధించిన డ్రైవర్లు పర్వతాపూర్లో బోగురు గుట్ట వద్ద దావత్ చేసుకున్నారు.
వనస్థలిపురం, డిసెంబర్ 24: నూతన సంవత్సరం వేడుకల కోసం యువతకు డ్రగ్స్ అమ్మడానికీ నగరంలో రహస్యంగా స్థావరాలు ఏర్పాటు చేసుకున్న మూఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు గుట్టు రట్టు చేశారు. కెన్యా దేశానికి చెందిన ప్రధాన నిందితుడు రెయ్మాండ్తో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
రాజేంద్రనగర్, డిసెంబర్ 24: ఇంటి ముందు పూలు కోస్తుండగా మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్డుకునేందుకు యత్నించిన వ్యక్తిపై దుండుగులు కర్రలతో దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో అనసూజ అనే మహిళ నివసిస్తోంది. సోమవారం ఉదయం దేవాలయానికి వెళ్లేందుకు అనసూజ పూలు కోస్తుంది.
వనస్థలిపురం, డిసెంబర్ 24: భక్తి ముసుగులో మల్టీలెవెల్ పేరుతో వ్వాపారాలు ఉన్నాయని అమాయక ప్రజలను మోసం చేసిన దొంగ బాబాతో పాటు అతని సోదరుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నాలుగు కార్లు, మూడు ద్విచక్ర వాహనాలు, మూడు మోబైల్ ఫోన్ల్, ల్యాప్ ట్యాప్, ఐదు ఇండియన్ పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.
మేడ్చల్, డిసెంబర్ 24: విద్యుత్షాక్కు గురై మహిళా కార్మికురాలు దుర్మరణం చెందిన సంఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరకాల ప్రకారం మండలంలోని రావల్కోల్ గ్రామ పరిధిలో గల జీఆర్బీ కంపెనీలో మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామానికి చెందిన రమావత్ కవిత(24) కార్మికురాలిగా పనిచేస్తున్నది.
నెల్లూరు, డిసెంబర్ 24: ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దొంగలు చొరబడి బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లిన ఘటన చిన్నబజార్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. స్థానిక కోటమిట్టకు చెందిన షేక్ రబ్బాని నగరంలోని ఫ్లవర్ మార్కెట్లో వ్యాపారం చేస్తుంటాడు. ఈనెల 23వ తేది రాత్రి తన కుటుంబంతో కలిసి సమీపంలోని తన అత్తమామల ఇంటికెళ్లారు.
నాయుడుపేట , డిసెంబర్ 24: వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు నీటి బోరును మరమ్మతు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కరెంటుషాక్ తగిలి నెలవల బాలసుబ్రమణ్యం (37) అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని తిమ్మాజీ కండ్రిగ గ్రామంలో చోటు చేసుకుంది.