S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/29/2018 - 04:27

నిజామాబాద్, అక్టోబర్ 28: బాబ్లీ ప్రాజెక్టు వివాదం తాలూకు నమోదైన కేసును విచారణ జరుపుతున్న మహారాష్టల్రోని ధర్మాబాద్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తికి తాజాగా బెదిరింపు లేఖ అందడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని కమ్మ సంఘం పేరిట గుర్తు తెలియని వ్యక్తులు మూడు పేజీల బెదిరింపు లేఖను స్పీడ్ పోస్టు ద్వారా పంపించారు.

10/29/2018 - 03:45

తిరువనంతపురం, అక్టోబర్ 28: స్వామి అయ్యప్ప దేవాలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి పరుష వ్యాఖ్యలు చేసిన అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్ ఈశ్వర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కొచికి చెందిన పోలీసులు ఈశ్వర్‌ను అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ 153, ఐపీసీ 117 కింద కేసులు నమోదు చేశారు. మహిళలు కనుక దేవాలయంలో ప్రవేశిస్తే రక్తపాతం సృష్టిస్తామంటూ రాహుల్ ఈశ్వర్ గత వారం విలేఖర్ల సమావేశంలో హెచ్చరించారు.

10/29/2018 - 02:19

ధుర్గి, అక్టోబర్ 28 : కాలువలో పడి వ్యక్తి గల్లంతయి సంఘటన గ్రామంలో చోటు చేసుకుంది. జంగాల కాలనీకి చెందిన దుడ్డుకూరి అంజయ్య(52), కృష్ణలు శనివారం రాత్రి శ్యామరాజపురం లాకుల వద్దకు చేపల వేటకు వెళ్లారు. చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి దుడ్డుకూరి అంజయ్య కాలువలోపడి గల్లంతయ్యాడు.

10/29/2018 - 02:11

డి గన్నవరం, అక్టోబర్ 28: పాఠశాలకు సెలవురోజు కావడంతో పి గన్నవరం హైస్కూల్ గ్రౌండ్‌లో అప్పటివరకు తోటి పిల్లలతో ఆటలు ఆడి మధ్యాహ్నం 12 గంటలకు సేద తీరేందుకు గోదావరి చెంతకు చేరారు. గోదావరి నదిలో స్నానానికని నలుగురు విద్యార్థులు దిగారు. నదికి పోటు సమయం కావడంతో వారు నది మధ్యలో ఉన్న దిబ్బకు వెళ్లే తొందరలో గోదావరి నదీ ప్రవాహాన్ని గమనించలేదు. దీనితో ఆ నలుగురూ ప్రహహంలో చిక్కుకున్నారు.

10/29/2018 - 01:53

తిరుపతి, అక్టోబర్ 28: స్థానిక కొర్లగుంటకు చెందిన లావణ్య అనే వివాహిత ఆదివారం తెల్లవారు జామున ఇంటిలోని వెంటిలేటర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండటంపై ఆమె తల్లి, స్థానికులు ఆమె భర్తపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉడ్ వర్క్ చేసుకుని జీవించే ఈశ్వర్ ప్రేమ పేరుతో లావణ్య వెంటపడి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప ఉంది.

10/29/2018 - 01:19

కీసర, కుషాయిగూడ, అక్టోబర్ 28: ఆధ్యాత్మికత ముసుగులో అమాయక యువతులకు మాదకద్రవ్యాలను అలవాటు చేసిన హోమీజేబాబా ఆశ్రమం వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేశారు. యువతుల తల్లిదండ్రులు తెలిపిన కథనం ప్రకారం కాప్రా వంపుగూడలో ఆధ్యాత్మిక ఆశ్రమం పేరుతో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువతులను తీసుకొచ్చి బంధించినట్లు ఆందోళన వ్యక్తం చేశారు.

10/29/2018 - 01:15

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 28: వారంతా పొట్ట కూటి కోసం పండించిన కూరగాయలను నగరానికి తీసుకెళ్లి విక్రయించుకొని జీవించే రైతు కూలీలు. రోజువారీగానే ఆదివారం తెల్లవారుఝామున కూరగాయలను ఆటోలో వేసుకొని విక్రయించుకునేందుకు నగరానికి బయలుదేరారు.

10/29/2018 - 00:24

కొత్తకోట ,అక్టోబర్ 28: మండల కేంద్ర సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టువద్ద ఎస్‌ఐ తనిఖి చేస్తుండగా రూ. 6లక్షలు సీజ్ చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రవికాంత్‌రావులు తెలిపారు. టీఎస్ 06వికె 4371 అనే నెంబర్ గల ద్విచక్ర వాహనంపై కనిమెట్టకి చెందిన మల్లేష్ రూ.4లక్షలు తరలిస్తుండగా వాహనాన్ని సీజ్ చేశారు.

10/29/2018 - 00:27

న్యూఢిల్లీ: అయోధ్యలోని బాబ్రీ మసీదు - రామ జన్మభూమి వివాదానికి చెందిన 2.77 ఎకరాల భూమిని రాంలల్లా, సున్ని వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారాకు సమానంగా పంచుతూ అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు సోమవారం నుంచి విచారణ ప్రారంభించనున్నది.

10/29/2018 - 00:00

అనంతపురం, అక్టోబర్ 28 : తాళం వేసిన ఇళ్లకు లక్ష్యంగా చేసుకుని పగలు, రాత్రిళ్లు జిల్లాలో సులువుగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట షికారీ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.

Pages