-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
సదాశివనగర్, నవంబర్ 9: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. రామారెడ్డి మండలంలోని పోసానిపేట్, గోకుల్తాండ గ్రామాలకు చెందిన విద్యార్థులు పాఠశాలకు ఆటో టీఎస్ 17 టీ1126లో వస్తుండగా సదాశివనగర్ మండలంలోని తిర్మన్పల్లి గ్రామ శివారులోకి రాగానే ఆటో ముందు టైరు పగిలి పోయిందని తెలిపారు.
ధర్మవరం, నవంబర్ 9 : ధర్మవరం చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పట్టణంలోని సంజయ్నగర్కు చెందిన పోలశెట్టి పురుషోత్తం (30) కూలి మగ్గం నేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇతడికి ఏడేళ్ల క్రితం స్వాతితో వివాహమైంది. పెళ్లయిన తర్వాత వేరుగా కాపురం పెట్టుకుని జీవిస్తున్నారు. అయితే గురువారం సాయంత్రం బయటికి వెళ్లిన పురుషోత్తం శుక్రవారం చెరువులో శవమై తేలాడు.
రాజాం, నవంబర్ 9: రాజాం మండలానికి సంబంధించి 1-10-2017 నుంచి 31-3-2018 వరకు నిర్వహించిన ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి 11వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమం శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు.
భూదాన్ పోచంపల్లి, నవంబర్ 9: మండలంలోని పిల్లాయిపల్లి గ్రామంలో అబ్బవతి మల్లమ్మ(70) వృద్దురాలిని గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వృద్దురాలికి కుంకుమ చల్లి, నోట్లో మూగజీవాల పేగులు కుక్కడంతో ఊపిరి ఆడక మృతి చెందిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
పెద్దకడుబూరు, నవంబర్ 8: మండల పరిధిలోని కంబళదినె్న గ్రామంలో బ్యాంక్ ఉద్యోగి కురువ పూజారి నరసప్ప(36) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ అశోక్ గురువారం విలేఖరులకు తెలిపారు.
మాకవరపాలెం, నవంబర్ 8: తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేప్రోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి చెందింది. గత నెల 22వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలో జి.వెంకటాపురంకు చెందిన ఏడుగురు మహిళలతో పాటు జి.కోడూరుకు టాటా మ్యాజిక్ డ్రైవర్ మళ్ళ సంతోష్ తోపాటు కోటవురట్ల మండలం కె.వెంకటాపురంకు చెందిన నాగరాజులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డారు.
సత్తుపల్లి, నవంబర్ 8: విధినిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ సర్వీసు రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సత్తుపల్లి మండలం గంగారం 15వ బెటాలియన్ క్యాంపులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే..
వాకాడు, నవంబర్ 8: మండల పరిధిలోని అందలమాల గ్రామంలో పండుగపూట విషాదచాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన ఒక రైతు పొలం పనులు చేసుకుని ట్రాక్టర్పై తిరిగి వస్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తాపడటంతో ఆ రైతు అక్కడికక్కడే మృతిచెందగా, తన కుమారుడు మరణాన్ని తట్టుకోలేక ఆయన తల్లి దుర్మరణం చెందింది.
సైదరాబాద్, నవంబర్ 8: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అక్రమ నగదు తరలింపుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు. మూడు ప్రాంతాల్లో వాహనాల్లో తరలిస్తున్న రూ. 7.51 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. బషీర్బాగ్లోని నగర పోలీస్ కమిషనరేట్లో జరిగిన మీడియా సమావేశంలో సీపీ అంజనీ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఆత్మకూర్, నవంబర్ 8: వనపర్తి జిల్లా ఆత్మకూర్కు చెందిన హర్షవర్ధన్గౌడ్ (22) గురువారం ఉదయం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వలో గల్లంతయ్యాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆత్మకూర్ మాజీ సర్పంచ్ లావణ్య, అనిల్కుమార్గౌడ్ దంపతులకు చెందిన హర్షవర్దన్గౌడ్ హైదరాబాద్లో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తూ దీపావళికి ఆత్మకూర్కు వచ్చాడు.