S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/22/2018 - 06:36

జమ్మికుంట, నవంబర్ 21: జమ్మికుంట మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన గాజర్ల సారంగం (49) అనే కౌలు రైతు పురుగుల మందు త్రాగి బుధవారం అత్మహత్యకు పాల్పడ్డడు. గాజర్ల సారంగం గత 5సంవత్సరాలుగా 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గత సంత్సరంలో వర్షాలకు పత్తి పంట దెబ్బతిని అర్థికంగా తీవ్ర నష్టం కలిగింది.

11/22/2018 - 04:44

ఏలూరు, నవంబర్ 21 : స్థానిక జిల్లా జైలులో తాడేపల్లిగూడెంనకు చెందిన మారగాని గోపాలకృష్ణ(70) అనే వృద్దుడు బుధవారం మృతిచెందాడు. గోపాలకృష్ణ బుధవారం ఉదయం జైలులో టి తాగుతూ అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గోపాలకృష్ణ గత కొద్దిరోజులుగా జిల్లా జైలులో ఎన్ ఐ యాక్ట్ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు.

11/22/2018 - 04:38

స్టేషన్‌ఘన్‌పూర్, నవంబర్ 21: సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో రూ. 39లక్షల 50వేల రూపాయల కట్టలు బుధవారం పట్టుబడ్డాయి. వివరాల్లోకి వెళ్తే..

11/22/2018 - 03:24

న్యూఢిల్లీ, నవంబర్ 21: అండమాన్ నికోబర్ దీవుల్లో ఓ అమెరికా జాతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. నార్త్ సెంటినీల్ ద్వీపంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఓ గిరిజన తెగకు చెందిన వారే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఢిల్లీలోని అమెరికా కాన్సులేట్ తమ పౌరుడు అదృశ్యమైనట్టు ప్రకటించింది.

11/22/2018 - 01:35

తిరుపతి, నవంబర్ 21: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తుల నుంచి గత కొంతకాలంగా బంగారు ఆభరణాలు చోరీచేస్తూ భార్యాభర్తల్లా చలామణి అవుతున్న తమిళనాడు తిరుచ్చికి చెందిన మణికంఠన్, నందినిని తిరుమల క్రైం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 9లక్షలు విలువచేసే 300 గ్రాముల బరువుకలిగిన బంగారు చైన్‌లను తిరుమల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

11/22/2018 - 01:02

మహదేవ్‌పూర్, నవంబర్ 21: మహారాష్ట్ర నుండి పవిత్ర పుణ్య క్షేత్రమైన కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన 10 మంది భక్తుల్లో ముగ్గురు త్రివేణి సంగమం గోదావరి ఒడ్డున గల్లంతైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది.

11/21/2018 - 23:35

మారేడుమిల్లి, నవంబర్ 21: మండలంలోని సున్నంపాడు గ్రామ పంచాయతీ సమీపంలో ఓ బస్సు బైకును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ డిపోకు చెందిన అల్ట్రా డీలక్స్ బస్సు బుధవారం భద్రాచలం నుండి కాకినాడ వెడుతూ సున్నంపాడు సమీపంలో ఓ ప్రమాదకర మలుపు వద్ద రంపచోడవరం నుండి మారేడుమిల్లికి వస్తున్న బైకును బలంగా ఢీకొట్టింది.

11/21/2018 - 02:52

తాడిపత్రి, నవంబర్ 20: ప్రభుత్వ ఆసుపత్రి మరుగుదొడ్డిలో మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మరుగుదొడ్డి కిటికీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. యాడికి మండలం చింతరాయపల్లెకు చెందిన మెహరూన్‌బీ(50) చికిత్స కోసం ఈనెల 6వ తేదీ తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.

11/21/2018 - 02:44

మార్టూరు, నవంబర్ 20: గుట్కా ప్యాకెట్లను రవాణా చేస్తున్న ఓ ముఠాను ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు గుట్టురట్టు చేశారు. రూ.18 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకోగా, రెండు వాహనాలు సీజ్ చేసి, 11 మందిని అరెస్టు చేశారు. చీరాల డీఎస్పీ వి శ్రీనివాసరావు మంగళవారం విలేఖరులకు వివరాలు వెల్లడించారు.

11/21/2018 - 02:19

బెగుసరాయి (బిహార్), నవంబర్ 20: ముజఫర్‌పూర్ శరాణాలయం కేసులో తప్పించుకుని తిరుగుతున్న బిహార్ మాజీ మంత్రి మంజు వర్మ మంగళవారం స్థానిక కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆమెను డిసెంబర్ ఒకటి వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. శరణాలయాల పేరిట బాలికలపై అకృత్యాలకు పాల్పడిన సంఘటనలు ఈ ఏడాది ఆగస్టులో వెలుగులోకి వచ్చి రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

Pages