-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
వెల్దండ, అక్టోబర్ 14: హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై గల వెల్దండ మండల కేంద్రానికి సమీపంలో అదివారం తెల్లవారుజామున అర్టీసీ బస్సు ఢీకొని వడ్తావత్ వెంకట్యనాయక్ (45) అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై వీరబాబు తెలిపారు.
ఎస్.రాయవరం, అక్టోబర్ 14: నక్కపల్లి మండలం కాగిత టోల్గేట్ వద్ద శనివారం ఉదయం జరిగిన హత్యోదంతానికి సంబంధించి రెండు గ్యాంగ్ల మధ్య జరుగుతున్న తగాదాలే కారణమని తమిళనాడు రాష్ట్రంలోని మధురైకు చెందిన పాండ్య, ఉదయ్ గ్యాంగ్ల మధ్య గత నాలుగేళ్లుగా ఆధిపత్య పోరు కొనసాగుతుందని, ఇప్పటికే గ్యాంగ్కు సంబంధించి ఒకరు మృతి చెందగా మరో గ్యాంగ్ నేత అరెస్టయ్యారని, శనివారం జరిగిన హత్యకు సంబంధించి ఈ గ్యాంగ్వార్లో భాగమేన
వేటపాలెం, అక్టోబర్ 14: చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదానికి గురై మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని పొట్టి సుబ్బయ్యపాలెంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, గ్రామానికి చెందిన మత్స్యకారుడు కొండూరి పోలయ్య (42) ఆదివారం ఉదయం గ్రామానికి సమీపంలోని కొత్తకాలువ సముద్రంలో కలిసే పొగురు వద్ద చేపలు పడుతుండగా ప్రమాదానికి గురై నీటిలో మునిగిపోయాడు.
రామచంద్రపురం, అక్టోబర్ 14: కె గంగవరం మండలం కుందూరు జడ్పీ హైస్కూలు వద్ద ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా పిడుగు పడి బీటెక్ చదువుతున్న సుంకర పవన్ అనే విద్యార్థి మరణించాడు. అతనితోపాటు మరో ఇద్దరు సమీపంలోనే ఉన్నప్పటికీ వారు పిడుగు పాటు నుంచి రెప్పపాటులో తప్పించుకున్నారు.
సీలేరు, అక్టోబర్ 14: మల్కన్గిరి జిల్లా అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేసినట్టు మల్కన్గిరి జిల్లా ఎస్పీ జగన్మోహన్ మిశ్రా తెలిపారు.
పాచిపెంట, అక్టోబర్ 14: ట్రాక్టర్ ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన వెలుగుచూసింది. మండలంలోని నీలమవలస గ్రామానికి చెందిన దళాయి సన్యాసిరావు(19)ను ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడని ఎస్ఐ సన్యాసినాయుడు తెలిపారు. ఈ మేరకు ఆయన అందించిన వివరాల ప్రకారం సన్యాసిరావు గ్రామంలో జరగనున్న ఓ శుభకార్యానికి అవసరమైన సామాన్ల కోసం ద్విచక్రవాహనంపై ఆదివారం గురివినాయుడుపేటకు వచ్చాడు.
గుర్గావ్, అక్టోబర్ 13: ఒక జడ్జి భార్య, కుమారుడిపై అతని అంగరక్షకుడే కాల్పులు జరిపిన ఉదంతమిది. ఢిల్లీలో శనివారం జరిగిన ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులిద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ, వారి పరిస్థితి విషమంగా ఉంది. తూర్పు ఢిల్లీ డీసీపీ సులోచన గజ్రాజ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడ (క్రైం), అక్టోబర్ 13: బెజవాడ కేంద్రంగా చేసుకుని పొరుగు జిల్లాల్లో పెద్ద ఎత్తున క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు అందిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ 22మంది నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 13లక్షలకు పైగా నగదుతోపాటు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
జఫర్గడ్, అక్టోబర్ 13: రోజు రోజుకూ స్ర్తిలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయ. నగరంలో చదువుకుంటున్న ఓ బాలిక దసర సెలవు రావ డంలో ఇంటి వచ్చింది. కామంలో కళ్లు మూసు కుపోయన ఓ యువకుడు తన ఇంటి సమీపం లోని ఓ బాలికపై పశువుగా ప్రవర్తించాడు.
గజ్వేల్, అక్టోబర్ 13: గజ్వేల్ మున్సిపల్ పరిదిలోని రాజిరెడ్డిపల్లి కుంటలో పడి ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబందించి గజ్వేల్ సీఐ ప్రసాద్ అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన శశాంక్(11) తన స్నేహితులతో కలసి ఈత కొట్టేందుకు రాజిరెడ్డిపల్లి కుంటలో దిగాడు.