-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
గుత్తి, డిసెంబర్ 23 : రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఆదివారం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని పాతపేటకు చెందిన జిలాన్ కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని సమీప బంధువుల దిన కర్మకు హాజరయ్యేందుకు కారులో బయల్దేరారు.
అవనిగడ్డ, డిసెంబర్ 22: గత కొంత కాలంగా దివిసీమ మీదుగా సాగుతున్న అక్రమ గంజాయి తరలింపుకు అవనిగడ్డ పోలీసులు అడ్డుకట్ట చేశారు. ముందస్తు సమాచారం మేరకు అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు నేతృత్వంలో పులిగడ్డ చెక్ పోస్టు వద్ద శనివారం నిర్వహించిన వాహనాల తనిఖీల్లో రూ.22లక్షలు విలువ చేసే 100 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఇరువురు వ్యక్తులని అరెస్టు చేసి మీడియా ముందు హాజరు పరిచారు.
విజయవాడ (క్రైం), డిసెంబర్ 22: అక్రమంగా నకిలీ ఎరువులు, మందులు తయారు చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రూ.15లక్షలు విలువైన సరకు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శామీర్పేట, డిసెంబర్ 22: రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో బాలానగర్ నగర్ ఎస్ఓటీ పోలీసులు, స్థానిక పోలీసుల బృందం మండల కేంద్రంలోని సెలబ్రీటీ క్లబ్పై దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 22: సీపీఐ మావోయిస్టు పార్టీ నేతలు కే.పురుషోత్తమ్ అలియాస్ అశోక్, ఆయన భార్య కే.వినోదిని అలియాస్ విజయలక్ష్మి శనివారం ఇక్కడ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పోలీసు కమిషనర్ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ నేత పురుషోత్తం పార్టీలో ఎంకేగా పరిచితుడని చెప్పారు.
మహబూబాబాద్, డిసెంబర్ 22: మావోయిస్టు నేత హరిభూషణ్కు కొరియర్లుగా వ్యవహరిస్తూ ఆయుధ సరఫరాలో భాగం అవుతున్న ముగ్గురు కొరియర్లను శనివారం గంగారం సమీపంలో అరెస్ట్ చేశారు. వారి నుండి ఒక తుపాకి, 20తుటాలను, విప్లవ సాహిత్యాన్ని స్వాదీనం చేసుకున్నారు. మహబూబాబాద్ టౌన్పోలీస్స్టేషన్సమావేశ హాల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఈ అరెస్ట్ వివరాలను వెల్లడించారు.
శ్రీనగర్, డిసెంబర్ 22: కాశ్మీర్లో ఉగ్రవాదులకు పెద్ద దెబ్బతగిలింది. ఆల్ ఖాయిదా గ్రూపుకు చెందిన వారుగా చెప్పుకుంటున్న ఆరుగురు ఉగ్రవాద ము ష్కరులు భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. కరడు గట్టిన ఉగ్రవాది జకీర్ ముసా మరణించాడు. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులు మరణించారని పోలీస్ ఐజీ స్వ యం ప్రకాశ్ పాని చెప్పారు.
సిరిసిల్ల, డిసెంబర్ 22: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిలెటిన్స్టిక్స్ పేలాయి. ఈ సంఘటనలో మహిళ గాయాలకు గురైంది. శనివారం సాయంత్రం సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్లో చెత్త కుప్పను కాల్చినపుడు ఈ సంఘటన జరిగింది.
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: అగస్టావెస్ట్లాండ్ వీవీఐపీ హెలీకాప్టర్ల కేసులో అరెస్టయిన క్రిస్టియన్ మిచెల్ మరో ఏడు రోజుల ఈడీ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశించింది. మిచెల్ బెయిల్ పిటిషన్ను ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ కొట్టివేశారు.
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: రాజధాని ఢిల్లీలో సిక్కుల ఊచకోత కేసులో యావజ్జీవ శిక్ష పడ్డ కాంగ్రెస్ మాజీ నేత సజ్జన్కుమార్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 1984 కేసులో ఢిల్లీ హైకోర్టు కుమార్కు జీవించి ఉన్నంత కాలం కారాగార శిక్ష విధిస్తూ ఇటీవలే తీర్పునిచ్చింది.