S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/19/2018 - 22:54

విజయవాడ (క్రైం), నవంబర్ 19: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పదేళ్ల జైలుశిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.

11/19/2018 - 22:46

మార్కాపురం, నవంబర్ 19: పట్టణంలో టీ పొడి విక్రయిస్తున్న దుకాణంపై విజిలెన్స్ అధికారులు సోమవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు బస్తాల నకిలీ టీ పొడి గుర్తించినట్లు సిఐ బీటీ నాయక్ తెలిపారు. జిల్లా విజిలెన్స్ అదనపు ఎస్పీ రజనీ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు.

11/19/2018 - 22:38

పలమనేరు, నవంబర్ 19: పలమనేరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సోమవారం మధ్యాహ్నం మండలంలోని జర్రావారిపల్లికి చెందిన మదనశేఖర్‌రెడ్డి పెట్రోల్ క్యాన్‌తో తహశీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకొని తనకు న్యాయం చేయాలంటూ ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. పక్కనే ఉన్న పోలీసులు ఇది గమనించి పెట్రోల్ క్యాన్‌ను తీసుకున్నారు.

11/19/2018 - 22:21

విశాఖపట్నం(క్రైం), నవంబర్ 19: మానసిక ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన వ్యక్తి అదృశ్యమైనట్టు స్థానిక పోలీసులకు సోమవారం ఫిర్యాదు అందింది. కృష్ణాజిల్లా, నూజీవీడు, ఆసిరివల్లి మండాలానికి చెందిన మాదు శివశంకర్(34) కొద్ది రోజుల క్రితం చినవాల్తేరులో గల మానిసిక ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చాడు. ఈ తరుణంలో ఈనెల 17న ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఆసుపత్రి నుండి శివశంకర్ అదృశ్యమయ్యాడు.

11/19/2018 - 21:38

ఉరవకొండ, నవంబర్ 19: ఉరవకొండ శివారు ప్రాంతంలోని అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉరవకొండకు చెందిన మేఘనాథ్(40) ఉరవకొండ నుండి బూదగవికి నడుచుకుంటూ వెళుతుండగా అనంతపురం నుండి బళ్లారికి వెళుతున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

11/19/2018 - 01:09

జీడిమెట్ల, నవంబర్ 18: నమ్మి ఉద్యోగం ఇచ్చిన ఇంట్లోనే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. డ్రైవర్‌గా పనిచేసూ యజమాని ఇంట్లోని రూ.75 లక్షల నగదును అపహరించి కటకటాల పాలైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఆదివారం పేట్‌బషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను బాలానగర్ జోన్ డీసీపీ పద్మజా, ఏసీపీ శ్రీనివాస్ రావు, పేట్‌బషీరాబాద్ సీఐ మహేశ్ వెల్లఢించారు.

11/19/2018 - 01:04

ఉప్పల్, నవంబర్ 18: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవింగ్ భార్యాభర్తల దుర్మరణానికి కారణమైంది. సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా అదుపుతప్పిన బస్సు రోడ్డు మధ్యలో సిగ్నల్ స్తంభానికి ఢీకొనడంతో ముందు టైర్ బ్లాస్ట్ అయింది. అదే సమయంలో అక్కడ బైక్‌పై ఉన్న భార్యాభర్తలతో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించగా కోటేశ్వర్ రావు, అతని భార్య స్వప్న చికిత్స పొందుతూ సాయంత్రం మరణించారు.

11/19/2018 - 00:59

మంచిర్యాల, నవంబర్ 18: మంచిర్యాల జిల్లా హాజీపూర్ (మం) బుగ్గ గుట్ట ఏరియాలో మూడు బెల్ట్ షాపులపై రామగుండం టాస్క్ఫోర్సు పోలీసులు దాడి చేసి యజమానులను అదుపులోకి తీసుకున్నారు.

11/19/2018 - 00:28

విశాఖపట్నం(క్రైం), నవంబర్ 18: వేగంగా నడుపుతూ మోటారుబైక్‌ను ఢీకొట్టి ఇద్దరిని గాయాలపాలు చేసిన ఆటో డ్రైవర్‌పై కంచరపాలెం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. రైల్వే న్యూకాలనీలో నివాసముంటున్న కె వంశీ(21), అతని స్నేహితుడు పరమాన్ కలిసి ఈనెల 15న మోటారుబైక్‌పై కంచరపాలెం బిఆర్‌టిఎస్ రోడ్డు గుండా జ్ఞానాపురం వైపు వెళ్తుండగా కంచరపాలెం వైపు వేగంగా వస్తున్న ఆటో ఢీకొంది.

11/19/2018 - 00:00

మధిర నవంబర్ 18: మధిర మండల పరిధిలో ఆత్కూరు చెక్‌పోస్టు వద్ద అర్టీసీ బస్సులో తరలిస్తున్న 15 లక్షల నగదును స్టాటిక్ సర్వేలైన్ టీం ఇన్‌చార్జ్ అధికారి రాజేష్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఖమ్మం నుండి ఆదివారం ఉదయం మధిరకు వస్తున్న పల్లెవెలుగు బస్సు నెంబర్ ఎపి 29జడ్ 1039ని ఆత్కూరు చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఎస్‌టి టీం తనిఖీలో రూ.15లక్షల నగదు పట్టుబడింది బస్సులో ప్రయాణీకులు ఎక్కువగా వున్నారు.

Pages