S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/05/2018 - 23:17

వేటపాలెం, నవంబర్ 5: ఆటో, కంటైనర్ ఢీకొని ఒకరు మృతిచెందగా నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు చినగంజాం మండలం కుండుడుచెట్లపాలెంకు చెందిన వడ్లమూడి యలమంద (31) గుంటూరు జిల్లా బాపట్లలో గొర్రెలను కొనుగోలు చేసేందుకు స్నేహితుడు బట్టు వెంకయ్యతో కలిసి సోమవారం తెల్లవారుజామున పందిళ్లపల్లికి చెందిన వెంకటస్వామి ఆటోలో బయలుదేరారు.

11/05/2018 - 23:16

పొదిలి, నవంబర్ 5 : పొదిలి పట్టణంలోని దర్శి రోడ్డుప్రాంతంలో ఒక కూల్‌డ్రింక్‌షాప్ షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. ఆ షాపు యజమాని ఎస్ నసీరుద్దీన్ ఆదివారం రాత్రి వరకు వ్యాపారం నిర్వహించి తలుపులు మూసేసి ఇంటికి వెళ్ళాడు. అర్ధరాత్రి దాటిన తరువాత షాపులో నుండి మంటల రావటంతో గమనించిన చుట్టుపక్కల వారు యజమానికి సమాచారం అందించారు.

11/05/2018 - 23:04

మధిర నవంబర్ 5: మండల పరిధిలోని దిడుగుపాడు గ్రామంలోని పొలాలలోవున్న కొండచిలువను కూలీలు చంపివేశారు. రైతుసమన్వయ సమితి మండల కన్వీనర్ యన్నం కోటేశ్వరరావు పొలంలో కూలీలు సోమవారం పత్తి తీసేందుకు వెళ్ళారు. కూలీలు పత్తి తీస్తుండగా సాళ్ళ మధ్యలో ఎనిమిది అడుగుల కొండచిలువ కనిపించడంతో కూలీలు భయభ్రాంతులు గురై కేకలు వేయడంతో పక్క పొలాలలో వున్న రైతులు వచ్చి కొండచిలువను హతమార్చారు.

11/05/2018 - 23:02

దమ్మపేట,నవంబర్ 5: మండల కేంద్రం దమ్మపేటలో ఓ వ్యక్తి ఘరానా మోసాలకు పాల్పడ్డాడు. చిట్టీల పేరుతొ డబ్బులు వసూలు చేయడం,అధిక వడ్డీ ఆశ చూపి వ్యాపారులను,మద్యతరగతి కుటుంబలాను రూ.5 కోట్లకు పైగా వసూలు చేసి పత్తా లేకుండా పరారయ్యాడు. బాధితులు దమ్మపేట పొలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు స్తానికంగా నివాసం వుండే చవ్వా రాజు (హంక్ రాజు) అనధికారంగా చిట్టీ వ్యాపారం నిర్వహిస్తున్నాడు.

11/05/2018 - 22:51

నరరావుపేట, నవంబర్ 5: పట్టణ, పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 6.10లక్షల రూపాయలు సొమ్మును, రెండు మోటారు సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కె నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

11/05/2018 - 22:33

పూతలపట్టు, నవంబర్ 5: పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై పి.కొత్తకోట సమీపాన సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

11/05/2018 - 22:12

గజపతినగరం, నవంబర్ 5: పరీక్ష రాసేందుకు వెళ్లిన వసతి గృహం విద్యార్థిని అదృశ్యం అయిన సంఘటన గజపతినగరంలో చోటుచేసుకొంది. ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి. పాచిపెంట మండలం మోసూరు గ్రామానికి చెందిన కుచ్చుల ధనలక్ష్మి గజపతినగరం ఎస్సీ బాలికల వసతిగృహంలో ఉంటూ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్నది.

11/05/2018 - 21:51

గాజువాక అంబేద్కర్ కాలనీలో తన ఇంటి స్థలాన్ని కబ్జా చేసిన రిటైర్డ్ పోలీసు నుంచి స్థలం ఇప్పించాలంటూ మహిళ హల్‌చల్ చేసింది. ఇదే విషయమై రెండు నెలల కిందట కలెక్టరేట్‌లో సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేసిన మహిళ ఉసిలి లక్ష్మి తాజాగా తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రజావాణికి వచ్చింది. ఈ సారి పురుగుల మందు చేతపట్టుకుని తనకు న్యాయం చేయని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది.

11/05/2018 - 21:28

ఆదిలాబాద్, నవంబర్ 5: ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని మహారాష్టక్రు ఆనుకొని ఉన్న జైనథ్ మండలం పిప్పర్‌వాడ చెక్‌పోస్టు వద్ద సోమవారం పోలీసుల తనిఖీల్లో కారులు హైదరాబాద్‌కు తీసుకవెళ్తున్న రూ.4లక్షల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ చెక్‌పోస్టు వద్ద 20 రోజుల్లో మూడుసార్లు భారీ మొత్తంలో నగదు పట్టుబడడం గమనార్హం.

11/05/2018 - 00:14

నెల్లూరు, నవంబర్ 3: నెల్లూరు నగరంలో సంచలనం రేపిన కాల్పుల కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తును వేగవంతం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తుపాకీ సంస్కృతి నెల్లూరు నగరానికి పాకడంతో ప్రజలతో పాటు పోలీసులు కూడా ఉలికిపాటుకు గురయ్యారు. కాల్పుల్లో మృతి చెందిన మహేంద్రసింగ్‌కు పోస్టుమార్టం ఆదివారం సాయంత్రం పూర్తిచేయించి మృతదేహాన్ని కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు.

Pages