S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

11/02/2018 - 22:15

కాకుమాను, నవంబర్ 2: పెళ్లైతే అల్లారుముద్దుగా పెంచిన తల్లిదండ్రులకు దూరమవుతానేమోనన్న భయంతో మండల కేంద్రమైన కాకుమానుకు చెందిన యువతి వై మల్లేశ్వరి (27) ఆత్మహత్య చేసుకున్న ఉదంతమిది. కాకుమానుకు చెందిన వై శంకరరావు దంపతులకు ఇద్దరు సంతానం కాగా వై మల్లేశ్వరిని తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచడంతో పాటు ఆమెను చదివించి పోలీసు కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చే వరకు కష్టపడ్డారు.

11/02/2018 - 21:54

లేపాక్షి, నవంబర్ 2: మండల కేంద్రమైన లేపాక్షి విద్యుత్ సబ్‌స్టేషన్ వెనుక ఓ వ్యక్తి చింతచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎఎస్సై సుబ్బరాంనాయక్ తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గత ఐదు రోజుల క్రితం షఫీవుల్లా అనే వ్యక్తి ఇంటి నుండి బయటకు వెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్ళలో వెతికినా ప్రయోజనం లేకపోయింది.

11/02/2018 - 21:37

పెదబయలు, నవంబర్ 2: మండలంలోని సీతగుంట పంచాయతీ కార్యదర్శి కల్యాణిపై మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సీతారామస్వామి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై జిల్లా పంచాయతీ అధికారి క్రిష్ణకుమారి శుక్రవారం విచారణ నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆమె విచారణ చేపట్టి లైంగిక వేధింపులపై పలు వర్గాల వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు.

11/02/2018 - 21:31

ఎచ్చెర్ల, నవంబర్ 2: మండలంలోని ఫరీద్‌పేట గ్రామానికి చెందిన బుడుమూరు వెంకటలక్ష్మి అనే వివాహిత రెండేళ్ల కుమారుడు రోహిత్‌తో కలిసి అదృశ్యమయినట్లు తండ్రి కొత్తకోట బీమారావు శుక్రవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంకటలక్ష్మిని నాలుగేళ్ల క్రితం బూర్జి మండలం ఓవి పేటకు చెందిన తిరుమలరావుకిచ్చి వివాహం చేశారు. వీరు ఉద్యోగరీత్యా గుంటూరులో ఉండగా ప్రమాదవశాత్తు తిరుమలరావు మృతి చెందాడు.

11/02/2018 - 00:46

ఉప్పల్, నవంబర్ 1: ఎన్నికల హడావుడిలో పోలీసుల బిజీగా ఉన్నట్లు గమనించిన దొంగలు రామంతాపూర్‌లో హల్‌చల్ చేశారు. బాలాజీనగర్‌లోని రెండిళ్లలో తాళం విరగొట్టి లోపల ఉన్న రూ.15లక్షల నగదు, 20 తులాల బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో పట్టపగలు జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బాలాజీనగర్‌లో నివసిస్తున్న డీ.శేఖర్ సికింద్రాబాద్‌లో సేల్స్‌మెన్‌గా పని చేస్తున్నాడు.

11/02/2018 - 00:46

కొత్తూరు రూరల్, నవంబర్ 1: రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియాను కొంతమంది అక్రమ వ్యాపారులు పరిశ్రమలకు తరలిస్తున్నారు. గురువారం ఉదయం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామ సమీపంలో ఉన్న అల్మో ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నందిగామ ఎస్‌ఐ నర్సింహారెడ్డి కథనం ప్రకారం..

11/02/2018 - 00:40

అల్వాల్, నవంబర్ 1: బొల్లారం పోలీస్ స్టేషన్ పరిథిలోని కేంద్రీయ విద్యాలయం నుండి ముగ్గురు విద్యార్థులు పాఠశాల నుంచి తప్పిపోయిన ఘటన బుధవారం జరిగింది. కేంద్రీయ విద్యాలం ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

11/02/2018 - 00:19

నందిపేట, నవంబర్ 1: నందిపేట మండలం ఆంధ్రనగర్ గ్రామం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గద్దెల సాయిలు(57), చాకలి రామారావు(48)లు అక్కడికక్కడే మృతి చెందారు. ఆంధ్రనగర్‌కు చెందిన వీరిరువురు కలిసి టీవీఎస్ ఎక్సెల్‌పై గ్రామ శివారులో ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించేందుకు వెళ్లి తిరుగు ప్రయాణం అవుతుండగా, రామాలయం సమీపంలో వెనుక నుండి వస్తున్న నిజామాబాద్ ఆర్టీసీ డిపో బస్సు వేగంగా ఢీకొట్టింది.

11/02/2018 - 00:09

అవనిగడ్డ, నవంబర్ 1: మండల పరిధిలోని పులిగడ్డ ఆక్విడక్టు వద్ద మంగళవారం రాత్రి డీఎస్సీ కోచింగ్ ముగించుకుని ఇంటికి వెళుతున్న అభ్యర్థినికి అవనిగడ్డ సెంటరులో ఆమె స్నేహితుడు కనిపించగా అతని బైక్‌పై ఎక్కి మోపిదేవి వెళుతున్నారు.

11/01/2018 - 23:44

కౌతాళం, నవంబర్ 1:పలు మోసాలకు పాల్పడిన షేక్ సలీమ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఆదోని డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. డీఎస్పీ గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ షేక్ సలీమ్ సొంత ఊరు దిబ్బనకల్ గ్రామం అని అతడు 2016 నుంచి పలు మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. గ్రామంలో పలువురితో ఘర్షణ పడగా ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్‌లో 2 కేసులు నమోదయ్యాయన్నారు.

Pages