-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
గజపతినగరం, అక్టోబర్ 2: మండలంలోని జిన్నాంగ్రామంలో పురుగులు మందు సేవించి వివాహిత ఆత్మహ్యతచేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. సంఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గేదెల జ్యోతి(28) అందుబాటులోగల పురుగుల మందును సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఈ మేరకు పరిసర ప్రాంతాల వారు జ్యోతిని వైద్య చికిత్స నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందింది.
హైదరాబాద్, అక్టోబర్ 2: భూ వివాదాన్ని పరిష్కరించడానికి ఇద్దరి మధ్య రాజీ కుదుర్చడానికి బాచుపల్లి డిప్యూటీ తహశీల్దార్ బి.శ్రీదేవి రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులకు పట్టుబడ్డారు.
చిత్రం.. లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ బాచుపల్లి మండల డిప్యూటీ తహశీల్దార్ శ్రీదేవి
మర్రిగూడ, అక్టోబర్ 2: జీవితాంతం తోడుగ ఉండాల్సిన భర్త,తన బార్యను ఉరేసి హత్య చేశాడు. మంగళవారం కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఎరుగండ్లపల్లి గ్రామానికి చెందిన పాలకుర్ల జంగయ్య 2010 సంవత్సరములో చింతపల్లి మండలం పోలేపల్లి గ్రామానికి చెందిన శ్రీలత (25) తో వివాహమైంది దంపతులిద్దరూ బతుకుదెరువు కోసం హైద్రబాద్ లోని హస్తినపురంలో వుంటూ పనిచేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
న్యూఢిల్లీ, అక్టోబర్ 2: జాతిపిత, మహాత్మాగాంధీ హత్యా ఘటనపై తాజాగా దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ ముంబయికి చెందిన డాక్టర్ పంకజ్ ఫడ్నీస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మహాత్మాగాంధీ హత్య వెనక పెద్ద కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించి తాను సేకరించిన డాక్యుమెంట్లను ఆయన జతపరిచి పిటిషన్ దాఖలు చేశారు. గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితులపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.
బొమ్మనహాల్, అక్టోబర్ 2 : మండల పరిధిలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన రైతు కురుబ గాదిలింగ (40) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం తన పొలానికి వెళ్లిన గాదిలంగ పురుగుల మందుతాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమణించిన గరుగు, పొరుగు రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తమై బళ్లారికి తరలించారు.
యాదగిరిగుట్ట, అక్టోబర్ 2: యాదాద్రిపై మంగళవారం ప్రేమజంట ఆత్మహత్య యత్నం చేసింది. హైద్రాబాద్ ఆల్వాల్కు చెందిన ఎం.మనీశ్(20), పీ.బీ.అక్షయ(18)లు మంగళవారం శ్రీ చక్ర భవనం మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య యత్నం చేశారు. వారిరువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వారిని భువనగిరి ఆసుపత్రికి తరలించగా వారిద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
చిత్తూరు, అక్టోబర్ 2: చిత్తూరు నగరం ఇరువారం బ్రిడ్జి కింద కవల పురిటి బిడ్డల మృత దేహాలు ఉండటం నగరంలో కలకలం రేకెత్తించింది. ఈ సంఘట మంగళవారం రాత్రి వెలుగు చూసింది. చిత్తూరు నగర శివారులోని ఇరువారం బ్రిడ్జి కింద రెండు పురిటి బిడ్డల మృత దేహాలు ఉన్నాట్లు గుర్తించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో ఈ సంఘట వెలుగులోకి వచ్చింది.
కారంచేడు, అక్టోబర్ 2: కంటికి రెప్పలా కాపాడాల్సిన అనే్న కాలయముడయ్యాడు. తాతల కాలం నాటి నుంచి వస్తున్న కేవలం ఏడు సెంట్ల స్థల వివాదం చెల్లి ప్రాణం తీస్తే... అన్నను జైలు పాలు చేయనుంది. ఎప్పుడూ ఇరుగు పొరుగు.. ప్రేమ ఆప్యాయతలతో ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి, జీవణం సాఫీగా, ప్రశాంతంగా సాగించే స్వర్ణ గ్రామంలో హత్య జరగడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.
పీలేరు, అక్టోబర్ 1: జిల్లాలోని ఎర్రవారి పాల్యెం మండలం తలకోన అటవీ ప్రాంతంలో ఆ శాఖ అధికారులు నిర్వహించిన కూంబింగ్లో రూ.30లక్షల విలువచేసే 12 దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు చామలరేంజ్ ఫారెస్ట్ రేంజర్ రఘునాథ్ వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున అటవీశాఖ అధికారులకు అందిన సమాచారంతో కుప్పగుట్ట వద్ద కూంబింగ్ నిర్వహిస్తుండగా 7మంది స్మగ్లర్లను గుర్తించామన్నారు.
జగిత్యాల, అక్టోబర్ 1: రోజురోజుకు సినిమాల ప్రభావంతో యువత పెడదారి పడుతోంది. జగిత్యాలలో ఆర్ఎక్స్ 100 సినిమా తరహా ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రభా వంతో పట్టణానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఆత్మాహుతి చేసుకున్నట్టు జగిత్యాల డీఎస్పీ ఎం. వెంకటరమణ వెల్లడించారు.