S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/30/2018 - 23:50

పెనుకొండ, అక్టోబర్ 30 : పట్టణ సమీపంలో నిర్వహిస్తున్న కొరియన్ రెస్టారెంట్లపై ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ డీఎస్పీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం విస్తృత దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గోపాల్ మాట్లాడుతూ ఇద్దరు కొరియన్, నలుగురు స్థానికులను అరెస్టు చేసి రూ.75 వేల విలువజేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

10/30/2018 - 23:48

గుంతకల్లు, అక్టోబర్ 30 : అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం మండలంలోని చింతలాంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మామిళ్లపల్లి రైతు సుధాకర్(42) పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. వరుస కరువులతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన సుధాకర్ మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

10/30/2018 - 05:22

కాకినాడ సిటీ, అక్టోబర్ 29: డాక్టర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, కేంద్ర మంత్రి కుమారుడు తదితర అవతారాలతో ప్రజలకు, నిరుద్యోగులకు, రాజకీయ నేతలకు కోట్లలో కుచ్చుటోపీ పెట్టి తప్పించుకు తిరుగుతున్న ఓ నేరస్థుడిని కాకినాడ నేర పరిశోధన విభాగం పోలీసులు అరెస్టుచేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్పీ విశాల్ గున్ని నిందితుడి మోసాల వివరాలను తెలియజేశారు.

10/30/2018 - 05:19

కొమరోలు, అక్టోబర్ 29: ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి పందరబోయిన ఇంద్రకళావతి (20) అనుమానస్పదస్థితిలో మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు ఆవులయ్య, అంజనమ్మలకు ఇరువురు కుమార్తెలు, ఇరువురు కుమారులు కాగా పెద్దకుమార్తెకు, పెద్దకుమారుడికి వివాహం జరిగాయి.

10/30/2018 - 05:03

కోదాడ, అక్టోబర్ 29: వాహన తనీఖీల్లో భాగంగా తెలంగాణ సరిహద్దు రామాపురం క్రాస్‌రోడ్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా సోమవారం ఎపి 16 ఎఫ్‌డి 1116 వాహనంలో 8 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరియైన ధృవపత్రాలు లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

10/30/2018 - 05:00

గోదావరిఖని, అక్టోబర్ 29: తెలంగాణలో జరిగే సాధారణ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ నిఘాను విస్తృతం చేసింది. నిన్న పెద్ద మొత్తంలో దొంగనోట్ల కలకలం... నేడు భారీగా పేలుడు పదార్థాల పట్టివేత రామగుండం కమీషనరేట్‌లో చర్చనీయాంశం అవుతుంది. ఎన్నికల తేది దగ్గరపడ్డ సమయంలో ఈ వ్యవహారం ఆందోళనకు గురి చేస్తుంది.

10/30/2018 - 04:45

హైదరాబాద్, అక్టోబర్ 29 : కళాశాల బస్సు ఢీకొన్ని ఓ విద్యార్థిని మృతి చెందింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జగద్గిరిగుట్ట సోమయ్యనగర్‌లో నివాసం ఉంటున్న పరమేష్, చంద్రకళ కుమార్తె రేకుల రమ్య (16) కూకట్‌పల్లిలోని శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ ఫస్టియర్ చదువుతోంది.

10/30/2018 - 04:42

హైదరాబాద్, అక్టోబర్ 29: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరిన విధంగా భద్రత కల్పించాలని కేంద్రప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అయితే భద్రతకు అయ్యే ఖర్చును రేవంత్‌రెడ్డి భరించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

10/30/2018 - 04:34

హైదరాబాద్, అక్టోబర్ 29: తమ పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు వైవీ సుబ్బారెడ్డి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

10/30/2018 - 04:33

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: సీబీఐ నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ వ్యాపారవేత్త సాన సతీష్ సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐలో లంచాలు ఇచ్చిన కేసుకు సంబంధించి ఏ-2గా ఉన్న తనపై, తన ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. అలాగే విచారణకు రావాలని సీబీఐ సమన్లు జారీ చేసిందని, విచారణ సమయంలో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.

Pages