S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/22/2018 - 02:50

కైకలూరు, : కైకలూరు కో-ఆపరేటీవ్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆలపాటి సాయి బాబు శుక్రవారం సాయంత్రం రూ.30వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోదక శాఖాధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

12/22/2018 - 02:40

హైదరాబాద్, డిసెంబర్ 21: పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తి తన తండ్రి గొంతు నులిమి హతమార్చిన సంఘటన గాంధీనగర్‌లో చోటు చేసుకుంది. ముషీరాబాద్ పోలీస్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి, పోలీసుల కథనం ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన ఎల్లయ్య కుమారుడు వెంకటేశ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

12/22/2018 - 02:02

హైదరాబాద్, డిసెంబర్ 21: చట్టబద్ధంగా కొనుగోలు చేసిన స్థలం విషయంలో రెవిన్యూ అధికారులు జోక్యం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తులు రామసుబ్రమణ్యం, ఉమాదేవితో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారిస్తూ దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

12/22/2018 - 02:01

షిల్లాంగ్, డిసెంబర్ 21: మేఘాలయలో అక్రమ బొగ్గు గనిలో నీరు ప్రవేశించడంతో, గనిలో చిక్కుకున్న 13 మంది కార్మికులు జీవించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ గనిలో నీటి మట్టం గణనీయంగా తగ్గింది. వీరంతా గత 13వ తేదీ నుంచి ఆహారం, నీరు లేకుండా జీవిస్తున్నారు. తూర్పు జైంతియా హిల్స్‌లోని ఈ గనిలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు పోలీసులు, అధికారులు తెలిపారు.

12/22/2018 - 01:34

గోదావరిఖని, డిసెంబర్ 21: సింగరేణి ఎస్‌ఓటూ (ఫైనాన్స్) ప్రసాద రాజుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రామగుండం రీజియన్‌లోని 7 ఎల్‌ఈపీ బొగ్గు గనిలో సింగరేణి బొగ్గు పరిశ్రమ డైరెక్టర్ (ఫైనాన్స్) బలరాం పర్యటనలో ఘటన జరిగింది. బొగ్గు గనిలోకి దిగి అక్కడ సందర్శించిన సమయంలో ఎస్‌ఓటూ ఫైనాన్స్ అధికారి అస్వస్థతకు గురి కావడంతో అందరూ హడలిపోయారు.

12/22/2018 - 01:28

గుంటూరు, డిసెంబర్ 21: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో లో శుక్రవారం ఒక్కసారిగా బాంబులు కలకలం రేపాయి. రెంటచింతల మండలం మంచికల్లు గురజాల ఎమ్యెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్వగ్రామం. శనివారం ఈ గ్రామంలో పోలేరమ్మ జాతర నిర్వహించాల్సి ఉంది. ఇందులో భాగంగా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

12/22/2018 - 00:53

వరపల్లి, డిసెంబర్ 21: పొలంలో వ్యవసాయ బోరు వేసుకోవడానికి అనుమతి మంజూరుకు రైతు నుండి రూ.13వేలు లంచం తీసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి ఇన్‌ఛార్జి వీఆర్వో కొండపల్లి వేణుగోపాల్ (గోపీ) శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికార్లకు దొరికిపోయారు.

12/22/2018 - 00:44

మచిలీపట్నం, డిసెంబర్ 21: ముంబైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ నాలుగేళ్ల క్రితం దారుణ హత్యకు గురైన కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితుడి మరణ శిక్షను ముంబై హైకోర్టు శుక్రవారం ఖరారు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన చంద్రభానుకు గతంలోనే ముంబై సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది.

12/22/2018 - 00:32

తొర్రూరు, డిసెంబర్ 21: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామం శుక్రవారం నాడు శోకసముద్రంలో మునిగిపోయింది. పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వెళ్లిన వెంకటాపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు అనుమానాస్పద స్థితిలో మరణించడం గ్రామంలో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఈ ఘటనలో మరణించిన నలుగురు యువకులు అవివాహితులు కావడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

12/21/2018 - 22:50

కోల్‌కొతా, డిసెంబర్ 21: పశ్చిమబెంగాల్‌లో బీజేపీ రథయాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. బీజేపీ తలపెట్టిన రథయాత్రకు అనుమతిస్తూ సింగిల్ జడ్జి బెంచి ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టివేసింది. రథయాత్ర వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటూ ఇంటెలిజెన్స్ విభాగం సమర్పించిన 36 అంశాల నివేదికను పరిశీలించి కేసును తాజాగా విచారించాలని ధర్మాసనం సింగిల్ బెంచి కోర్టును ఆదేశించింది.

Pages