S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

10/01/2018 - 00:10

నర్సీపట్నం, సెప్టెంబర్ 30: గుట్కాను తరలిస్తున్న లారీని పట్టణ పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీ ఐ సింహాద్రినాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం లారీతో గుట్కాను తీసుకువచ్చి కొత్తవీధిలోని గొడౌన్‌కు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 100 బస్తాల్లో ఉన్న గుట్కా ఫ్యాకెట్ల విలువ సుమారు మూడు లక్షలు ఉంటుందని తెలిపారు.

09/30/2018 - 23:59

పంగులూరు, సెప్టెంబర్ 30: మండలంలోని కశ్యాపురం గ్రామంలో సరదాగా ఈతకు వెళ్లి ఇద్దరు మృత్యువాత పడిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు అందించిన సమాచారం మేరకు గ్రామంలోని దూళిపాళ్ల అంజమ్మ దశదిన కర్మకు హాజరైన ఆమె బంధువు మైనంపాడు గ్రామానికి చెందిన దూళిపాళ్ల శివరామకృష్ణ(45), గుంటూరు చైతన్యలో 9వ తరగతి చదువుతున్న చింతల విష్ణు(15) తాత తద్దెనానికి వచ్చాడు.

09/30/2018 - 23:58

కనిగిరి, సెప్టెంబర్ 30: కూలీ పనులు ముగించుకుని వస్తూ డివైడర్‌ను ఢీకొని టాటా ఏస్ వాహనం బోల్తాపడిన సంఘటన ఆదివారం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మర్రిపూడి మండలం కూచిపూడిపల్లి గ్రామానికి చెందిన కూలీలు కూలీ పనుల కోసం సిఎస్‌పురం మండలం గోగులపల్లిలో బత్తాయి తోటలో కాయలు కోసేందుకు వచ్చారు.

09/30/2018 - 23:44

నంద్యాల రూరల్, సెప్టెంబర్ 30: నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన జమాల్‌బాషా (25) శనివారం తన ఇంట్లో ప్రత్యేక హోదా కోసం హోదారాలేదని మనస్థాపానికి గురై ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందినట్లు జమాల్‌బాషా సూసైడ్‌నోట్‌లో రాసినట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.

10/01/2018 - 02:12

ఆదోని, సెప్టెంబర్ 30: ఆదోనిలో దొంగలు మరోసారి హాల్‌చల్ చేశారు. పట్టణంలోని ఎంఎం రోడ్డులో ఉన్న ఏటీఎంలోని డబ్బులను దోచుకోవడానికి శనివారం అర్ధరాత్రి ఏటీఎం మిషన్ మొత్తాన్ని పగలగొట్టారు. ఏటీఎంకు అనుసంధానం చేసిన కంప్యూటర్ డిస్క్‌ను కూడా మొత్తం ధ్వంసం చేశారు. ఏటీఎంలోను డబ్బులు దోచుకోవడానికి దొంగలు విశ్వప్రయత్నం చేశారు. కాని వారి ప్రయత్నం ఫలించలేదు.

09/30/2018 - 23:37

కల్లూరు, సెప్టెంబర్ 30: మండలపరిధిలోని చెన్నూరు, పెద్దకోరుకొండి గ్రామాల మధ్య ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు.

09/30/2018 - 23:26

తిరుపతి, సెప్టెంబర్ 30: తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసి ఉన్న వాహనాల అద్దాలను పగులగొట్టి అందులోని విలువైన వస్తువులను చోరీ చేస్తున్న తమిళనాడు, నల్గొండకు చెందిన ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను శనివారం అరెస్టు చేసినట్లు తిరుపతి క్రైమ్ సబ్ డివిజన్ డీఎస్పీ రవిశంకర్ రెడ్డి చెప్పారు.

09/30/2018 - 02:38

సింహాచలం, సెప్టెంబర్ 29: పెందుర్తి పోలీసు స్టేషన్ పరిధిలొని సింహపురి కాలని వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రహదారి ప్రమాదంలో గాయపడ్డ అనె్నంరెడ్డి గంగ (65) ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు.

09/30/2018 - 02:21

బనగానపల్లె, సెప్టెంబర్ 29: నందివర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుకూరు-రామకృష్ణాపురం అడ్డరోడ్డు సమీపంలో శనివారం ట్రాక్టర్ బోల్తాపడిన సంఘటనలో లోడింగ్ కార్మికుడు రవి(21) దుర్మరణం చెందినట్లు ఎస్‌ఐ శంకరయ్య తెలిపారు. బేతంచర్ల వైపు నుంచి పలుకూరు గనులకు నాపరాయి లోడింగ్‌కు వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడిందని, ప్రమాదానికి అతివేగమే కారణమని ఎస్‌ఐ తెలిపారు.

09/30/2018 - 02:15

పొన్నూరు, సెప్టెంబర్ 29: పంటపొలాల్లో పడి ఉన్న కరెంట్‌స్తంభం వైరు తగిలి షాక్‌కు గురై పొన్నూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలి మోదుకూరి నాగవర్ధిని (35) శనివారం మృతిచెందింది. ఈ సంఘటనలో మరో మహిళ కూడా స్వల్పంగా గాయపడింది. మాచవరం గ్రామానికి చెందిన మహిళా కూలీ నాగవర్ధిని శనివారం ఉదయం ఆ గ్రామంలోని పొలం పనులకు వెళ్లింది.

Pages