S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/29/2018 - 23:45

మార్కాపురం, అక్టోబర్ 29: కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి పందరబోయిన ఇంద్రకళావతి (20) అనుమానాస్పద మృతిని పరువుహత్యగా చూసేందుకు ఎలాంటి ఆధారాలు లభ్యం కావడం లేదని మార్కాపురం డివైఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ ఎలా మృతిచెందింది అనేదానిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

10/29/2018 - 23:32

తిరుపతి, అక్టోబర్ 29: స్థానిక అన్నారావు సర్కిల్ సమీపంలో భవానీ నగర్ నుంచి రుయా హాస్పిటల్ వైపు వెళుతున్న ప్రైవేట్ బస్సు ఢీకొని గుర్తు తెలియని దాదాపు 35 సంవత్సరాలు వయస్సున్న మహిళ మృతి చెందింది. రోడ్డు దాటుతున్న ఆమెను బస్సు ఢీకొన్న సంఘటనలో ఆమె తలకు తీవ్రగాయమైంది. స్థానికులు వెంటనే ఆమెను రుయా ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.

10/29/2018 - 23:29

పుత్తూరు, అక్టోబర్ 29: ఆస్తి తగాదాల కారణంగా ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చిన సంఘటన ఆదివారం సాయంత్రం పుత్తూరు పట్టణంలో కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు... పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న సుబ్రహ్మణ్యం కుమారుడు పైని (31)కి సమీప బంధువులతో గత కొంత కాలంగా ఆస్తి తగాదాలున్నాయి. న్యాయస్థానంలో కేసు కూడా నడుస్తోంది.

10/29/2018 - 23:22

గోదావరిఖని టౌన్, అక్టోబర్ 29: ప్రజల రక్షణ కోసం ఎప్పటికప్పుడు గస్తీ తిరిగే బ్లూకోట్స్, పెట్రోలింగ్ బృందాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఎన్టీపీసీ ఇడిసి సెంటర్‌లో బ్లూకోట్స్, వాహనాల తనిఖీ బృందాలకు ఒక్క రోజు శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సిపి సత్యనారాయణ వాహనాల తనిఖీ బృందాలకు ప్రత్యేక సూచనలు చేశారు.

10/29/2018 - 23:20

సిరిసిల్ల, అక్టోబర్ 29: సిరిసిల్ల కూరగాయల మార్కెట్‌లో తిరిగే ఆవు, దూడలను మున్సిపల్ ఉద్యోగి దొంగతనంగా కళేబరాలకు తరలించిన ఉదంతం వెలుగు చూసింది. ఈ సంఘటనపై ‘్థర్మ జాగరణ’ ఆధ్వర్యంలో అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో మున్సిపల్ ఉద్యోగితో పాటు వాటిని కళేబరానికి తరలిస్తున్న వ్యక్తులు పారిపోయారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనలో ఆవు, దూడను తరలించడానికి ఉపయోగించిన వాహనం పట్టుబడింది.

10/29/2018 - 22:38

ద్వారకాతిరుమల, అక్టోబర్ 29: జ్వరంతో బాధపడుతున్న ఓ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని దొరసానిపాడులో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన కథనం ప్రకారం..గ్రామానికి చెందిన ఉనమట్ల రాంబాబు, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వీరిలో రెండవ కుమార్తె ప్రసన్న (16) జంగారెడ్డిగూడెంలోని వెంకటేశ్వర కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది.

10/29/2018 - 22:30

కాకినాడ సిటీ, అక్టోబర్ 29: బంగారు నగలు తయారుచేసే ద్రావకం షాపుల్లో పనిచేస్తూ యజమానుల కళ్లుగప్పి వారి బంగారు నగలను ముద్దలుగా మార్చి దానిని కాజేయడానికి ప్రయత్నించిన ఇద్దరు సోదరులను కాకినాడ క్రైమ్ పోలీసులు అరెస్టుచేశారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలియజేశారు.

10/29/2018 - 22:27

రాజమహేంద్రవరం, అక్టోబర్ 29: రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలోని జంగాలకాలనీలో మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. 2016లో ఇదే కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సంఘటనలో సుమారు 95 ఇళ్లు దగ్ధమయ్యాయి. అప్పటి నుంచి బాధితులు తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు మళ్లీ అదే ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో 33 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.

10/29/2018 - 22:11

పుట్టపర్తి, అక్టోబర్ 29 : అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రఖ్యాత గాంచిన పుట్టపర్తిలోని లాడ్జ్‌లు, అపార్ట్‌మెంట్‌ల నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకుంటే చర్యలు తప్పవని డీఎస్పీ రామవర్మ వారిని హెచ్చరించారు. సోమవారం పుట్టపర్తిలోని సాయిసదన్ గెస్ట్‌హౌస్ నందు లాడ్జిలు, అపార్ట్‌మెంట్, వ్యాపార సముదాయ నిర్వాహకులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు.

10/29/2018 - 22:00

* నిబంధనలు ఉల్లఘిస్తే మూడేళ్ళు జైలు
* ఫిర్యాదు కోసం హెల్ఫ్‌లైన్ 182
* వాల్తేరుడివిజన్ అధికారుల హెచ్చరిక
==========================

Pages