S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/28/2018 - 23:57

ఆత్మకూరు, అక్టోబర్ 28: ఆత్మకూరు మా డాబా వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదంలో వడ్డే మహేంద్ర (19) గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. మాల రాజేష్ తీవ్ర గాయాల పాలై ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.

10/28/2018 - 23:44

సంతమాగులూరు, అక్టోబర్ 28: విద్యుత్ షార్ట్‌సర్య్కూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు పూరిళ్లు దగ్ధమై నాలుగు లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లిన ఘటన బల్లికురవ మండలం ముక్తేశ్వరంలో ఆదివారం జరిగింది. ఈ ప్రమాదంలో దాసరి నాగేశ్వరరావు, ఉమ్మనబోయిన అంజమ్మ, నాగిశెట్టి చినఅంజయ్య, చెన్నూరి వీరయ్యకు చెందిన పూరిళ్లు భస్తీపటలమయ్యాయి.

10/28/2018 - 05:50

పాడేరు, అక్టోబర్ 27: పాడేరు ఆర్.టి.సి. డిపోకు చెందిన డ్రైవర్ ఇ.ఎస్.నారాయణ శనివారం గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణ ముగించుకునే సమయంలో గుండెపోటు రావడంతో ప్రయాణికులకు ఎటువంటి ముప్పు వాటిల్లలేదు. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపేట బస్సు సర్వీసుకు శుక్రవారం మధ్యాహ్నాం విధులకు వెళ్లిన డ్రైవర్ నారాయణ శనివారం మధ్యాహ్నాం పాడేరుకు చేరుకున్నారు.

10/28/2018 - 05:00

వికారాబాద్, అక్టోబర్ 27: రైలు కింద పడి గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ రైల్వే పోలిస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ రాఘవేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం రైల్వే జంక్షన్ ఏ క్యాబిన్ వద్ద శనివారం 30 నుండి 35 సంవత్సరాల వయస్సున్న గుర్తుతెలియని యువకుడు గూడ్సు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తెలు పు, నలుపు చుక్కల లుంగీ, తెలుపు, నలుపు గళ్ళ ఫుల్ షర్టు ధరించాడు.

10/28/2018 - 04:54

పుణె, అక్టోబర్ 27: మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అభియోగంపై అరెస్టయిన హక్కుల కార్యకర్తలు సుధా భరద్వాజ్, వెర్నర్ గోన్‌సాల్వెస్, అరుణ్ ఫెర్రీరాలను నవంబర్ 6వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ పుణె కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ముగ్గురు కార్యకర్తలు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు శుక్రవారం తిరస్కరించిన విషయం తెలిసిందే.

10/28/2018 - 04:47

బైరెడ్డిపల్లి, అక్టోబర్ 27: మృత్యువులోను భర్తతో పాటు భార్య మృతి చెందిన సంఘటన మండలంలోని కుప్పనపల్లిలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ భర్తను రక్షించబోయి భార్య కూడా బావిలో పడి మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. కుప్పనపల్లిలో నివసించు సోమశేఖర్(38)కు ఇటీవలన ఆరునెలల క్రితం పవనమ్మ(28)తో రెండో వివాహం జరిగింది. సోమశేఖర్‌కు తొలుత ఒక మహిళతో వివాహమైంది.

10/28/2018 - 04:37

జన్నారం,అక్టోబర్ 27: జన్నారం మండలం బొమ్మెన రహదారి సమీపంలో మూలమలుపు వద్ద శనివారం సాయంత్రం మోటారు బైక్ అదుపుతప్పి పెద్ద బండరాయిని ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం దండేపల్లి మండలం కస్పెల్లి గ్రామానికి చెందిన పుట్టపాక అంజయ్య(45), ప్రకాశం జిల్లా గిద్దెలూరుకు చెందిన వనపర్తి మరిదాసు (50) ఇద్దరు స్నేహితులు మేదరిపేటలో జీవనం సాగిస్తున్నారు.

10/28/2018 - 04:26

హైదరాబాద్, అక్టోబర్ 27: వేలకోట్ల రూపాయలు డిపాజిట్ దార్లనుంచి వసూళ్ళు చేసి వాటిని సొంత ఖాతాల్లోకి మార్చుకున్న హీరాగోల్డ్ కంపెనీలో కీలక వ్య్తిక్తిగా ఉన్న బిజూ తామస్‌ను బంజారా హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును క్రైంమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పచెప్పారు. బిజూ దామస్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని సీనియర్ పోలీస్ అధికారులు సూచించడంతో హీరాగ్రూపు మోసాలు బయటపడతాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.

10/28/2018 - 04:19

అమలాపురం, అక్టోబర్ 27: విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై దాడికి పాల్పడిన కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో వరుసగా రెండో రోజు శనివారం కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు దర్యాప్తు నిర్వహించారు.

10/28/2018 - 04:17

విశాఖపట్నం, అక్టోబర్ 27: వైసీపీ అధినేత జగన్‌పై హత్యాయత్నం కేసులో సిట్ అధికారులు విచారణ అత్యంత గుట్టుగా చేస్తున్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగి మూడు రోజులు గడుస్తుండగా, విచారణలో ఇప్పటి వరకూ ఎటువంటి పురోగతి కన్పించలేదు. అయితే హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్‌ను పలు విడతలుగా విచారించిన సిట్ పోలీసులు లేఖ రాసేందుకు సహకరించిన సహచరుడు రేవతిపతిని కూడా విచారిస్తున్నారు.

Pages