S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

09/30/2018 - 02:06

తిరుపతి/కల్లూరు, సెప్టెంబర్ 29: ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లపై టాస్క్ఫోర్స్ ఐజీ కాంతారావు ఆధ్వర్యంలో పంజా విసురుతున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా స్మగ్లర్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ సరికొత్త ప్రణాళికలతో ముందుకెళుతున్నారు. శనివారం తెల్లవారుజామున నారావారిపల్లి మార్గంలో టాస్క్ఫోర్స్ ఆర్‌ఐ భాస్కర్, బృందం తన సిబ్బందితో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

09/30/2018 - 02:05

తిరుపతి, సెప్టెంబర్ 29: మనిషి ప్రాణం విలువ రూ. 2,200లు. ఇదేంటనుకుంటున్నారా.. తిరుపతి పుణ్యక్షేత్రంలోని ప్రైవేట్ బస్టాండ్ సమీపంలో గత 9 రోజుల క్రితం తమిళనాడుకు చెందిన ముగ్గురు నేరస్థులు కడప జిల్లాకు చెందిన ఓ యువకుడిని గొంతుకోసి చంపిన ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ హత్యకు సంబంధించి పోలీసులు చాకచక్యంగా ఛేదించారు.

09/30/2018 - 01:55

నర్సంపేట, సెప్టెంబర్ 29: విద్యుదాఘాతంతో రైతు దుర్మరణ చెందిన సంఘటన ఖానాపురం మండలంలోని ధర్మరావుపేటలో శనివారం చోటు చేసుకుంది. ధర్మారావుపేటకు చెందిన లంకెనపల్లి ముత్తయ్య (56) శనివారం సాయంత్రం తన వ్యవసాయ బావి వద్ద విద్యుత్ మోటార్‌ను ఆన్‌చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్‌కి గురై మృతిచెందాడు.

09/30/2018 - 01:54

స్టేషన్ ఘన్‌పూర్, సెప్టెంబరు 29: ప్రమాదవశాత్తు రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని రైల్వే గేటులో శనివారం రాత్రి జరిగింది. శనివారం రాత్రి పది గంటలకు ఖాజీపేట నుండి సికింద్రాబాదుకు బయలుదేరిన ధానాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి ఘన్‌పూర్ రైల్వేగేట్ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు రైలుబోగి నుండి జారి కిందపడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.

09/30/2018 - 01:44

జోగిపేట, సెప్టెంబర్ 29: జోగిపేట పట్టణంలోని ఎస్‌బీఐ బ్యాంక్ వెనకాల యువకుడి శవాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్య, జోగిపేటకు చెందిన ఇద్దరు యువకులతో కలిసి సంగారెడ్డిలో ప్రైవేటు పనులు చేస్తున్నారు. ఈ నెల 12న అతన్ని వీరిద్దరు ఎల్లయ్యను హత్య చేసి పూడ్చిపెట్టారు.

09/30/2018 - 01:30

మునగాల, సెప్టెంబర్ 29: మండలకేంద్రంలోని నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలో స్ధానిక హెడ్ రెగ్యూలేటర్ వద్ద శనివారం మహిళ మృతదేహాం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణం సీతారాంపురంకు చెందిన తడకమళ్ల విజయమ్మ(58) కుటుంబ ఆర్ధిక ఇబ్బందుల కారణంగా రెండు రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె సాగర్ కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా మృతదేహాం ఇక్కడ లభ్యమైనట్లు తెలిపారు.

09/30/2018 - 01:30

చౌటుప్పల్, సెప్టెంబర్ 29: చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం, కొయ్యలగూడెం గ్రామాలలో శనివారం ఇద్దరు యువకులు వేర్వేరు ఘటనలతో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించిన అమ్మాయి తిరస్కరించిందని చెట్టుకు ఉరి వేసుకోని ఒకరు, ఆర్ధిక సమస్యలు, మానసిక ఇబ్బందులతో నైట్రెట్ తిని మరోకరు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలలోకి వెళ్తే...

09/30/2018 - 01:29

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 29: మిర్యాలగూడ మండలం ఐలాపురం గ్రామ శివారులో శనివారం మిర్యాలగూడ పట్టణానికి చెందిన శివాని స్కూల్ బస్సు మోటార్ సైకిల్‌ను ఢీ కొనడంతో బైక్‌పై వెళ్తున్న తేజావత్ సిద్ధునాయక్ (22) అక్కడికక్కడే మరణించగా, బానోతు సాయిరాం తీవ్ర గాయాలకు గురయ్యారు. గాయపడ్డ సాయిరాంను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స జరుపుతున్నారు.

09/30/2018 - 01:28

నకిరేకల్, సెప్టెంబర్ 29: భార్య గొంతు కోసి భర్త పరారైన సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చింత సంతోషతో ఆమె భర్త చింత మల్సూర్ నిత్యం మద్యం సేవించి గొడవ పడుతుండేవాడు. ఈ గొడవలు భరించ లేక గత మూడు వారాల క్రితం పుట్టింటికి వెళ్లగా పెద్ద మనుషుల సూచన మేరకు మూడురోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చింది.

09/30/2018 - 01:09

మేడ్చల్, సెప్టెంబర్ 29: చెక్కు బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి మేడ్చల్ 15వ ఎంఎం కోర్టు రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షలు పరిహారం కింది అందజేయాలని ఆదేశించింది. ఎస్‌ఐ కొల్లు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం లావాదేవీల విషయంలో మేడ్చల్ పట్టణానికి చెందిన మంజులకు గుండ్లపోచంపల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి రూ. 5లక్షల చెక్కును అందించాడు.

Pages